AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చివరి మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్.. విజయంతో కెరీర్ ముగించిన 35 ఏళ్ల టీమిండియా ప్లేయర్..

భారత జట్టు(India) వెస్టిండీస్‌ పర్యటనలో ఉంది. వన్డే సిరీస్‌లో అది మూడో మ్యాచ్. ఇది భారత జట్టు దృష్టికోణంలో ఎంతో కీలకం. ఆ మ్యాచ్‌లో ఈ డాషింగ్ బ్యాట్స్‌మెన్ 55 బంతుల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి టీమ్ ఇండియా విజయానికి బాటలు వేశాడు.

చివరి మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్.. విజయంతో కెరీర్ ముగించిన 35 ఏళ్ల టీమిండియా ప్లేయర్..
Yuvraj Singh
Venkata Chari
|

Updated on: Jun 30, 2022 | 2:40 PM

Share

జూన్ 30వ తేదీన భారత సూపర్ స్టార్ ఆటగాడి చివరి మ్యాచ్‌గా క్రికెట్ చరిత్ర పుటల్లో నమోదైంది. అతను తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 5 సంవత్సరాల క్రితం అంటే 2017 సంవత్సరంలో ఇదే తేదీన ఆడాడు. భారత జట్టు (Team India) వెస్టిండీస్‌ పర్యటనలో ఉంది. వన్డే సిరీస్‌లో అది మూడో మ్యాచ్. ఇది భారత జట్టు దృష్టికోణంలో కూడా కీలకమైన మ్యాచ్. ఆ మ్యాచ్‌లో ఈ డాషింగ్ బ్యాట్స్‌మెన్ 55 బంతుల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి టీమ్ ఇండియా విజయానికి సహకరించాడు. కానీ, అదే ఇన్నింగ్స్ అతని అంతర్జాతీయ కెరీర్‌లో చివరి ఇన్నింగ్స్‌గా నిలిచింది. భారతదేశానికి ప్రపంచ కప్ గెలిచిన ఛాంపియన్ ఆటగాడైన యువరాజ్ సింగ్ (Yuvraj Singh) గురించి మాట్లాడుతున్నాం. అతను తన చివరి వన్డేను 30 జూన్ 2017న ఆడాడు.

భారత జట్టు వెస్టిండీస్ పర్యటనలో యువరాజ్ సింగ్ తన చివరి మ్యాచ్ ఆడినప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. సిరీస్‌లో తొలి వన్డే రద్దు కాగా, రెండో వన్డేలో భారత్‌ విజయం సాధించింది. ఇటువంటి పరిస్థితిలో, సిరీస్‌లో ఆధిక్యాన్ని బలోపేతం చేయడానికి భారత్‌కు మూడో వన్డే తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. మరోవైపు వెస్టిండీస్‌ కూడా సమం చేసేందుకు ప్లాన్ చేసింది.

55 బంతుల్లో 39 పరుగులు..

ఇవి కూడా చదవండి

టీమ్ ఇండియా కోసం తన చివరి మరియు అటువంటి ముఖ్యమైన మ్యాచ్‌లో, యువరాజ్ సింగ్ 55 బంతులు ఎదుర్కొని 39 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి 4 ఫోర్లు వచ్చాయి. ఈ మ్యాచ్‌లో యువరాజ్‌తో పాటు ధోనీ 78 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో కేదార్ జాదవ్ కూడా వేగంగా అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 251 పరుగులు చేసింది.

భారత్ 93 పరుగుల తేడాతో విజయం..

వెస్టిండీస్‌కు 252 పరుగుల విజయ లక్ష్యం ఉండగా, అశ్విన్, కుల్దీప్ యాదవ్ స్పిన్‌కు కరీబియన్ జట్టు బోల్తాపడింది. వీరిద్దరూ కలిసి 6 వికెట్లు పడగొట్టి వెస్టిండీస్‌ను 158 పరుగులకే పరిమితం చేశారు. వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లు కూడా ఆడలేక 38.1 పరుగులకే ఆలౌటైంది. మూడో వన్డేలో భారత్ 93 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.

యువరాజ్ సింగ్ కెరీర్..

యువరాజ్ సింగ్ అంతర్జాతీయ కెరీర్‌ను పరిశీలిస్తే, 402 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 11000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 17 సెంచరీలు 71 అర్ధ సెంచరీలు సాధించాడు. 402 అంతర్జాతీయ మ్యాచ్‌లలో, యువరాజ్ వన్డే ఫార్మాట్‌లోనే 304 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 8000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.

Follow Us
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్