AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Aus 5th T20I: ఆసీస్‌కు షాక్.. గిల్-అభిషేక్ ధనాధన్ బ్యాటింగ్.. గబ్బాలో వర్షంతో ఆగిన మ్యాచ్

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో చివరిదైన, నిర్ణయాత్మక మ్యాచ్‌కు బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ విధ్వంసక బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

Ind vs Aus 5th T20I: ఆసీస్‌కు షాక్.. గిల్-అభిషేక్ ధనాధన్ బ్యాటింగ్.. గబ్బాలో వర్షంతో ఆగిన మ్యాచ్
Ind Vs Aus 5th T20 (1)
Rakesh
|

Updated on: Nov 08, 2025 | 2:25 PM

Share

Ind vs Aus 5th T20I: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో చివరిదైన, నిర్ణయాత్మక మ్యాచ్‌కు బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ విధ్వంసక బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. కానీ, దురదృష్టవశాత్తూ వర్షం కారణంగా ఆట తాత్కాలికంగా నిలిచిపోయింది. ఆట ఆపే సమయానికి భారత్ 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది.

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదవ టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టు బ్యాటింగ్‌కు దిగింది. భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ మొదటి ఓవర్ నుంచే ఆస్ట్రేలియా బౌలింగ్‌పై దూకుడుగా ఆడారు. బెన్ ద్వార్షుయిస్ వేసిన తొలి ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. తొలి ఓవర్‌లోనే అభిషేక్ శర్మకు లైఫ్ లైన్ లభించింది. ఐదో బంతికి గ్లెన్ మాక్స్‌వెల్ సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు.

భారత వైస్-కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూకుడు వైఖరి కనబరిచాడు. ద్వార్షుయిస్ వేసిన మూడో ఓవర్‌లో అతను ఏకంగా నాలుగు ఫోర్లు బాదాడు. ఓపెనర్లు ధాటిగా ఆడుతున్న సమయంలో గబ్బాలో వర్షం అంతరాయం కలిగించింది. 4.5 ఓవర్ల వద్ద ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. ఆ సమయంలో భారత్ స్కోరు వికెట్ నష్టపోకుండా 52 పరుగులుగా ఉంది. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ 16 బంతుల్లో 29 పరుగులు (నాటౌట్), అభిషేక్ శర్మ 13 బంతుల్లో 23 పరుగులు (నాటౌట్)గా ఉన్నారు.

ఈ మ్యాచ్ సిరీస్‌లో నిర్ణయాత్మకం కాగా, భారత్ సిరీస్‌ను గెలుచుకునేందుకు, ఆస్ట్రేలియా సమం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆస్ట్రేలియా తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎటువంటి మార్పు చేయలేదు. అయితే, భారత జట్టులో ఒక మార్పు జరిగింది. తిలక్ వర్మకు విశ్రాంతి ఇచ్చి, అతని స్థానంలో రింకూ సింగ్‌కు తుది జట్టులో అవకాశం కల్పించారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫుల్ స్కోర్ బోర్డ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..