రాయల్స్ పై సన్రైజర్స్ గెలుపు
సొంతగడ్డపై సన్రైజర్స్ బోణీ మళ్ళీ చెలరేగిన వార్నర్ రాణించిన బెయిర్స్టో, విజయ్ శంకర్ శాంసన్ సెంచరీ వృధా హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం నమోదు చేసుకుంది. సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయంతో బోణి కొట్టింది. శుక్రవారం ఉప్పల్ స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో రాయల్స్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన రాయల్స్ […]
- సొంతగడ్డపై సన్రైజర్స్ బోణీ
- మళ్ళీ చెలరేగిన వార్నర్
- రాణించిన బెయిర్స్టో, విజయ్ శంకర్
- శాంసన్ సెంచరీ వృధా
హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం నమోదు చేసుకుంది. సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయంతో బోణి కొట్టింది. శుక్రవారం ఉప్పల్ స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో రాయల్స్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కెప్టెన్ రహానే (70; 49 బంతుల్లో) అర్ధ సెంచరీతో, సంజూ శాంసన్ (102; 55 బంతుల్లో) అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయారు. ఇక హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్, నదీమ్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (69; 37 బంతుల్లో), బెయిర్స్టో (45; 28 బంతుల్లో) మంచి శుభారంభాన్ని ఇచ్చారు. దీనితో సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. విజయ్ శంకర్ (35; 15 బంతుల్లో) తుఫాన్ ఇన్నింగ్స్ తో అలరించాడు. కాగా రషీద్ ఖాన్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.