AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: జడేజాతో కష్టం.. ప్రతి బంతికి అప్పీల్‌ చేయమంటాడు: రోహిత్‌ శర్మ

మూడో టెస్టులో డీఆర్‌ఎస్‌‌లను సరిగ్గా వినియోగించుకోకపోవడంతో టీమిండియా అవసరమైన సమయంలో చాలా ఇబ్బంది పడింది. అయితే మూడో టెస్టులో చేసిన..

Rohit Sharma: జడేజాతో కష్టం.. ప్రతి బంతికి అప్పీల్‌ చేయమంటాడు: రోహిత్‌ శర్మ
Rohit Sharma On Drs And Ravindra Jadeja
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 08, 2023 | 7:59 PM

Share

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించి దూకుడు మీదున్న టీమిండియాకు మూడో టెస్టులో ఆసీస్ జట్టు షాక్ ఇచ్చింది. స్పిన్‌ అస్త్రంతో నాథన్ లియాన్ చెలరేగడంతో భారత్‌ను ఓడించడంలో ఆ జట్టు సఫలీకృతమయింది. అయితే మరోవైపు ఈ మ్యాచ్‌లో స్వయం తప్పిదాలు  కూడా టీమిండియా ఓటమికి కారణం అయ్యాయి. అంతేకాక మూడో టెస్టులో డీఆర్‌ఎస్‌‌లను సరిగ్గా వినియోగించుకోకపోవడంతో టీమిండియా అవసరమైన సమయంలో చాలా ఇబ్బంది పడింది. అయితే మూడో టెస్టులో చేసిన ఈ తప్పులను నాలుగో టెస్టులో రిపీట్ చేయకుండా సరిదిద్దుకుంటామని టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ తెలిపాడు.

మీడియాతో రోహిత్ మాట్లాడుతూ..‘అవును మేము ఇండోర్ వేదికగా జరిగిన గత మ్యాచ్‌లో డీఆర్‌ఎస్‌ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని అంగీకరిస్తున్నాం. డీఆర్‌ఎస్‌కు వెళ్లడం కష్టం. ముఖ్యంగా రవీంద్ర జడేజాతో. అతను ప్రతి బంతిని ఔట్ అని భావిస్తాడు. ఆ మ్యాచ్‌లో చేసిన తప్పులను నాలుగో టెస్టులో సరిదిద్దుకోవాలని ఆశిస్తున్నాం. దీనిపై మేం చర్చించుకుంటాం. ఈ మ్యాచ్‌లో డీఆర్‌ఎస్‌ను సరిగ్గా వినియోగించుకుంటామని భావిస్తున్నాం’ అని రోహిత్‌ శర్మ వివరించాడు.

కాగా, మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకోవడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూసుకెళ్లాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు మూడో టెస్టు విజయం కారణంగా ఆసీస్ జట్టు ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పైనల్‌కు చేరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..