AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karun Nair : కరుణ్ నాయర్ ఇలాగైతే కష్టమే.. 8ఏళ్ల తర్వాత ఛాన్స్ వచ్చినా నిరూపించుకోలేకపోతే ఎలా ?

8 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి తిరిగి వచ్చిన కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ సిరీస్‌లో ఇప్పటివరకు పెద్దగా రాణించలేకపోయాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో అతని బెస్ట్ స్కోరు 40 పరుగులు మాత్రమే. జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయాల్సిన ఒత్తిడి అతడి మీద ఉంది.

Karun Nair : కరుణ్ నాయర్ ఇలాగైతే కష్టమే.. 8ఏళ్ల తర్వాత ఛాన్స్ వచ్చినా నిరూపించుకోలేకపోతే ఎలా ?
Karun Nair
Rakesh
|

Updated on: Jul 12, 2025 | 3:32 PM

Share

Karun Nair : ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాలోకి తిరిగి వచ్చిన కరుణ్ నాయర్ ఇప్పటివరకు ఇంగ్లాండ్ పర్యటనలో తన బ్యాటింగ్‌తో ఆకట్టుకోలేకపోయాడు. అతనిపై అభిమానులకు చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ కరుణ్ నాయర్ వాళ్ల ఆశల మీద నీళ్లు చల్లాడు. కరుణ్ నాయర్ ఐదు ఇన్నింగ్స్‌లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఈ టెస్ట్ సిరీస్‌లో మొత్తం 13 సెంచరీలు నమోదయ్యాయి. అందులో శుభ్‌మన్ గిల్ ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. కానీ కరుణ్ నాయర్ బెస్ట్ స్కోరు కేవలం 40 పరుగులు మాత్రమే. ఈ టెస్ట్ సిరీస్‌లో భారత ఆటగాడు ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 23.40 సగటుతో 117 పరుగులు మాత్రమే చేశాడు. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ ఖాతా కూడా ఓపెన్ చేయలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో కూడా కరుణ్ నాయర్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ ఆశించారు. కానీ తను టీమిండియా అభిమానులను నిరాశపరిచాడు. టీమిండియా ఈ మ్యాచ్‌ను 336 పరుగుల తేడాతో గెలిచినప్పటికీ, నాయర్ మొదటి ఇన్నింగ్స్‌లో 31 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 26 పరుగులు మాత్రమే చేశాడు.

మూడో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో అతను 40 పరుగులు చేశాడు.. ఇది ఈ సిరీస్‌లో అతని బెస్ట్ స్కోరు. కరుణ్ నాయర్‌కు వరుసగా ఛాన్సులు వస్తున్నాయి కానీ అతను వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. కరుణ్ నాయర్ టీమిండియాలోకి 8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. అతను టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ కూడా సాధించాడు. అంతకుముందు ఈ భారత బ్యాట్స్‌మెన్ దేశీయ క్రికెట్‌లో చాలా బాగా రాణించాడు. అతను కర్ణాటక టీం తరఫున ఆడి భారీ పరుగులు సాధించాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన తర్వాత అతని ఫామ్ పడిపోయింది. కరుణ్ నాయర్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ గణాంకాల విషయానికి వస్తే.. అతను 9 మ్యాచ్‌లలో 44.63 సగటుతో 491 పరుగులు చేశాడు. అతని బెస్ట్ స్కోరు 303 నాటౌట్. ఇంగ్లాండ్‌ మీద అతను 6 మ్యాచ్‌లలో 8 ఇన్నింగ్స్‌లలో 62.42 సగటుతో 437 పరుగులు చేశాడు.

టీమిండియా తరపున కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లలో 120.20 స్ట్రైక్ రేట్‌తో 601 పరుగులు సాధించాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా, రిషబ్ పంత్ కూడా అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్ బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. అతను రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సిరీస్‌లో భారత ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కూడా సెంచరీలు సాధించారు. ఈ నేపథ్యంలో కరుణ్ నాయర్ టీమిండియాలో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో పెద్ద స్కోరు చేయడం తనకు చాలా ముఖ్యం.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..