AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS ODI Series: ఆస్ట్రేలియాతో తలపడే భారత జట్టు ఇదే.. తిరిగొచ్చిన అశ్విన్.. రోహిత్ ఔట్.. కెప్టెన్‌గా ఎవరంటే?

ఆస్ట్రేలియా ఇప్పటికే తన జట్టును ప్రకటించింది. అందులో బలమైన జట్టును ఎంపిక చేసింది. ఇప్పుడు అందరి దృష్టి భారత జట్టు జట్టుపైనే ఉంది. ఎందుకంటే ప్రపంచకప్‌నకి ముందు ఇదే చివరి ODI సిరీస్. అందుకే ఇందులో అనేక ప్రయోగాలు చేయవచ్చు.

IND vs AUS ODI Series: ఆస్ట్రేలియాతో తలపడే భారత జట్టు ఇదే.. తిరిగొచ్చిన అశ్విన్.. రోహిత్ ఔట్.. కెప్టెన్‌గా ఎవరంటే?
Indian Cricket Team
Venkata Chari
|

Updated on: Sep 18, 2023 | 9:05 PM

Share

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీమిండియాను ప్రకటించారు. తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహించగా, మూడో మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ పునరాగమనం చేయనున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో విరాట్‌ కోహ్లితో పాటు ఇతర సీనియర్‌ ఆటగాళ్లకు కూడా విశ్రాంతి కల్పించారు. రవిచంద్రన్ అశ్విన్ వన్డే జట్టులోకి తిరిగి రావడం, ఇప్పుడు ప్రపంచకప్ జట్టులో కూడా కనిపించడం పెద్ద విషయం.

తొలి 2 వన్డేలకు టీం ఇండియా: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, తిలక్ వర్మ, ప్రసీద్ రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్.

ఇవి కూడా చదవండి

మూడో వన్డేకి టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ ., అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

వారికి ఎందుకు రెస్ట్?

తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చామని సెలక్టెర్లు ప్రకటించారు. ఇందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌లు ఉన్నారు. సీనియర్ ఆటగాళ్లందరూ నిరంతరం ఆడుతున్నారని, అందుకే వారికి తొలి రెండు మ్యాచ్‌ల్లో విశ్రాంతినిచ్చామని, ఆసియాకప్‌లో అవకాశం రాని ఆటగాళ్లను ఇక్కడ పరీక్షించామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపారు.

మా ఆటగాళ్లందరూ సిద్ధంగా ఉన్నారని, చివరి మ్యాచ్‌లో సీనియర్ ఆటగాళ్లు పునరాగమనం చేస్తారని, ఆ తర్వాత రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో కూడా లయలోకి వచ్చేందుకు ఇబ్బంది ఉండదని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.

ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మార్నస్ లాబుషాగ్నే, అలెక్స్ కారీ, షాన్ ఎబ్, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంగ్హా షార్ట్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.

మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయి?

సెప్టెంబర్ 22: మొహాలీ, మధ్యాహ్నం 1.30

సెప్టెంబర్ 24: ఇండోర్, మధ్యాహ్నం 1.30

సెప్టెంబర్ 27: సౌరాష్ట్ర, మధ్యాహ్నం 1.30

View this post on Instagram

A post shared by ICC (@icc)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..