AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా ఆయన ఫిక్స్.. తేల్చేసిన సురేష్ రైనా..

IPL 2025: మహేంద్ర సింగ్ ధోని IPL 2025లో కనిపించడం ఖాయం. అయితే రానున్న సీజన్లలో ధోనీ వారసుడిగా ఎవరు నిలుస్తారనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే, ఈ మెగా వేలం ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం ఉంది. అంతకుముందే సురేశ్ రైనా ఓ కీలక వార్త చెప్పడంతో, ధోని వారసుడు ఎవరో తేలిపోయింది.

Venkata Chari
|

Updated on: Nov 02, 2024 | 5:09 PM

Share
ఐపీఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్ తప్పక బరిలోకి దిగుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన భారీ ఆఫర్‌ను తిరస్కరించిన పంత్ వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. రిషబ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నట్టు సమాచారం.

ఐపీఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్ తప్పక బరిలోకి దిగుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన భారీ ఆఫర్‌ను తిరస్కరించిన పంత్ వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. రిషబ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నట్టు సమాచారం.

1 / 5
ఎందుకంటే రిషబ్ పంత్, మహేంద్ర సింగ్ ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియకు ముందు కలుసుకున్నారు. ఈ విషయాన్ని CSK మాజీ ఆటగాడు సురేష్ రైనా ధృవీకరించాడు. త్వరలో ఓ బిగ్ న్యూస్ బయటకు వస్తుందని కూడా ఆయన సూచించారు.

ఎందుకంటే రిషబ్ పంత్, మహేంద్ర సింగ్ ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియకు ముందు కలుసుకున్నారు. ఈ విషయాన్ని CSK మాజీ ఆటగాడు సురేష్ రైనా ధృవీకరించాడు. త్వరలో ఓ బిగ్ న్యూస్ బయటకు వస్తుందని కూడా ఆయన సూచించారు.

2 / 5
సురేశ్ రైనా ఓ ప్రైవేట్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. 'నేను ఎంఎస్ ధోనిని కలిసినప్పుడు రిషబ్ పంత్ కూడా అక్కడే ఉన్నాడు. అలాగే ఇద్దరూ కీలక సమస్య గురించి చర్చించుకున్నారు. దీంతో ఈసారి భారీ మార్పు వస్తుందని సురేష్ రైనా చెప్పుకొచ్చాడు.

సురేశ్ రైనా ఓ ప్రైవేట్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. 'నేను ఎంఎస్ ధోనిని కలిసినప్పుడు రిషబ్ పంత్ కూడా అక్కడే ఉన్నాడు. అలాగే ఇద్దరూ కీలక సమస్య గురించి చర్చించుకున్నారు. దీంతో ఈసారి భారీ మార్పు వస్తుందని సురేష్ రైనా చెప్పుకొచ్చాడు.

3 / 5
ఈ మార్పుతో ఎల్లో జెర్సీలో ఓ కీలక ఆటగాడు కనిపిస్తాడని సురేశ్ రైనా సూచనప్రాయంగా తెలిపాడు. ధోనీ-పంత్ భేటీని ప్రస్తావిస్తూ సీఎస్‌కేలోకి కొత్త ఆటగాడు రాబోతున్న నేపథ్యంలో రిషబ్ పంత్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కనిపించడం దాదాపు ఖాయం.

ఈ మార్పుతో ఎల్లో జెర్సీలో ఓ కీలక ఆటగాడు కనిపిస్తాడని సురేశ్ రైనా సూచనప్రాయంగా తెలిపాడు. ధోనీ-పంత్ భేటీని ప్రస్తావిస్తూ సీఎస్‌కేలోకి కొత్త ఆటగాడు రాబోతున్న నేపథ్యంలో రిషబ్ పంత్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కనిపించడం దాదాపు ఖాయం.

4 / 5
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి రిషబ్ పంత్ తప్పుకోవడానికి ఇదే కారణమని అంటున్నారు. దాంతో మెగా వేలంలో కనిపించనున్న పంత్‌ను సీఎస్‌కే ఫ్రాంచైజీ భారీ మొత్తానికి కొనుగోలు చేయడం దాదాపు ఖాయం. అలాగే, రాబోయే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పంత్ నాయకత్వం వహించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి రిషబ్ పంత్ తప్పుకోవడానికి ఇదే కారణమని అంటున్నారు. దాంతో మెగా వేలంలో కనిపించనున్న పంత్‌ను సీఎస్‌కే ఫ్రాంచైజీ భారీ మొత్తానికి కొనుగోలు చేయడం దాదాపు ఖాయం. అలాగే, రాబోయే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పంత్ నాయకత్వం వహించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

5 / 5