AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: హర్దిక్ నోట చెన్నై పేరు.. ప్రస్ట్రేషన్‌తో ఊగిపోయిన రోహిత్.. ఏం చేశాడో తెలుసా?

Rohit Sharma's Furious Reaction: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్ కోసం అంచనాలు భారీగా ఉన్నాయి. చెన్నై మ్యాచ్ గురించి విన్న వెంటనే ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కోపంతో జ్యూస్ గ్లాస్ పగలగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు జట్లు ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన ఇచ్చాయి, ఈ మ్యాచ్‌పై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి.

Video: హర్దిక్ నోట చెన్నై పేరు.. ప్రస్ట్రేషన్‌తో ఊగిపోయిన రోహిత్.. ఏం చేశాడో తెలుసా?
Rohit Furious Reaction To C
Venkata Chari
|

Updated on: Mar 16, 2025 | 8:57 PM

Share

Rohit Sharma’s Furious Reaction: ఐపీఎల్ 18వ ఎడిషన్ (ఐపీఎల్ 2025) కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, టోర్నమెంట్ మొదటి రెండు రోజుల్లో 4 బలమైన జట్లు తలపడనున్నాయి. మొదటి రోజు RCB వర్సెస్ KKR తలపడనున్నాయి. రెండవ రోజు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (CSK vs MI) తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు చెరో 5 సార్లు టైటిల్ గెలుచుకున్నందున ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరుకు చాలా క్రేజ్ ఉంది. మార్చి 23న రెండు జట్లు తలపడతాయి. కానీ, ఈ మ్యాచ్‌కు ముందు, ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ CSK పేరు విన్న వెంటనే కోపంగా మారాడు. తన ముందు ఉంచిన జ్యూస్ గ్లాసును తన చేతులతోనే పిప్పి చేశాడు.

CSK పేరు వినగానే రోహిత్ ప్రస్ట్రేషన్..

చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్ పై ఇప్పటికే చాలా హైప్ క్రియేట్ అయింది. అదనంగా, ఈ మ్యాచ్ ప్రజాదరణను మరింత పెంచడానికి ప్రసారకర్త ఒక ప్రమోషనల్ వీడియోను రూపొందించారు. ఇందులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఉన్నారు. ఇద్దరూ ఒక రెస్టారెంట్‌లో కూర్చున్నారు. ఈ సమయంలో రోహిత్, ‘మన మొదటి మ్యాచ్ ఎప్పుడు?’ అని అడిగాడు. దానికి హార్దిక్ “ఆదివారం, CSK తో” అంటూ పాండ్యా బదులిచ్చాడు. ఇది విన్న వెంటనే కోపంతో రగిలిపోయిన రోహిత్, టేబుల్ మీద ఉన్న జ్యూస్ గ్లాసును తన చేత్తో పగలగొట్టాడు. అప్పుడు పాండ్య నవ్వి వెయిటర్‌తో దానిని శుభ్రం చేయమని చెబుతాడు.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. మొదటి మ్యాచ్ మార్చి 23న చెన్నై హోం గ్రౌండ్ అయిన చేపాక్ స్టేడియంలో జరుగుతుంది. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ ఏప్రిల్ 20న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది.

రికార్డు ఎలా ఉందంటే?

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ బలమైన జట్లు అనడంలో ఎటువంటి సందేహం లేదు. రెండు జట్లు స్థిరమైన ప్రదర్శనకు ప్రసిద్ధి చెందాయి. ముంబై, చెన్నై జట్ల మధ్య ఎప్పుడూ ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఉంటుంది. నిజానికి, గత 17 ఐపీఎల్ సీజన్లలో, రెండు జట్ల మధ్య 37 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో ముంబై 20 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, చెన్నై 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే, ఈ పోటీలో ముంబైదే పైచేయిగా నిలిచింది. కానీ చెన్నైని తక్కువ అంచనా వేయలేం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..