AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 5th Test: ఒక్కో వికెట్‌కు రూ. 1 లక్ష.. చైనామన్‌పై కాసుల వర్షం.. ఎందుకో తెలుసా?

Kuldeep Yadav 5 Wickets, India vs England 5th Test: కుల్దీప్ యాదవ్ తన మ్యాజికల్ స్పెల్‌లో కెరీర్‌లో 50 టెస్ట్ వికెట్లు పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి కుల్దీప్ కేవలం 1871 బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తీసిన ప్రతి వికెట్‌కు కుల్దీప్ యాదవ్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నుంచి కాసుల వర్షం కురుస్తోంది. ఒక్కో వికెట్‌కు లక్ష రూపాయల చొప్పున చెల్లించనుంది.

IND vs ENG 5th Test: ఒక్కో వికెట్‌కు రూ. 1 లక్ష.. చైనామన్‌పై కాసుల వర్షం.. ఎందుకో తెలుసా?
Kuldeep Yadav Records 1
Venkata Chari
|

Updated on: Mar 08, 2024 | 8:40 PM

Share

Kuldeep Yadav 5 Wickets, India vs England 5th Test: గురువారం (మార్చి 7) ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రారంభమైన ఐదో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ తన 100వ టెస్టు ఆడుతుండగా అందరి దృష్టి అతనిపై పడింది. కానీ, ఇక్కడ మెరిసింది మాత్రం కుల్దీప్ యాదవ్. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తర్వాత కుల్దీప్ వలలో చిక్కుకుంది. అతను తన కెరీర్‌లో కేవలం 12వ టెస్టులోనే నాలుగోసారి ఐదు వికెట్ల హాల్ సాధించాడు. జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్‌ల వికెట్లతో ఇంగ్లండ్‌లో ఐదు టాప్ వికెట్లను కుల్దీప్ తన ఖాతాలో వేసుకున్నాడు.

దీంతో కుల్దీప్ యాదవ్ తన మ్యాజికల్ స్పెల్‌లో కెరీర్‌లో 50 టెస్ట్ వికెట్లు పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి కుల్దీప్ కేవలం 1871 బంతులు మాత్రమే తీసుకున్నాడు.

ఇంగ్లండ్‌ను కేవలం 218 పరుగులకే ఆలౌట్ చేయడంలో కుల్దీప్ 5 వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ఇంకా ముగియలేదు. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. అయితే, దీనికి ముందు కుల్దీప్‌కు బీసీసీఐ నుంచి బంపర్ గిఫ్ట్ లభించింది.

ఇవి కూడా చదవండి

ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తీసిన ప్రతి వికెట్‌కు కుల్దీప్ యాదవ్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నుంచి కాసుల వర్షం కురుస్తోంది. ఒక్కో వికెట్‌కు లక్ష రూపాయల చొప్పున చెల్లించనుంది. అయితే, వికెట్ తీసిన ప్రతి బౌలర్‌కు రూ.లక్ష లభించదు. కేవలం కుల్దీప్‌కి ఈ డబ్బు రావడానికి ప్రత్యేక కారణం ఉంది.

నిజానికి ఆటగాళ్లు ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టినప్పుడు మ్యాచ్ ఫీజుతో పాటు రూ.5 లక్షలను బీసీసీఐ బోనస్‌గా అందజేస్తుంది. బీసీసీఐ అలాంటి నిబంధన తీసుకొచ్చింది. ఈ కోణంలో కుల్‌దీప్‌కు 1 వికెట్‌కు లక్ష రూపాయల చొప్పున అందుకోనున్నాడు. కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆర్. అశ్విన్ 4 వికెట్లు తీశాడు.

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్(కీపర్), టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..