AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: సిరాజ్‌కు గిఫ్ట్ ఇచ్చిన రోహిత్.. స్పెషల్ ఏంటో తెలుసా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా 56వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT)తో తలపడనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని హోమ్ గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో రాత్రి 7:30లకు ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య ఇది ​​రెండో మ్యాచ్. గత మ్యాచ్‌లో గుజరాత్ ముంబైని 36 పరుగుల తేడాతో ఓడించింది.

IPL 2025: సిరాజ్‌కు గిఫ్ట్ ఇచ్చిన రోహిత్.. స్పెషల్ ఏంటో తెలుసా?
Rohit Sharma Siraj
Venkata Chari
|

Updated on: May 06, 2025 | 10:20 AM

Share

Rohit Sharma Gifts Mohammed Siraj Special Ring: ఐపీఎల్ 2025 (IPL 2025)లో భాగంగా 56వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ కు వజ్రపు ఉంగరాన్ని అందజేశాడు. 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ వజ్రపు ఉంగరాన్ని బహుమతిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ బహుమతిని బీసీసీఐ నమన్ అవార్డు ప్రదానోత్సవంలో అందించారు. కానీ, ఆ సమయంలో మహమ్మద్ సిరాజ్ ఆ కార్యక్రమంలో పాల్గొనలేకపోయాడు. అందుకే, ఇప్పుడు రోహిత్ శర్మ ఆ వజ్రపు ఉంగరాన్ని సిరాజ్‌కు అప్పగించాడు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ వజ్రపు ఉంగరంలో 60 గ్రాముల 18 క్యారెట్ల బంగారం కూడా ఉంది. అలాగే, ఆటగాడి పేరు, జెర్సీ నంబర్ రింగ్‌పై రాసి ఉంది. దీంతో పాటు, 2024 టీ20 ప్రపంచ కప్‌లో టీం ఇండియా ఎన్ని పరుగులు లేదా వికెట్ల తేడాతో ఓడిందో కూడా ఈ రింగ్‌పై రాయడం విశేషం.

2024లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్, దక్షిణాఫ్రికా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత జట్టు 7 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది.

రోహిత్, సిరాజ్ వీడియో..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా నేడు 56వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) గుజరాత్ టైటాన్స్ (GT)తో తలపడనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని హోమ్ గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య ఇది ​​రెండో మ్యాచ్. గత మ్యాచ్‌లో గుజరాత్ ముంబైని 36 పరుగుల తేడాతో ఓడించింది.

ఈరోజు గెలిచిన జట్టు IPL-2025 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంటుంది. ముంబై 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లతో ఉంది. అదే సమయంలో, గుజరాత్ కూడా 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లతో ఉంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..