IPL 2025: గాయంతో వెనుతిరిగిన రాజస్థాన్ కెప్టెన్! ఫిట్నెస్ పై కీలక అప్డేట్! నెక్స్ట్ మ్యాచ్ లో ఉంటాడా భయ్యా?
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ కెప్టెన్ సంజు సామ్సన్ గాయపడడం మ్యాచ్కు కీలక మలుపుగా నిలిచింది. 31 పరుగులు చేసిన తర్వాత రిటైర్డ్ హర్ట్ కావడం జట్టుకు ఎదురుదెబ్బ అయ్యింది. అయినా చివరి ఓవర్లో మిచెల్ స్టార్క్ అద్భుత బౌలింగ్ చేసి మ్యాచ్ను సూపర్ ఓవర్కు తీసుకెళ్లాడు. సంజు గాయం పెద్దది కాదని తెలిపినా, నెక్స్ట్ మ్యాచ్లో ఆయన ఆడతాడా అన్నది ఇంకా ఉత్కంఠతో ఉంది.

ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఒక సూపర్ ఓవర్ థ్రిల్లర్గా మిగిలింది. ఈ మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగినప్పటికీ, ప్రేక్షకులు ఒక్క క్షణం కూడా తల తిరగకుండా చూసేంత ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ మంచి ఆరంభాన్ని అందించాడు. కేవలం 19 బంతుల్లోనే 3 సిక్స్లు, 2 ఫోర్లు సాయంతో 31 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేసాడు. అయితే ఆ ఇన్నింగ్స్ చివరిలో గాయం కారణంగా అతను ఆట నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆరో ఓవర్లో డెలివరీ సమయంలో విప్రజ్ నిగమ్ వేసిన బంతికి అతని పక్కటెముకల భాగంలో నొప్పి రావడంతో ‘రిటైర్డ్ హర్ట్’ అయ్యాడు. అయితే మ్యాచ్ అనంతరం సంజు తన గాయం పెద్దది కాదని తెలిపాడు. “ఇప్పటివరకు బాగానే ఉంది. మళ్లీ బ్యాటింగ్ చేయడం సాధ్యపడలేదు కానీ రేపు ఎలా ఉంటుందో చూస్తాం,” అని వెల్లడించాడు.
ఇక మ్యాచ్ తుది ఘట్టం మరింత ఉత్కంఠ రేపింది. 188 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సిన రాజస్థాన్, చివరి ఓవర్కు వచ్చేసరికి కేవలం 9 పరుగులే అవసరం. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శించి, కేవలం 8 పరుగులే ఇచ్చి మ్యాచ్ను సూపర్ ఓవర్కు తీసుకెళ్లాడు. ఈ ప్రదర్శనపై సంజు సామ్సన్ కూడా ప్రత్యేకంగా స్పందించాడు. “స్టార్సీ నిజంగా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను ఎందుకు ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడో అందరికీ చూపించాడు. 20వ ఓవర్లోనే మ్యాచ్ను గెలిపించాడు,” అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు.
సూపర్ ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ 11 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున KL రాహుల్ మరియు ట్రిస్టన్ స్టబ్స్ క్రీజ్లోకి వచ్చి, కేవలం నాలుగు బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని నమోదు చేశారు. చివరి ఓవర్తో పాటు సూపర్ ఓవర్లోనూ సందీప్ శర్మ రాజస్థాన్ తరఫున బౌలింగ్ బాధ్యతలు చేపట్టాడు. కాగా, ఈ మ్యాచ్లో సందీప్ శర్మ వేసిన ఓవర్ కూడా అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అతను ఒకే ఓవర్లో 11 బంతులు వేయడంతో ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
ఓటమి ఎదురైనా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ తన జట్టు ప్రదర్శనపై గర్వంగా ఉందని తెలిపాడు. “మా బౌలర్లు, ఫీల్డర్లు బాగా స్పందించారు. మైదానంలో శక్తి అద్భుతంగా కనిపించింది. మ్యాచ్ మా నియంత్రణలోనే ఉంది అని అనిపించింది. పవర్ప్లేలో మంచి ఆరంభం దక్కింది. ఆ స్కోరు ఛేదించదగినదే అనిపించింది,” అని అన్నాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



