IPL 2021: ఐపీఎల్​ అభిమానులకు గుడ్ న్యూస్. అక్కడి మ్యాచ్​లపై క్లారిటీ వచ్చేసింది

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. కేసుల సంఖ్య ప్రమాదకంగా పెరుగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వ్యాధి తీవ్రత ఎక్కువంగా ఉంది...

IPL 2021:  ఐపీఎల్​ అభిమానులకు గుడ్ న్యూస్. అక్కడి మ్యాచ్​లపై క్లారిటీ వచ్చేసింది
Ipl 2021
Follow us

|

Updated on: Mar 28, 2021 | 11:10 AM

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. కేసుల సంఖ్య ప్రమాదకంగా పెరుగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వ్యాధి తీవ్రత ఎక్కువంగా ఉంది. ఈ నేపథ్యంలో మార్చి 28 నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ముంబైలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లపై కరోనా ఎఫెక్ట్ ఉంటోదేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఐపీఎల్​లో పాల్గొనే క్రికెటర్లు, ఇతర సిబ్బంది బయో బబుల్​ ఉంటారని, దీంతో వాళ్లకు ఈ రూల్స్‌లో వారికి మినహాయింపు ఉంటుందని అసీమ్ గుప్తా చెప్పారు. మ్యాచ్​ల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ప్రేక్షకులకు అనుమతి లేదు కాబట్టి షెడ్యూల్​ ప్రకారం అవి జరుగుతాయని వెల్లడించారు.

ముంబై వాంఖడే స్టేడియంలో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్​కతా నైట్​రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు సాధన చేస్తున్నాయి. ఒకవేళ మహారాష్ట్రలోని కరోనా ఆంక్షలు ఐపీఎల్​ను ప్రభావితం చేసే పరిస్థితి వస్తే అక్కడి మ్యాచ్​లనే వేరే చోటుకు తరలించే విషయమై బీసీసీఐ ఆలోచన చేస్తోందని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఏప్రిల్ 9న ప్రారంభమయ్యే ఈ సీజన్​ మొదటి మ్యాచ్​లో ముంబై-బెంగళూరు జట్లు చెన్నై వేదికగా తలపడనున్నాయి. చెన్నై-ఢిల్లీ మధ్య రెండో మ్యాచ్​ ముంబైలో జరగనుంది. కాగా ఐపీఎల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. తమ ఫేవరెట్ టీమ్స్.. సత్తా చాటాలని ఆశపడుతున్నారు. మరి ఈ కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో మ్యాచ్‌లు ఎలా జరుగుతాయో, కప్పు ఎవరు ఎగరేసుకుపోతారో చూడాలి.

Also Read:  పురావస్తుశాఖ తవ్వకాల్లో దొరికిన 7 విచిత్రమైన లడ్డూలు… పరిశోధనలో విస్తుపోయే విషయాలు

చేపను కొనుగోలు చేసిన వ్యక్తి.. దాన్ని కటింగ్ చేయిస్తుండగా కడుపులో షాకింగ్ దృశ్యం