AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: టెస్టుల్లో అన్‌లక్కీ ఫెలో.! ఒక్క పరుగుతో గుండె బద్దలైంది.. వరల్డ్ రికార్డుగా మారింది

న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ క్రో 1991లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 299 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ట్రిపుల్ సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఉండగా క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇది క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన, దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది.

Cricket: టెస్టుల్లో అన్‌లక్కీ ఫెలో.! ఒక్క పరుగుతో గుండె బద్దలైంది.. వరల్డ్ రికార్డుగా మారింది
Cricket
Ravi Kiran
|

Updated on: Jan 10, 2026 | 10:07 AM

Share

క్రికెట్ ఆటలో బ్యాట్స్‌మెన్ 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ కావడం సాధారణంగా చూస్తుంటాం. కొన్నిసార్లు, 199 పరుగుల వద్ద కూడా అవుట్ అయిన సందర్భాలున్నాయి. అయితే, న్యూజిలాండ్‌కు చెందిన దిగ్గజ ఆటగాడు మార్టిన్ క్రో ఒకసారి 299 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాడు. ఇది క్రికెట్ చరిత్రలో ఒక అత్యంత అరుదైన, దురదృష్టకర సంఘటనగా నమోదైంది. 1991వ సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్‌లో, న్యూజిలాండ్ జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మార్టిన్ క్రో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు.

ఇది చదవండి: ‘నారా లోకేష్, ఆ హీరో, నేను క్లాస్‌మేట్స్.. కాలేజీ రోజుల్లో మేమంతా..’

అతడు 523 బంతులు ఎదుర్కొని 299 పరుగులు సాధించి, తన జట్టుకు గణనీయమైన భారీ స్కోరును అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ట్రిపుల్ సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఉండగా, అర్జున రణతుంగ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. క్రికెట్ చరిత్రలో ఒక బ్యాట్స్‌మెన్ ట్రిపుల్ సెంచరీకి ఇంత దగ్గరగా వచ్చి, కేవలం ఒక పరుగు తేడాతో దానిని కోల్పోవడం ఇదే మొదటి, చివరిసారిగా రికార్డుల్లోకి ఎక్కింది. 299 పరుగుల వద్ద అవుట్ అయినప్పుడు ఆటగాడికి కలిగే నిరాశ ఎలాంటిదో మాటల్లో చెప్పలేం. ఈ దురదృష్టకర సంఘటన మార్టిన్ క్రోను క్రికెట్ ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతుడైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిపింది. ఇది క్రికెట్ చరిత్రలో ఒక చిరస్మరణీయ క్షణంగా మిగిలిపోయింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఆ సినిమానే చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ దర్శకుడు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..