AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: సొంత గడ్డపై అడుగుమోపడంతో దద్దరిల్లిన ఢిల్లీ! విరాట్ క్రేజ్ మాములుగా లేదుగా!

విరాట్ కోహ్లీ ఢిల్లీలోకి అడుగుపెట్టగానే అభిమానుల నుండి అపూర్వ స్వాగతం లభించింది. ఐపీఎల్ 2025లో అద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లీ, ఇప్పటికే 392 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. రాబోయే DC మ్యాచ్‌లో విజయం సాధించి, ఆరెంజ్ క్యాప్‌ను చేజిక్కించుకునే అవకాశాన్ని అన్వేషిస్తున్నాడు. గత ఢిల్లీ పరాజయానికి ప్రతీకారంగా పూర్తి పటిష్టంగా మైదానంలోకి దిగనుంది.

Video: సొంత గడ్డపై అడుగుమోపడంతో దద్దరిల్లిన ఢిల్లీ! విరాట్ క్రేజ్ మాములుగా లేదుగా!
Kohli Delhi
Narsimha
|

Updated on: Apr 26, 2025 | 8:30 PM

Share

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన పేరు విరాట్ కోహ్లీ. భారత మాజీ కెప్టెన్‌గా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ, అతను ఎక్కడికి వెళ్ళినా అభిమానుల నుండి అద్భుతమైన స్వాగతాన్ని అందుకుంటున్నాడు. ఆదివారం జరగనున్న IPL 2025 మ్యాచ్ RCB vs ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య మ్యాచ్‌కు ముందు కూడా అలాంటి ఒక చరిత్ర సృష్టించబడింది. శనివారం ఉదయం RCB జట్టు ఢిల్లీకి చేరగానే ఊహించినట్టుగానే కింగ్ కోహ్లీ పట్ల అభిమానులు చూపిన క్రేజ్ అద్భుతంగా ఉంది. విరాట్ కోహ్లీకి అపూర్వమైన స్వాగతం లభించింది, వేలాది మంది అభిమానులు విమానాశ్రయం వద్ద నుండి హోటల్ వరకు తారసపడ్డారు. ఆదివారం జరగబోయే మ్యాచ్‌లో తమ సొంత నగరానికి చెందిన కోహ్లీని ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటూ, ఆనందోత్సాహాలతో పరోక్షంగా అతనికి ఘనమైన గౌరవం ఇచ్చారు.

ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. గత రెండు సీజన్ల మాదిరిగానే, ఈ సీజన్‌లో కూడా తన ఆటతీరు ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇప్పటివరకు జరిగిన 9 మ్యాచ్‌లలో కోహ్లీ 392 పరుగులు చేశాడు, 5 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు, స్ట్రైక్ రేట్ 144.11 తో రాణిస్తున్నాడు. అతని అర్ధ సెంచరీలు అన్నీ విజయాలతో వచ్చిన కారణంగా, ప్రస్తుతం RCB పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో నిలిచింది. తదుపరి మ్యాచ్‌లో DCపై గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో, RCB తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. కోహ్లీ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో సాయి సుదర్శన్ తర్వాత రెండవ స్థానంలో ఉన్నాడు. ఆదివారం మ్యాచ్‌లో అద్భుతంగా ఆడితే సుదర్శన్‌ను అధిగమించి టాప్ స్థానం దక్కించుకునే అవకాశముంది.

ఇకపోతే, గతంలో జరిగిన DC-RCB మధ్య మ్యాచ్‌ను ఢిల్లీ జట్టు చిన్నస్వామి స్టేడియంలో ఏకపక్షంగా గెలిచింది. ఆ సమయంలో ఆర్‌సిబి గెలుపు దిశగా ప్రయాణించగా, కెఎల్ రాహుల్ అసాధారణమైన ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజయాన్ని అందించాడు. ఆ చేదు అనుభవాన్ని మరచిపోలేకపోయిన RCB ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో జట్టు మరోసారి తమ శక్తి ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉంది. ఢిల్లీ అభిమానుల మద్దతుతో కూడిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ తన మ్యాజిక్ చూపిస్తాడా అన్నది అందరిలో ఉత్కంఠ రేపుతోంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..