AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket Discipline: జైస్వాల్, వైభవ్‎లకు కఠిన శిక్ష పడాల్సిందే.. ఐసీసీ, బీసీసీఐలపై మాజీ క్రికెటర్ మండిపాటు

Cricket Discipline: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ మైదానంలో ఆవేశపూరిత ప్రవర్తనపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్రంగా స్పందించారు. ఐసీసీ, బీసీసీఐలు స్వల్ప శిక్షలతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆటగాళ్ల క్రమశిక్షణను కాపాడకపోతే వారి కెరీర్‌తో పాటు క్రికెట్‌లోని క్రీడాస్ఫూర్తికీ నష్టం జరుగుతుందని హెచ్చరించారు.

Cricket Discipline: జైస్వాల్, వైభవ్‎లకు కఠిన శిక్ష పడాల్సిందే.. ఐసీసీ, బీసీసీఐలపై మాజీ క్రికెటర్ మండిపాటు
Cricket Discipline
Rakesh
|

Updated on: Aug 26, 2026 | 10:14 AM

Share

Cricket Discipline: శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా యంగ్ ప్లేయర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ గ్రౌండ్‌లో ప్రదర్శిస్తున్న ఆవేశపూరిత ప్రవర్తన పై తీవ్రంగా చర్చ నడుస్తోంది. లంక క్రికెటర్లతో మైదానంలో శారీరక ఘర్షణకు దిగిన ఈ ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే వారి భవిష్యత్తుకే ముప్పు వాటిల్లుతుందని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఐసీసీ, బీసీసీఐలను డిమాండ్ చేశారు. టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ సోషల్ మీడియా వేదికగా ఐసీసీ, బీసీసీఐలకు ఒక ఆందోళనకరమైన విజ్ఞప్తి చేశారు. మైదానంలో ఆటగాళ్లు శారీరక ఘర్షణలకు దిగినప్పుడు ఐసీసీ ఇచ్చే స్వల్ప శిక్షలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఇటువంటి ప్రవర్తనను చిన్న జరిమానాలు లేదా డీమెరిట్ పాయింట్లతో వదిలేస్తే, ఆటగాళ్లు దాన్ని ఒక అలవాటుగా మార్చుకునే ప్రమాదం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆట క్రమశిక్షణను కాపాడటంలో బోర్డులు విఫలమైతే అది క్రికెట్ ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.

జైస్వాల్, అసిత ఫెర్నాండో ఘర్షణ సంఘటన

భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజున ఈ వివాదం చోటుచేసుకుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్‌ను లంక వేగవంతమైన బౌలర్ అసిత ఫెర్నాండో ఔట్ చేసిన తర్వాత అనుచిత పదజాలంతో సెండ్ ఆఫ్ ఇచ్చాడు. దీన్ని తట్టుకోలేకపోయిన జైస్వాల్ తిరిగి వెళ్లకుండా వెనక్కి వచ్చి ఫెర్నాండోతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి హెల్మెట్లు, తలలు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనపై విచారణ జరిపిన ఐసీసీ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ ఒక డీమెరిట్ పాయింట్‌తో సరిపెట్టింది. ఇంతటి శారీరక ఘర్షణకు ఈ శిక్ష చాలా స్వల్పమని మంజ్రేకర్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Anaya Bangar: మారింది రూపమే.. క్రికెట్‌పై ప్రేమ కాదు.. అమ్మాయిగా మారి మళ్లీ మైదానంలోకి స్టార్ క్రికెటర్

వైభవ్ సూర్యవంశీ గొడవ

కొద్దిరోజుల క్రితం ఇండియా ఏ జట్టు తరఫున లంకలో పర్యటించిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నాడు. యూత్ వన్డే సిరీస్ మ్యాచ్ సందర్భంగా శ్రీలంక ఆటగాడు విషేన్ హలంబగేతో వైభవ్ సూర్యవంశీ భౌతిక ఘర్షణకు, తోపులాటకు దిగాడు. ఈ సీరియస్ ఘటనపై ఐసీసీ లేదా బీసీసీఐ ఎలాంటి కఠినమైన శిక్ష విధించకపోవడంపై క్రీడా వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.

ఇది కూడా చదవండి: UP T20 League 2026: టీ20 లీగ్‌లో పరాకాష్టకు చేరిన ఉత్కంఠ.. రింకూ వికెట్ పడగొట్టి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ప్లేయర్

శిక్షించకపోతే భవిష్యత్తుకు ముప్పు

సోషల్ మీడియా పోస్ట్‌లో సంజయ్ మంజ్రేకర్ చేతులెత్తి నమస్కరిస్తూ ఒక ముఖ్యాంశాన్ని లేవనెత్తారు. “ప్రియమైన ఐసీసీ, బీసీసీఐ.. ఇండియా ఏ పర్యటనలో వైభవ్, ఇప్పుడు జైస్వాల్ ప్రవర్తనను మీరు ఇలాగే ఉపేక్షిస్తే, వారికి తప్పుడు ప్రవర్తనను ప్రోత్సహించినట్లే అవుతుంది. ఇది క్రీడకు మాత్రమే కాకుండా, వారి సొంత కెరీర్ భవిష్యత్తుకు కూడా అస్సలు మంచిది కాదు” అని హెచ్చరించారు. మైదానంలో నైతికతను కాపాడటానికి కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us