AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే భారత్, పాకిస్థాన్ పోరు.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

Mens U19 Asia Cup 2024: ఎమర్జింగ్ ఆసియా కప్ టీ20 విజయం తర్వాత, ఆసియా క్రికెట్ కౌన్సిల్ పురుషుల అండర్-19 ఆసియా కప్‌ను ప్రకటించింది. ACC ప్రకటన ప్రకారం, ఈ టోర్నమెంట్ నవంబర్ 29 నుండి డిసెంబర్ 8 వరకు యూఏఈలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే భారత్, పాకిస్థాన్ పోరు.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
Mens U19 Asia Cup 2024
Venkata Chari
|

Updated on: Nov 08, 2024 | 8:33 PM

Share

Mens U19 Asia Cup 2024: ఎమర్జింగ్ ఆసియా కప్ టీ20 విజయం తర్వాత, ఆసియా క్రికెట్ కౌన్సిల్ పురుషుల అండర్-19 ఆసియా కప్‌ను ప్రకటించింది. వర్ధమాన ఆటగాళ్ల తర్వాత ఇప్పుడు ఆసియాలోని జూనియర్ ఆటగాళ్లు ఈ టోర్నీలో తలపడనున్నారు. ACC ప్రకటన ప్రకారం, ఈ టోర్నమెంట్ UAEలో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 8 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, జపాన్, యూఏఈ, నేపాల్‌తో సహా మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. అండర్-19 ఆసియా కప్‌లో ఇది 11వ ఎడిషన్. ఇది మొదటిసారిగా 1989లో బంగ్లాదేశ్‌లో నిర్వహించారు. అయితే, చివరి 3 ఎడిషన్‌లు UAEలో నిర్వహించారు.

అండర్-19 ఆసియా కప్ ఫార్మాట్, గ్రూప్..

పురుషుల అండర్-19 ఆసియా కప్‌ను తొలిసారిగా 1989లో బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చింది. అయితే, దాని చివరి 3 ఎడిషన్‌లు UAEలో మాత్రమే నిర్వహించారు. ఈసారి టోర్నమెంట్ 11వ ఎడిషన్ జరగాల్సి ఉంది. వరుసగా నాలుగోసారి దాని ఆతిథ్యం UAE చేతిలో ఉంది. నవంబర్ 29 నుంచి ఈ టోర్నీ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది.

ఈ టోర్నీలో పాల్గొనే 8 జట్లను 4 చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. భారత్‌, పాకిస్థాన్‌, జపాన్‌, యూఏఈలను గ్రూప్‌ ఏలో ఉంచారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌, నేపాల్‌లను గ్రూప్‌ బిలో ఉంచారు. గ్రూప్‌లోని ప్రతి జట్టు ఒకరితో ఒకరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ తర్వాత రెండు గ్రూపుల్లోని టాప్-2 జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

అండర్-19 ఆసియా కప్ షెడ్యూల్..

గ్రూప్ దశ మ్యాచ్‌లు నవంబర్ 29, డిసెంబర్ 4 మధ్య జరుగుతాయి. ప్రతిరోజూ రెండు మ్యాచ్‌లు ఆడాలి. వాటిలో ఒకటి దుబాయ్ స్టేడియంలో, మరొకటి షార్జాలో జరుగుతాయి. డిసెంబర్ 6న తొలి సెమీఫైనల్ దుబాయ్‌లో, రెండో సెమీఫైనల్ షార్జాలో జరగనున్నాయి. టోర్నీ చివరి మ్యాచ్ డిసెంబర్ 8న దుబాయ్‌లో జరగనుంది. మొదటి రోజు అంటే నవంబర్ 29న గ్రూప్-బిలో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య పోరు జరగనుంది. కాగా, నేపాల్ జట్టు శ్రీలంకతో తలపడనుంది. టోర్నమెంట్‌లో అత్యంత ప్రీమియర్ మ్యాచ్ నవంబర్ 30న జరగనుంది. ఈ రోజున, గ్రూప్ A నుంచి భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్‌తోనే ఇరుజట్లు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి. మరోవైపు జపాన్, యూఏఈల మధ్య తొలి ఘర్షణ జరగనుంది.

డిసెంబరు 1న మళ్లీ గ్రూప్‌-బిలో ఒకవైపు బంగ్లాదేశ్‌, నేపాల్‌, మరోవైపు శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. డిసెంబర్ 2న గ్రూప్-ఎలో పాకిస్థాన్-యూఏఈ, భారత్-జపాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. మరుసటి రోజు డిసెంబర్ 3న గ్రూప్-బిలో బంగ్లాదేశ్-శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్-నేపాల్ జట్లు తలపడనున్నాయి. డిసెంబర్ 4న గ్రూప్-ఎలో పాకిస్థాన్-జపాన్, భారత్-యూఏఈ మధ్య జరిగే మ్యాచ్‌తో గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగుస్తాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..