AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammad Shami: వాళ్లు ద్వేషంతో ఉన్నారు.. వారిని క్షమించండి.. షమీకి మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్..

ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచ కప్‌లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండియాపై పాకిస్తాన్‌ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో అభిమానులు నిరాశ చెందారు. ఓటమికి భారత ప్రధాన పేసర్‌ మహ్మద్‌ షమీనే కారణమంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు...

Mohammad Shami: వాళ్లు ద్వేషంతో ఉన్నారు.. వారిని క్షమించండి.. షమీకి మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్..
Rahul Gandhi
Srinivas Chekkilla
|

Updated on: Oct 26, 2021 | 1:42 PM

Share

ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచ కప్‌లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండియాపై పాకిస్తాన్‌ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో అభిమానులు నిరాశ చెందారు. ఓటమికి భారత ప్రధాన పేసర్‌ మహ్మద్‌ షమీనే కారణమంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. షమీ పాక్‌కు అమ్ముడుపోయాడు, అతన్ని పాక్‌కు తరిమికొట్టాలంటూ భారీ ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు. మహ్మద్ షమీ ఆటతీరును అతని మతంతో సోషల్ మీడియా ట్రోల్ చేయడంతో చాలా మంది రాజకీయ నాయకులు, మాజీ క్రికెటర్లు భారత పేసర్‌కు తమ మద్దతుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ షమీకి అండగా నిలిచాడు.

“ఓడిపోయినందున వారు ద్వేషంతో నిండి ఉన్నారు” కాబట్టి అతనిని ట్రోల్ చేస్తున్నారు. వారిని క్షమించాలని కోరారు. ఈ మ్యాచ్‎లో షమీ 3.5 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చాడు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. “మహ్మద్ # షమీ మేమంతా మీతో ఉన్నాము. ఈ వ్యక్తులు ద్వేషంతో నిండి ఉన్నారు ఎందుకంటే వారికి ఎవరూ ప్రేమను ఇవ్వరు. వారిని క్షమించండి” అని రాహుల్ గాంధీ ట్వీట్‌ చేశాడు.

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో పాటు పలువురు ఇతర రాజకీయ నాయకులు కూడా సోషల్ మీడియా ట్రోల్స్ ద్వారా షమీ యొక్క మతపరమైన గుర్తింపును లక్ష్యంగా చేసుకోవడాన్ని ఖండించారు. సచిన్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్‌తో సహా మాజీ ప్రస్తుత భారత ఆటగాళ్లు కూడా షమీకి తమ మద్దతును అందించారు. “మేము ఇండియాకి మద్దతు ఇచ్చినప్పుడు, మేము టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించే ప్రతి వ్యక్తికి మద్దతు ఇస్తాము. షమీ నిబద్ధతగల, ప్రపంచ స్థాయి బౌలర్. నేను షమీ అండ్ టీమ్ ఇండియాకు వెన్నుదన్నుగా నిలుస్తాను” అని టెండూల్కర్ అన్నారు.

లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ షమీకి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ షమీని దుర్భాషలాడిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. విమర్శించడం మంచిది కానీ ఖిలాడియోం కో దుర్వినియోగం నహీ కర్నా చాహియే. యే గేమ్ హై, ఆ రోజు మెరుగైన జట్టు గెలిచింది. ఇన్హి క్రికెటర్స్ నే ఇండియా కో బోహోట్ మ్యాచ్‌లు జితయే హై పిచ్లే కుచ్ సాలోన్ మే. హర్ హర్ కర్ జీత్నే వాలే కో హి బాజిగర్ కెహతే హై నా! నేను కూడా మేము ఓడిపోయిన మైదానంలో ఇండియా, పాక్ యుద్ధాలలో భాగమయ్యాను, కానీ పాకిస్తాన్‌కు వెళ్లమని ఎప్పుడూ చెప్పలేదు! నేను కొన్ని సంవత్సరాల క్రితం గురించి మాట్లాడుతున్నాను. అంటూ ట్వీట్ చేశాడు. షమీ ఇటీవలి కాలంలో భారతదేశపు అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిదా కొనసాగుతున్నాడు. అతను గత ఐదేళ్లుగా మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు.

Read Also.. Mohammed Shami: గంటల వ్యవధిలో మనసు మార్చుకున్న అభిమానులు.. షమీకి మద్దతుగా ఇన్‎స్టాలో పోస్టులు.. బాగా ఆడాలంటూ సూచన..