కెప్టెన్గా రోహిత్.. హార్దిక్, బుమ్రా అవుట్.. తొలి మ్యాచ్కు ముంబై టీం ఇదే.. లిస్టులో కోహ్లీ ఫ్రెండ్
ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కీలక మార్పులు చేయనుంది. రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనుండగా.. జస్ప్రిత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఆడకపోవచ్చు. అటు సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఈ మ్యాచ్ కు ఆడనున్నాడు. ఆ వివరాలు

ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసింది.. ఇప్పుడు ఐపీఎల్ ఫీవర్ స్టార్ట్ అయింది. ఈ నేపధ్యంలోనే ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్లో ఏయే ఆటగాళ్లు ఆడనున్నారో తెల్సా.. గత సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కున్నాడు. దీంతో ఈ సీజన్ మొదటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్కి కెప్టెన్గా వ్యవహరించనున్నాడు రోహిత్ శర్మ. ఇక ఐపీఎల్ 2025లో ముంబై తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్తో తలబడనుంది.
రోహిత్ శర్మతో పాటు విల్ జాక్స్ ఓపెనింగ్ పార్ట్నర్గా బరిలోకి దిగనున్నాడు. అటు నెంబర్ 3లో యువ ఆటగాడు నమన్ ధీర్.. ఆ తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆడతారు. ఇక వికెట్ కీపర్గా జార్ఖండ్ ప్లేయర్ రాబిన్ మింజ్ బరిలోకి దిగుతాడు. స్పిన్నర్ల కోటాను మిచెల్ స్నాంటర్, కర్ణ్ శర్మ, ముజీబ్ ఉర్ రహమాన్ భర్తీ చేయనుండగా.. పేస్ బౌలింగ్కు ట్రెంట్ బౌల్ట్ సారధ్యం వహిస్తాడు. అతడికి దీపక్ చాహర్, అర్జున్ టెండూల్కర్ తోడుండనున్నారు. ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్లో ముంబై తరఫున ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగుతాడు అర్జున్ టెండూల్కర్.
ముంబై ఇండియన్స్ ఫుల్ టీం:
బ్యాటర్లు: సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, బెవోన్ జాకబ్స్
ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లు: హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, రాజ్ అంగద్ బావా, దీపక్ చాహర్
స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్లు: విల్ జాక్స్, మిచెల్ స్నాంటర్
వికెట్ కీపర్లు: రికెల్టన్, మింజ్, కృష్ణన్ శ్రిజిత్
పేసర్లు: జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, రీస్ టాప్లీ, కార్బిన్ బాష్, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్
స్పిన్నర్లు: కర్ణ్ శర్మ, ముజీబ్ ఉర్ రెహమాన్, విఘ్నేష్ పుత్తూరు
𝐒𝐭𝐞𝐚𝐦𝐢𝐧𝐠 𝐢𝐧 🚂#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/drWRr5BbTJ
— Mumbai Indians (@mipaltan) March 12, 2025