AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India : టీమిండియాలో ఫిట్‌నెస్ టెస్ట్ కామెడీ.. ఆసియా కప్ ముందు బయటపడ్డ అసలు నిజం

రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా వంటి చాలా మంది భారత ఆటగాళ్లు ఇటీవల బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ టెస్ట్ ఇచ్చారు. అదే సమయంలో, విరాట్ కోహ్లీ తన ఫిట్‌నెస్ టెస్ట్‌ను లండన్‌లో ఇచ్చాడు. ఆటగాళ్లందరూ ఈ టెస్ట్‌లలో పాస్ అయ్యారు.

Team India : టీమిండియాలో ఫిట్‌నెస్ టెస్ట్ కామెడీ.. ఆసియా కప్ ముందు బయటపడ్డ అసలు నిజం
Fitness Test
Rakesh
|

Updated on: Sep 04, 2025 | 7:11 AM

Share

Team India : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా వంటి పలువురు భారత ఆటగాళ్లు ఇటీవల బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ టెస్టులు ఇచ్చారు. అదే సమయంలో విరాట్ కోహ్లీ లండన్‌లో తన ఫిట్‌నెస్ టెస్ట్ కంప్లీట్ చేశాడు. ఈ పరీక్షల్లో ఆటగాళ్లందరూ పాస్ అయ్యారు. కానీ, ఇప్పుడు ఒక నివేదిక ప్రకారం.. ఈ పరీక్షలు కేవలం నామమాత్రపువే అని తేలింది. ఎందుకంటే, వాటి రిజల్ట్స్ బయటపెట్టలేదు. మీడియాకు కూడా కనీసం సమాచారం ఇవ్వలేదు.

టీమిండియాలో ఫిట్‌నెస్ టెస్టులు ఓ జోక్‌

విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్‌గా, రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడు యో-యో టెస్ట్ జట్టు ఎంపికకు ఒక ముఖ్యమైన ప్రమాణంగా ఉండేది. ఆ సమయంలో, ఈ పరీక్షలో ఫెయిలైన ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించేవారు. కానీ, ఇటీవల వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. కోహ్లీ, రవిశాస్త్రిల హయాం తర్వాత భారత పురుషుల క్రికెట్ జట్టులో ఫిట్‌నెస్ పరీక్షలు కేవలం మొక్కుబడిగా మారాయి. ఇవి ఇప్పుడు ఆటగాళ్ల ఎంపికకు ప్రామాణికం కాదని ఆ నివేదిక పేర్కొంది.

కొందరు పెద్ద ఆటగాళ్లు యో-యో, బ్రాంకో వంటి పరీక్షలు గాయాల ప్రమాదాన్ని పెంచుతాయని భావిస్తున్నారు. అందుకే, వారు తమ శరీరాలను ఇతర పద్ధతుల్లో నిర్వహించుకోవాలని కోరుకుంటున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఒక పత్రికా ప్రకటనలో ఇలా పేర్కొంది. “యో-యో, ఫిట్‌నెస్ చర్చను కొన్ని బలమైన గొంతులు నిరంతరం అణచివేస్తున్నాయి. కేవలం యో-యో మాత్రమే కాదు, 2 కిలోమీటర్ల పరుగు కూడా. ఒకప్పుడు యో-యో మార్కర్‌ను పెంచి ప్రమాణాలను మెరుగుపరిచేవారు. కానీ ఇప్పుడు అది కేవలం ఒక సాధారణ పరుగుగా మారింది. ఎలాంటి ఫలితాలు లేనప్పుడు, ప్రజలు దీన్ని ఎందుకు సీరియస్‌గా తీసుకుంటారు?” అని పేర్కొంది.

మాజీ కోచ్ సంచలన వ్యాఖ్యలు..

భారత మాజీ స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ కూడా రవిశాస్త్రి-కోహ్లీల హయాం ముగిసిన తర్వాత ఈ పరీక్షలు ఎప్పుడూ ఎంపికకు ప్రమాణాలు కాలేదని వెల్లడించాడు. 2019 ప్రపంచ కప్ తర్వాత, దాదాపు అందరు కాంట్రాక్ట్ ఆటగాళ్లకు ప్రతి సంవత్సరం మూడు సార్లు యో-యో టెస్ట్ నిర్వహిస్తున్నామని, కానీ అది ఎంపికకు ప్రాతిపదిక కాదని చెప్పాడు. కోచ్‌గా, ఎన్‌సీఏలో పనిచేసేవారుగా, ఆయా ఆటగాళ్ల ఫిట్‌నెస్ గురించి ఒక అవగాహన పొందడానికి మాత్రమే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..