AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG : మన దేశంలో మ్యాచ్… కానీ హోస్ట్ మాత్రం అఫ్గానిస్థాన్.. ఇది కదా ట్విస్ట్ అంటే

IND vs AFG : భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు ఢిల్లీ వేదిక కానుంది. అయితే ఈ మ్యాచ్‌లకు అఫ్గానిస్థాన్ అధికారిక ఆతిథ్య జట్టుగా వ్యవహరించడం విశేషం. ఆసియా క్రీడలకు ముందు జరిగే ఈ సిరీస్ భారత యువ జట్టుకు కీలక సన్నాహకంగా మారనుంది.

IND vs AFG : మన దేశంలో మ్యాచ్... కానీ హోస్ట్ మాత్రం అఫ్గానిస్థాన్.. ఇది కదా ట్విస్ట్ అంటే
India Vs Afghanistan
Rakesh
|

Updated on: Jul 24, 2026 | 9:46 AM

Share

IND vs AFG : జపాన్ వేదికగా జరగబోయే ఆసియన్ గేమ్స్ 2026కు భారత పురుషుల క్రికెట్ జట్టును సిద్ధం చేసే క్రమంలో బీసీసీఐ ఒక సరికొత్త, చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆసియా క్రీడలకు ముందు సెప్టెంబర్ నెలలో భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్‌కు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. మన దేశ రాజధాని న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే ఈ మ్యాచ్‌లు జరిగినప్పటికీ, ఈ సిరీస్‌కు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డ్ అధికారిక ఆతిథ్య జట్టుగా వ్యవహరించనుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత గడ్డపై భారత జట్టుకే ప్రత్యర్థి జట్టు హోస్ట్‎గా వ్యవహరించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మ్యాచ్‌లు

ESPNcricinfo, ప్రముఖ మీడియా కథనాల ప్రకారం.. ఈ మూడు టీ20ల సిరీస్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో (లేదా సెప్టెంబర్ 13, 16, 19 తేదీల్లో) న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించనున్నారు. అఫ్గానిస్థాన్‌లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, భద్రతా సవాళ్లు ఉన్నందున, ఆ జట్టు గతంలో డెహ్రాడూన్, గ్రేటర్ నోయిడా, లక్నో వంటి భారతీయ వేదికలలో ఇతర విదేశీ జట్లతో మ్యాచ్‌లు ఆడింది. అయితే బీసీసీఐ, అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డ్ మధ్య కుదిరిన ఆర్థిక, రవాణా ఒప్పందాల ప్రకారం.. ఈసారి టీమిండియాపై జరిగే సిరీస్‌కు అరుణ్ జైట్లీ స్టేడియాన్ని అఫ్గానిస్థాన్ తమ హౌమ్ గ్రౌండ్‌గా వాడుకోనుంది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) కూడా ఈ సిరీస్‌కు అనుగుణంగా స్థానిక టోర్నీలను షెడ్యూల్ చేస్తోంది.

ఆసియన్ గేమ్స్‌కు ముందు కీలక ప్రాక్టీస్

ఆసియా క్రీడలలో పురుషుల క్రికెట్ ఈవెంట్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనుంది. దానికి సరిగ్గా వారం రోజుల ముందు ఈ టీ20 సిరీస్ జరగనుండటంతో భారత యంగ్ టీమ్‌కు ఇది ప్రాక్టీస్ మ్యాచ్‌లుగా ఎంతగానో ఉపకరించనున్నాయి. ఈ సిరీస్‌కు ముందు భారత్ ఆగస్టు చివరి వరకు శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొంటుంది. ఇటీవల శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలలో టీ20 సిరీస్ పరాజయాలను చవిచూసిన టీమిండియా, అఫ్గాన్‌తో మ్యాచ్‌ల ద్వారా తిరిగి విజయాల బాట పట్టాలని పట్టుదలతో ఉంది.

ఆసియా క్రీడల కోసం బీసీసీఐ ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా 15 మంది సభ్యుల బలమైన టీ20 జట్టును ప్రకటించింది. ఈ జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్లు సంజూ శామ్సన్, ఇషాన్ కిషన్లతో పాటు ధనాధన్ ఓపెనర్ అభిషేక్ శర్మ, ఆల్‌రౌండర్లు శివం దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీలకు స్థానం లభించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us