Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammed Shami: గంటల వ్యవధిలో మనసు మార్చుకున్న అభిమానులు.. షమీకి మద్దతుగా ఇన్‎స్టాలో పోస్టులు.. బాగా ఆడాలంటూ సూచన..

రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోని వంటి ప్రముఖ మాజీ క్రికెటర్లు వారు క్రికెట్ ఆడినప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. వర్ధమాన ఆటగాళ్లను కూడా అలా చేయమని సలహా ఇచ్చారు. వారు అలా చేయడంలో ఆశ్చర్యం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే...

Mohammed Shami: గంటల వ్యవధిలో మనసు మార్చుకున్న అభిమానులు.. షమీకి మద్దతుగా ఇన్‎స్టాలో పోస్టులు.. బాగా ఆడాలంటూ సూచన..
Shami
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 26, 2021 | 1:43 PM

రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోని వంటి ప్రముఖ మాజీ క్రికెటర్లు వారు క్రికెట్ ఆడినప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. వర్ధమాన ఆటగాళ్లను కూడా అలా చేయమని సలహా ఇచ్చారు. వారు అలా చేయడంలో ఆశ్చర్యం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాకు పరిధులు లేవు.. అందులో ఏమైనా పోస్టు చేయవచ్చు. తాజాగా భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీ కూడా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. టీ20 వరల్డ్ కప్‏లో భాగంగా ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‎లో ఇండియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓటమికి భారత ప్రధాన పేసర్‌ మహ్మద్‌ షమీనే కారణమంటూ కొందరు నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. షమీ పాక్‌కు అమ్ముడుపోయాడు, అతన్ని పాక్‌కు తరిమికొట్టాలంటూ భారీ ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు.

కొన్నేళ్లుగా భారత్‌ జట్టు ప్రముఖ పేసర్లలో షమీ ఒకడిగా ఉన్నాడు. 2015 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీసినప్పుడు అతన్ని హీరోగా కీర్తించారు. 2019 వరల్డ్ కప్‎లో ఆప్ఘానిస్తాన్‎పై హ్యాట్రిక్ తీసినప్పుడు అతడిని ఆకాశనికెత్తారు. కానీ ఆదివారం జరిగిన మ్యాచ్‎లో భారత్ ఓడిపోవడంతో అతడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇరువైపులు క్రికెటర్లు క్రీడాస్ఫూర్తి చాటితే అభిమానులు మాత్రం విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారు. షమీ పాకిస్థాన్‌ తరఫున ఆడాడని, అతడిని దేశద్రోహిగా అభివర్ణించాడని కొందరు అన్నారు.

అయితే షమీకి మాజీ ఆటగాళ్ల నుంచి భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. టీం ఇండియాను సపోర్టు చేస్తే అందులోని ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసినట్లే అని మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చెప్పాడు. 2014 నుంచి 2021 వరకు షమీ పాకిస్తాన్‌తో 3 మ్యాచ్‌లు ఆడాడు. 2015లో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షమీ 4 వికెట్లు తీశాడని తెలిపాడు. షమీ నిబద్ధతతో కూడిన ప్రపంచ స్థాయి బౌలర్ అని అన్నారు. “నేను షమీ అండ్ టీమ్ ఇండియాకు వెన్నుదన్నుగా నిలుస్తాను” అని టెండూల్కర్ ట్వీట్ చేశాడు. షమీకి మద్దతుగా మాజీ ఆటగాళ్లే కాకుండా అభిమానలు వస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో భారత పేసర్‌ను ప్రేమతో ముంచెత్తారు. రెండు గంటల ముందు అతన్ని దూషించిన వారు పొగడడం మొదలు పెట్టారు. షమీకి మద్దతుగా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో చాలా మంది పోస్ట్‌లు పెడుతున్నారు.

Read Also.. Ind Vs Pak: ఎంఎస్ ధోనీని కలిసిన రోజు మరిచిపోలేను.. పాకిస్తాన్ ఆటగాడు ట్వీట్..