Cricket: 9 బంతుల్లో 50 పరుగులు.. సిక్సర్లతో బౌలర్లను ఏకిపారేసిన బ్యాట్స్‌మెన్.. దెబ్బకు సీన్ రివర్స్!

టీ20 ఫార్మాట్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు సర్వసాధారణం. ప్రస్తుతం జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్(LPL 2021)లో బ్యాట్స్‌మెన్లు...

Cricket: 9 బంతుల్లో 50 పరుగులు.. సిక్సర్లతో బౌలర్లను ఏకిపారేసిన బ్యాట్స్‌మెన్.. దెబ్బకు సీన్ రివర్స్!
Cricket
Follow us

|

Updated on: Dec 10, 2021 | 1:59 PM

టీ20 ఫార్మాట్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు సర్వసాధారణం. ప్రస్తుతం జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్(LPL 2021)లో బ్యాట్స్‌మెన్లు చెలరేగిపోతున్నారు. బౌండరీల రూపంలో పరుగులు రాబట్టుకుంటూ బౌలర్లను వీక్షకులుగా మార్చేశారు. ఇప్పటిదాకా ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు జరగ్గా.. అన్ని కూడా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌ల మాదిరిగా ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని ఇచ్చాయి ఇక తాజాగా జరిగిన మ్యాచ్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్లు చిన్న సైజ్ విధ్వంసాన్ని సృష్టించారు. మొత్తం 28 ఓవర్ల మ్యాచ్‌లో ఏకంగా 27 సిక్సర్లు బాదేశారు. ఇందులో ఒక బ్యాట్స్‌మెన్ వరుసగా 5 సిక్సర్లు కొట్టాడు. అయినా మ్యాచ్‌ను గెలవలేకపోయాడు. ఆ మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి..

డిసెంబర్ 8 బుధవారం నాడు టోర్నమెంట్ ఏడో మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జాఫ్నా కింగ్స్, క్యాండీ వారియర్స్ మధ్య జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను చెరో 14 ఓవర్లకు కుదించారు. దీనితో బ్యాట్స్‌మెన్ల విధ్వంసం బయటకొచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా కింగ్స్ 14 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. శ్రీలంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండో 23 బంతుల్లో 7 సిక్సర్లతో 53 పరుగులు, తిసారా పెరరా 21 బంతుల్లో 6 సిక్సర్లతో 53 పరుగులు చేశారు. క్యాండీ వారియర్స్ బౌలర్లలో షిరాజ్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. విముక్తి, అమిన్, మెండిస్‌లు చెరో వికెట్ తీశారు.

మరోవైపు 182 పరుగులు భారీ టార్గెట్ చేధించే క్రమంలో బరిలోకి దిగిన క్యాండీ వారియర్స్ జట్టుకు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ చరిత్ అసలంక 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు.. మరో ఓపెనర్ లెవీస్ 36 బంతుల్లో 41 పరుగులు చేశారు. ఇక వన్ డౌన్‌లో దిగిన వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్ పావెల్ జాఫ్నా బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 19 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అతడు తన ఇన్నింగ్స్‌లో కేవలం 9 బంతుల్లోనే 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 50 పరుగులు చేశాడు.

చివరి వరకు ఉత్కంఠ..

పావెల్ ఔట్ కావడంతో క్యాండీ వారియర్స్ జట్టు విజయావకాశాలు సన్నగిల్లాయి. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోవడంతో క్యాండీ జట్టు చివరి 2 ఓవర్లలో 32 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆ జట్టు 16 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. దీనితో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం.. జాఫ్నా కింగ్స్ 14 పరుగుల తేడాతో మ్యాచ్‌ గెలిచింది.

Also Read: సోఫాలో నుంచి వింత శబ్దాలు.. భయం భయంగా పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే!

Latest Articles
మార్కెట్‌లోకి సూపర్ మైలేజ్‌నిచ్చే నయా ఈవీ స్కూటర్ లాంచ్
మార్కెట్‌లోకి సూపర్ మైలేజ్‌నిచ్చే నయా ఈవీ స్కూటర్ లాంచ్
కుమార్తె బర్త్ డే.. ఆటోవాలా చేసిన పనికి ఫిదా కావాల్సిందే.. వీడియో
కుమార్తె బర్త్ డే.. ఆటోవాలా చేసిన పనికి ఫిదా కావాల్సిందే.. వీడియో
ఒక్క ఫోన్ కాల్.. యువతికి నిద్ర లేని రాత్రులను తెచ్చింది..!
ఒక్క ఫోన్ కాల్.. యువతికి నిద్ర లేని రాత్రులను తెచ్చింది..!
క్రికెటర్‏తో అవికా గోర్ స్పెషల్ ఆల్బమ్..
క్రికెటర్‏తో అవికా గోర్ స్పెషల్ ఆల్బమ్..
కొనుగోలుదారుడికి వాడేసిన ల్యాప్‌టాప్ పంపిన అమెజాన్
కొనుగోలుదారుడికి వాడేసిన ల్యాప్‌టాప్ పంపిన అమెజాన్
వృద్ధాప్యంలో మీకు నిశ్చింత.. రోజుకు రూ. 50తో రూ. 31లక్షల సంపాదన..
వృద్ధాప్యంలో మీకు నిశ్చింత.. రోజుకు రూ. 50తో రూ. 31లక్షల సంపాదన..
'అక్షయ తృతీయ రోజు అమ్మకు బంగారు కానుక'..తల్లికి రైతు బిడ్డ గిఫ్ట్
'అక్షయ తృతీయ రోజు అమ్మకు బంగారు కానుక'..తల్లికి రైతు బిడ్డ గిఫ్ట్
పన్ను చెల్లించే ఉద్యోగులకు అలెర్ట్.. ఆ ఫామ్ లేకపోతే పన్ను బాదుడు
పన్ను చెల్లించే ఉద్యోగులకు అలెర్ట్.. ఆ ఫామ్ లేకపోతే పన్ను బాదుడు
వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో మరో కాంగ్రెస్ నేత..!
వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో మరో కాంగ్రెస్ నేత..!
అర్ధరాత్రి చుక్కేసి పోలీస్‌ కాలర్‌ పట్టుకుని రచ్చచేసిన యువతులు..!
అర్ధరాత్రి చుక్కేసి పోలీస్‌ కాలర్‌ పట్టుకుని రచ్చచేసిన యువతులు..!