Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: కంగారులపై ఊచకోత.. కట్‌చేస్తే.. శాంసన్, ఇషాన్‌లతోపాటు నలుగురికి టెన్షన్.. టీమిండియా ఫ్యూచర్ ఇతడే?

Jitesh Sharma: ప్రస్తుతం జితేష్‌తో పాటు టీ20 జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కనిపిస్తున్న ఇషాన్ కిషన్ కూడా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసి రాణించలేకపోయాడు. అందువలన అతను టాప్ 3 లేదా ఓపెనర్‌గా వస్తు్న్నాడు. అయితే, భారత్ టాప్ ఆర్డర్ స్థానం కోసం చాలా మంది ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. దీంతో కిషన్‌కి కూడా ఇబ్బంది ఏర్పడింది. తగినంత ప్రతిభ ఉన్నా టీమ్ ఇండియాలో శాశ్వత స్థానం సంపాదించడంలో విఫలమైన సంజూ శాంసన్‌కు భారత్ టీ20 జట్టు తలుపులు శాశ్వతంగా మూసుకుపోనున్నాయని జితేష్ రాక సూచించింది.

Team India: కంగారులపై ఊచకోత.. కట్‌చేస్తే.. శాంసన్, ఇషాన్‌లతోపాటు నలుగురికి టెన్షన్.. టీమిండియా ఫ్యూచర్ ఇతడే?
Team India
Follow us
Venkata Chari

|

Updated on: Dec 05, 2023 | 1:03 PM

Jitesh Sharma: ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు ఆఫ్రికా టూర్‌పై దృష్టి సారించింది. భవిష్యత్‌లో టీ20 జట్టును నిర్మించేందుకు కంగారూలకు వ్యతిరేకంగా యువ దళాన్ని రంగంలోకి దింపడం ద్వారా బీసీసీఐ విజయం సాధించింది. ఈ సిరీస్‌లో యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, జితేష్ శర్మ, తిలక్ వర్మ, ముఖేష్ కుమార్‌లతో సహా పలువురు యువ ఆటగాళ్లను భారత్ ప్రయోగించింది. ఆటగాళ్లందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పాక్షికంగా విజయం సాధించారు.

దీంతో భారత టీ20 జట్టులో స్థానం దక్కించుకునేందుకు తమ వాదనలు వినిపించారు. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా గత రెండు టీ20 మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసిన జితేష్ శర్మ.. అతని రాకతో జట్టులోని మిగిలిన నలుగురు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌లో టెన్షన్ పెంచాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు టీ20 మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం దక్కించుకున్న జితేశ్ శర్మ.. 4వ టీ20 మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లో 1 బౌండరీ, 3 సిక్సర్లతో 35 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. చివరి టీ20 మ్యాచ్‌లో 24 పరుగులు కూడా చేశాడు.

ఇవి కూడా చదవండి

భీకర బ్యాటింగ్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో జితేష్‌కు అవకాశం కల్పించాలని నిపుణులు అంటున్నారు.

ఇషాన్ కిషన్ 3 టీ20 మ్యాచ్‌ల్లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఫీల్డింగ్ చేశాడు. మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేసిన కిషన్ ఒక్క మ్యాచ్ మినహా మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అందుకే అతడికి బదులు జితేష్‌కి అవకాశం ఇచ్చారు.

అందివచ్చిన అవకాశాన్ని జితేష్ చక్కగా ఉపయోగించుకున్నాడు. తన తుఫాన్ ఆటతో జట్టులో శాశ్వత స్థానం సంపాదించుకుంటానని సూచించాడు. అలాగే, టీ20 జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ స్థానానికి బలమైన పోటీదారులుగా నిలిచిన ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, సంజూ శాంసన్‌ల బాట మరింత క్లిష్టంగా మార్చాడు.

ఈ ఏడాది ప్రారంభంలో కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్, వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టులో స్థానం సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌నకు ముందు పంత్ జట్టులో తన ఫామ్‌ను తిరిగి పొందలేకపోతే, అతని స్థానంలో జితేష్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

భారత టెస్టు, వన్డే జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్న కేఎల్ రాహుల్ కూడా జితేష్ రాకతో ఇబ్బంది పడ్డాడు. ఓపెనర్‌గా ఎక్కువగా కనిపించిన రాహుల్.. లోయర్ ఆర్డర్‌లో తక్కువ బ్యాటింగ్ చేశాడు. ఇది జితేష్‌కు కూడా ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం జితేష్‌తో పాటు టీ20 జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కనిపిస్తున్న ఇషాన్ కిషన్ కూడా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసి రాణించలేకపోయాడు. అందువలన అతను టాప్ 3 లేదా ఓపెనర్‌గా వస్తు్న్నాడు. అయితే, భారత్ టాప్ ఆర్డర్ స్థానం కోసం చాలా మంది ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. దీంతో కిషన్‌కి కూడా ఇబ్బంది ఏర్పడింది.

తగినంత ప్రతిభ ఉన్నా టీమ్ ఇండియాలో శాశ్వత స్థానం సంపాదించడంలో విఫలమైన సంజూ శాంసన్‌కు భారత్ టీ20 జట్టు తలుపులు శాశ్వతంగా మూసుకుపోనున్నాయని జితేష్ రాక సూచించింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు జట్టులోకి వచ్చిన జితేశ్.. ఈ సిరీస్‌లోనూ అద్భుత ఫామ్‌ను కొనసాగించి మిగతా నలుగురు ఆటగాళ్లను కష్టాల్లో పడేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..