T20 World Cup: అగ్రస్థానం కోసం హోరాహోరీ పోరు.. టీ20ల్లో ఉత్తమ బ్యాటర్‌గా నిలిచేదరో? లిస్టులో భారత్, పాక్ ప్లేయర్లు..

ICC T20 ర్యాంకింగ్స్‌లో, మహ్మద్ రిజ్వాన్ మొదటి స్థానంలో ఉండగా, సూర్యకుమార్ యాదవ్ నంబర్ టూలో ఉన్నాడు. అయితే ఇద్దరు ఆటగాళ్ల ఫామ్ చూస్తుంటే టీ20 ప్రపంచకప్‌లో నంబర్-1గా నిలవడానికి వీరిద్దరి మధ్య తీవ్రమైన పోరు తప్పదని భావిస్తున్నారు.

T20 World Cup: అగ్రస్థానం కోసం హోరాహోరీ పోరు.. టీ20ల్లో ఉత్తమ బ్యాటర్‌గా నిలిచేదరో? లిస్టులో భారత్, పాక్ ప్లేయర్లు..
T20 World Cup 2022 Suryakumar Rizwan
Follow us

|

Updated on: Oct 16, 2022 | 4:15 PM

T20 ప్రపంచ కప్ 2022 అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియాలో ప్రారంభమైంది. అదే సమయంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు అక్టోబర్ 23 న మెల్‌బోర్న్‌లో ముఖాముఖి తలపడనున్నాయి. ఈ టోర్నీలో భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ నంబర్-1 బ్యాట్స్‌మెన్‌గా నిలిచేందుకు పోటీపడనున్నారు. వాస్తవానికి, ప్రస్తుతం ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్‌లో, మహ్మద్ రిజ్వాన్ నంబర్ వన్‌లో ఉండగా, సూర్యకుమార్ యాదవ్ నంబర్ టూలో ఉన్నాడు. అయితే ఈ టోర్నమెంట్ సమయంలో మహ్మద్ రిజ్వాన్ తన స్థానాన్ని కొనసాగించాలని కోరుకుంటాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ బ్యాట్స్‌మన్‌ను వెనుక్కు నెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో మహ్మద్ రిజ్వాన్..

ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ నంబర్-1 బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. మహ్మద్ రిజ్వాన్ 853 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. అదే సమయంలో భారత్‌కు చెందిన సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్‌కు 838 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ ఈ ఏడాది టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ విషయంలో భారత్‌కు చెందిన సూర్యకుమార్ యాదవ్‌ను వెనక్కునెట్టాడు. అయితే ప్రస్తుతం అక్టోబరు 23న మెల్‌బోర్న్‌ మైదానంలో ఇరువురు ఆటగాళ్లు తలపడనుండగా, నెం.1 స్థానానికి ఆసక్తికర పోరును చూడొచ్చు.

2022 లో అదరగొట్టిన సూర్య, బాబర్..

భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ 2022లో ఇప్పటివరకు 23 టీ20 మ్యాచ్‌లు ఆడి 801 పరుగులు చేశాడు. కాగా, పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ ఈ ఏడాది ఇప్పటివరకు 18 టీ20 మ్యాచ్‌లు ఆడి 821 పరుగులు చేశాడు. క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ట్రై-సిరీస్ చివరి మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ ఈ ఏడాది T20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్‌ను అధిగమించాడు. ముక్కోణపు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మహ్మద్ రిజ్వాన్ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. అయితే ఇద్దరు ఆటగాళ్ల ఫామ్ చూస్తుంటే టీ20 ప్రపంచకప్‌లో నంబర్-1గా నిలవడానికి వీరిద్దరి మధ్య తీవ్రమైన పోరు తప్పదని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

టీ20 ప్రపంచకప్ 2022లో పాల్గొనే భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్.

స్టాండ్‌బై ఆటగాళ్లు: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్.

పాకిస్థాన్: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వాసీం, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, షాన్ మసూద్, యుఎస్ మసూద్ .

స్టాండ్‌బై ఆటగాళ్లు: ఫఖర్ జమాన్, మహ్మద్ హరీస్, షానవాజ్ దహానీ.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..