AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI Rankings: పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన రోహిత్ సేన.. వన్డే సిరీస్ విజయంతో భారీ జంప్..

ICC ODI Team Ranking: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. అయితే ఇంగ్లండ్‌తో సిరీస్ గెలవడం టీమిండియాకు కూడా లాభించింది.

ODI Rankings: పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన రోహిత్ సేన.. వన్డే సిరీస్ విజయంతో భారీ జంప్..
India Vs England
Venkata Chari
|

Updated on: Jul 18, 2022 | 3:39 PM

Share

ICC Men’s ICC ODI Team Ranking: ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ విజయం తర్వాత, ICC ర్యాంకింగ్స్‌లో భారతదేశం 3వ స్థానాన్ని తిరిగి పొందింది. ఇంగ్లండ్‌పై భారత్ సాధించిన సిరీస్ విజయం రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ICC పురుషుల ODI టీమ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కంటే ముందు తన మూడవ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సహాయపడింది. 109 రేటింగ్ పాయింట్లతో భారత్ ఇప్పుడు పాకిస్థాన్ (106) కంటే మూడు పాయింట్లు ఆధిక్యంలో నిలిచింది. అదే సమయంలో న్యూజిలాండ్ 128 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోయినప్పటికీ జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు 121 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

చివరి మ్యాచ్‌లో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ తొలి వన్డే సెంచరీతో భారత్ ఇంగ్లండ్‌తో సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. సిరీస్ విజయంతో భారత జట్టు తాజా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆరో ర్యాంక్‌లో ఉన్న దక్షిణాఫ్రికా ప్రస్తుతం పాకిస్థాన్‌ కంటే కేవలం ఏడు రేటింగ్‌ పాయింట్లు వెనుకంజలో నిలిచింది. ఇంగ్లండ్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ని గెలిస్తే నాలుగో స్థానానికి చేరుకోవడంతో రాబోయే వారాల్లో వన్డే ర్యాకింగ్స్ స్థానాల్లోనూ భారీ మార్పులు ఉండొచ్చు.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో భారత జట్టు ఈ నెలాఖరులో వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ప్రస్తుతం శ్రీలంకతో పాకిస్థాన్ టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఆ తర్వాత ఆగస్టులో నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్‌లో తలపడనుంది.