Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: సరికొత్త చరిత్ర సృష్టించనున్న శిఖర్ ధావన్.. తొలి టీమిండియా ప్లేయర్‌గా మారనున్న గబ్బర్..

PBKS vs LSG: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ శనివారం ఐపీఎల్‌లో తొలి భారత బ్యాటర్‌గా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. పంజాబ్ జట్టు శనివారం కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్‌తో తలపడనుంది.

IPL 2023: సరికొత్త చరిత్ర  సృష్టించనున్న శిఖర్ ధావన్.. తొలి టీమిండియా ప్లేయర్‌గా మారనున్న గబ్బర్..
Shikhar Dhawan
Follow us
Venkata Chari

|

Updated on: Apr 15, 2023 | 2:57 PM

Shikhar Dhawan Records: ఐపీఎల్ 2023లో శనివారం (ఏప్రిల్ 15) లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ జట్టు శనివారం కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్‌తో తలపడనుంది. పంజాబ్ కింగ్స్ తమ చివరి రెండు గేమ్‌లలో వరుసగా పరాజయాలను చవిచూసింది. అయితే లక్నో సూపర్ జెయింట్స్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చివరి బంతి థ్రిల్లర్‌గా గెలిచిన తర్వాత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.

పంజాబ్ కెప్టెన్ కం స్టార్ ఓపెనింగ్ బ్యాటర్ శిఖర్ ధావన్ మినహా.. ఇతరులు బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపించడంలో విఫలమవుతున్నారు. అది జట్టుకు తీవ్రం నష్టం తెచ్చిపెడుతోంది. జట్టు కెప్టెన్‌గా నియమితులైన 37 ఏళ్ల ధావన్ ఆరెంజ్ క్యాప్ బోర్డ్‌లో నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అతను నాలుగు మ్యాచ్‌లలో 233 పరుగులు చేశాడు. ప్రస్తుతం టీమ్ ఇండియా నుంచి బయటకు వచ్చిన ధావన్.. ఐపీఎల్‌లో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు.

పంజాబ్ IPL 2023 ప్రచారాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌పై విజయాలతో ప్రారంభించింది. అయితే ఆ టీం సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్‌లపై తదుపరి రెండు గేమ్‌లలో ఓడిపోయింది. శనివారం ఎల్‌ఎస్‌జీతో జరగనున్న మ్యాచ్‌లో, పీబీకేఎస్ కెప్టెన్ శిఖర్ ధావన్ యాభై అర్ధ సెంచరీలపై కన్నేశాడు. ఇలా చేస్తే మొదటి భారతీయ బ్యాటర్, ఐపీఎల్ చరిత్రలో ఓవరాల్‌గా రెండవ బ్యాటర్‌గా కొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం, ఐపీఎల్ చరిత్రలో రెండో లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉన్న ధావన్.. లీగ్‌లో 49 అర్ధసెంచరీలు పూర్తి చేశాడు. శనివారం రాత్రి లక్నోలో ధావన్ 50 పరుగుల మార్కును దాటితే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి వారి కంటే ముందు ఈ మైలురాయిని అందుకుంటాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో డేవిడ్ వార్నర్ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ 166 మ్యాచ్‌ల్లో 58 హాఫ్ సెంచరీలు చేశాడు. ఐపీఎల్‌లో 49 హాఫ్ సెంచరీలతో పాటు, ధావన్ రెండు సెంచరీలు కూడా చేశాడు. ఈ రెండూ క్యాష్ రిచ్ లీగ్ 2020 ఎడిషన్‌లో వచ్చాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..