AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024:పాక్ అభిమానుల క్రీడాస్ఫూర్తి.. ‘జై హింద్’ అంటూ భారతీయులతో కలిసి డ్యాన్సులు.. వీడియో

భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయం సాధించింది . ఆదివారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం బౌలింగ్ ఎంచుకున్నాడు. తదనుగుణంగా తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులు చేసి ఆలౌటైంది

T20 World Cup 2024:పాక్ అభిమానుల క్రీడాస్ఫూర్తి.. 'జై హింద్' అంటూ భారతీయులతో కలిసి డ్యాన్సులు.. వీడియో
Ind Vs Pak Match
Basha Shek
|

Updated on: Jun 12, 2024 | 8:36 AM

Share

భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయం సాధించింది . ఆదివారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం బౌలింగ్ ఎంచుకున్నాడు. తదనుగుణంగా తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులు చేసి ఆలౌటైంది. 120 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టు భారత బౌలర్ల మెరుపు దాడికి మోకరిల్లిపోయింది. ఫలితంగా 20 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ ఓటమితో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే కొందరు మాత్రం క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్‌ అభిమానులు భారత్‌ కోసం నినాదాలు చేయడం విశేషం. న్యూయార్క్‌లోని స్టేడియం బయట ఓ పాకిస్థానీ భారత అభిమానులతో కలిసి డ్యాన్స్ చేయడం విశేషం.

ఈ సందర్భంలో, అతను డ్యాన్స్ చేయడానికి కారణం ఏమిటి అని అడిగాడు. దీనికి పాకిస్థాన్ జట్టు అభిమాని బదులిచ్చాడు, అతను డ్యాన్స్ చేయడానికి ఒక కారణం కావాలి. రోజు చివరిలో మనమంతా భారతీయులం… అఖండ భారత్… జై హింద్ అని బదులిచ్చాడు. పాక్ జట్టు జెర్సీలో కనిపించిన మరో అభిమాని కూడా భారత్‌ కోసం నినాదాలు చేస్తూ నడుచుకుంటూ కనిపించాడు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్ల నుంచి భారీ ప్రశంసలు అందుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

 వీడియో ఇదిగో..

బుధవారం (జూన్ 12)న టీమిండియా మూడో మ్యాచ్ ఆడనుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో యూఎస్‌ఏతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సూపర్-8 దశకు చేరుకుంటుంది. దీని తర్వాత జూన్ 15న కెనడా జట్టుతో టీమిండియా ఆడనుంది. ఈ మ్యాచ్‌తో భారత జట్టు లీగ్ దశ మ్యాచ్‌లు ముగియనున్నాయి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..