IPL 2022 Auction: ఆర్‌సీబీ స్కెచ్ మాములుగా లేదుగా.. ముగ్గురు కీలక ప్లేయర్లపై భారీగా ఖర్చుచేసేందుకు రెడీ..!

Royal Challengers Bangalore: ఆర్సీబీ టీమ్ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. ప్రస్తుతం ఆర్‌సీబీ జట్టు ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు స్కెచ్ రెడీ చేసింది. ఇందులో ధోని టీమ్‌లోని ఓ ఆటగాడు కూడా ఉన్నాడు.

IPL 2022 Auction: ఆర్‌సీబీ స్కెచ్ మాములుగా లేదుగా.. ముగ్గురు కీలక ప్లేయర్లపై భారీగా ఖర్చుచేసేందుకు రెడీ..!
Rcb
Follow us

|

Updated on: Feb 11, 2022 | 3:56 PM

IPL 2022 Auction: ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే లీగ్ ఐపీఎల్(IPL). ఐపీఎల్ మెగా వేలాని(IPL 2022 Mega Auction)కి మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఇటువంటి పరిస్థితిలో అన్ని జట్లు తమ వ్యూహాలను రూపొందించడంలో నిమగ్నమై ఉన్నాయి. ఆర్సీబీ(Royal Challengers Bangalore) టీం ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. ప్రస్తుతం ఆర్‌సీబీ జట్టు ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందులో ధోని టీమ్‌లోని ఓ ఆటగాడు కూడా ఉన్నాడు.

ఈ ముగ్గురు ఆటగాళ్లపై కన్నేసిన ఆర్‌సీబీ.. ఐపీఎల్ మెగా వేలంలో వెస్టిండీస్‌కు చెందిన ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్, స్టార్ బ్యాట్స్‌మెన్, సీఎస్‌కే ఆటగాడు అంబటి రాయుడు, రాజస్థాన్ యువ ఆటగాడు రియాన్ పరాగ్‌లను ఆర్‌సీబీ జట్టు వేలంలో కొనేందుకు ఆసక్తి చూపిస్తుంది. వెస్టిండీస్ మాజీ కెప్టెన్, ప్రపంచ టాప్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) పెద్ద వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో ఒకరు కావచ్చు. హోల్డర్ ఆల్ రౌండ్ నైపుణ్యాలపై ఫ్రాంఛైజీ రూ. 12 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు రెడీ అయ్యింది.

జాసన్ హోల్డర్ ప్రమాదకరమైన ఆల్ రౌండర్.. ఫ్రాంచైజీకి సన్నిహిత వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ, ‘బెన్ స్టోక్స్ అందుబాటులో లేరని, హార్దిక్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్ ఇతర జట్టులో చేరారు. మిచెల్ మార్ష్ గాయం కారణంగా మొత్తం ఐపీఎల్ ఆడగలడో లేదో తెలియదు. రికార్డులను పరిశీలిస్తే, హోల్డర్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. RCB అతని కోసం భారీగా ఖర్చు చేసే అవకాశం ఉంది” అని తెలిపారు.

హోల్డర్ కోసం భారీగా ఖర్చు చేసేందుకు రెడీ.. పీటీఐ మేరకు, “హోల్డర్ కోసం, ఆర్‌సీబీ రూ. 12 కోట్లు, అంబటి రాయుడు కోసం రూ. 8 కోట్లు, పరాగ్ కోసం రూ. 7 కోట్లు ఉంచినట్లు తెలుస్తోంది. ఈ ఆటగాళ్లపై దాదాపు రూ.27 కోట్లు ఖర్చు చేస్తే ఆర్‌సీబీ వద్ద రూ.28 కోట్లు మిగులుతున్నాయి. కోహ్లి, మాక్స్‌వెల్, సిరాజ్, హోల్డర్, రాయుడు, పరాగ్‌ల రూపంలో జట్టులోని ప్రధాన ఆటగాళ్లు ఎవరనేది నిర్ణయిస్తామని వారు తెలిపారు.

రాయుడు గొప్ప బ్యాట్స్‌మెన్.. సీఎస్‌కే విజయంలో రాయుడు కీలక పాత్ర పోషించాడు. మహేంద్ర సింగ్ ధోని ప్రయత్నించిన, పరీక్షించిన ఆటగాళ్లను తీసుకునేందుకు సిద్ధమయ్యారు. డిఫెండింగ్ ఛాంపియన్లు రాయుడిని తిరిగి తమ జట్టులోకి తీసుకురావాలని కోరుకుంటారనడంలో సందేహం లేదు. రాయుడు వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా వేలంలోకి ప్రవేశిస్తున్నాడు. తద్వారా బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌తోపాటు అనుభవం అతన్ని ఒక ముఖ్యమైన పోటీదారుగా మార్చాయి.

రియాన్ పరాగ్.. IPL 2020లో మంచి ప్రదర్శన తర్వాత, 2021 సీజన్ పరాగ్‌కు అంత మంచిగా లేదు. అతను ఒక పెద్ద హిట్టర్, ఆఫ్ స్పిన్‌ కూడా బౌలింగ్ చేయగలడు. ఇది అతనికి వేలంలో భారీ ధర లభించేందుకు సహాయపడొచ్చని అంటున్నారు.

Also Read: IPL 2022 Auction: మెగా వేలంలో ఈ ముగ్గురిపై కన్నేసిన రాజస్థాన్ రాయల్స్.. వారెవరంటే?

IPL 2022 Auction: ఐపీఎల్ వేలానికి ముందు పంజాబ్ కింగ్స్‌కు షాక్.. తప్పుకున్న ఆ జట్టు బ్యాటింగ్ కోచ్..