Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేంద్ర సింగ్ ధోని

మహేంద్ర సింగ్ ధోని

మహేంద్ర సింగ్ ధోని.. కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ తర్వాత టీమిండియాకు ప్రపంచకప్ అందించిన ఏకైక కెప్టెన్. మహీని ముద్దుగా ఫ్యాన్స్ మిస్టర్ కూల్ అని పిలుస్తారు. ధోని బ్యాటింగ్ కంటే.. అతడు చేసే స్టంపింగ్‌కే ఫ్యాన్స్ ఎక్కువ అని చెప్పొచ్చు. స్టంప్స్ వెనుక ధోని ఉన్నాడంటే.. ప్రత్యర్ధి బ్యాటర్లలో గుండెల్లో గుబులు పుట్టాల్సిందే. అలాగే మిస్టర్ కూల్ వికెట్ల వెనుక తీసుకునే నిర్ణయాలు.. ప్రత్యర్ధి పరాభవాన్ని శాసిస్తాయి. ఇంకా చెప్పాలంటే.. డీఆర్ఎస్.. డెసిషన్ రివ్యూ సిస్టమ్‌ను ఏకంగా ధోని రివ్యూ సిస్టంగా లిఖించుకున్నాడు ఈ మిస్టర్ కూల్. అంపైరలైనా అప్పుడప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు గానీ.. ధోని నిర్ణయాలు మాత్రం ఎప్పుడూ పర్ఫెక్టే. 2007లో సారధిగా టీమిండియా పగ్గాలు చేపట్టిన ధోని.. క్రికెట్ చరిత్రలో అద్భుతమైన కెప్టెన్లలో ఒకరిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇదిలా ఉంటే.. 2010, జూలై 4న ధోని, సాక్షి సింగ్‌ల వివాహం డెహ్రాడున్‌లో జరిగింది. వీరికి జీవా ధోని కుమార్తె.

డిసెంబర్ 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోని. ఆ తర్వాత 2005లో శ్రీలంకతో తన తొలి టెస్ట్ ఆడాడు. 2007లో రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ అనంతరం.. టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు ధోని. ఆ సమయంలో అతడు తీసుకున్న పలు నిర్ణయాలు సంచలనంగా కూడా మారాయి. కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న వెంటనే.. మొట్టమొదటి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లోనే శ్రీలంక, న్యూజిలాండ్‌లపై టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. అలాగే ధోని సారధ్యంలోనే టీమిండియా 2007 ఐసీసీ ప్రపంచ టీ20 ఛాంపియన్‌గా నిలిచింది. అతడి నేతృత్వంలో టీమిండియా 2007-08 సీ.బీ. సిరీస్, 2010 ఆసియా కప్, 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది.

2011 ప్రపంచ కప్ ఫైనల్లో ధోని 91 పరుగులతో అజేయంగా నిలవడమే కాదు.. ఆఖర్లో అతడు కొట్టిన సిక్స్.. ఇప్పటికీ యావత్ భారతదేశానికి గుర్తిండిపోతుంది. 2013 జూన్‌లో ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించడంతో.. ధోనీ మూడు ఐసీసీ పరిమిత ఓవర్ల ట్రోఫీలు(ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ ట్వీంటీ 20) గెలుచుకున్న మొదటి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. 2008లో టెస్ట్ కెప్టెన్సీ చేజిక్కించుకున్న ధోని.. న్యూజిలాండ్, వెస్టిండీస్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2008, 2010, 2013లో టీమిండియాకు విజయాలను అందించాడు. 2009లో ధోనీ మొదటిసారిగా భారత్‌ను ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి తీసుకెళ్లాడు. 2013లో అతడి సారథ్యంలోనే టీమిండియా.. సరిగ్గా 40 సంవత్సరాల తర్వాత ఒక టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను వైట్‌వాష్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో, ధోని సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ ట్వంటీ 2010, 2014 సీజన్లలో కప్పు కొట్టింది. కాగా, 2014 డిసెంబర్ 30న ధోని టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా.. ఆగష్టు 15, 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికాడు ధోని.

ఇంకా చదవండి

Virat Kohli: కింగ్ ఫ్యాన్స్ కి బాడ్ న్యూస్! ఆ విషయంలో ధోనిని ఫాలో అవుతున్న కోహ్లీ

భారత క్రికెట్ జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచినా, విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఈ నిర్ణయం అతని అభిమానుల్లో ఆశ్చర్యం, అసంతృప్తిని కలిగించింది. RCB ఇన్నోవేషన్ ల్యాబ్‌లో మాట్లాడుతూ, అతను సోషల్ మీడియా పై శ్రద్ధ తగ్గించానని చెప్పాడు. ప్రస్తుతం కోహ్లీ RCB శిక్షణలో పాల్గొంటున్నా, అతని మౌనం అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.

  • Narsimha
  • Updated on: Mar 16, 2025
  • 9:59 am

IPL 2025: ప్రాక్టీస్‌లో సిక్స్‌లతో అదరగొట్టిన “తలా”.. బ్యాట్ సౌండ్ వింటే గూస్ బంప్స్ పక్కా!

IPL 2025 కోసం MS ధోని ప్రాక్టీస్ సెషన్‌లో సిక్సర్లతో అదరగొట్టాడు. ధోని ప్రాక్టీస్ వీడియో వైరల్ కాగా, అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. గత సీజన్‌లో గాయంతో కష్టపడినప్పటికీ, ఈ సారి ముందు బ్యాటింగ్ చేయొచ్చనే అంచనాలు ఉన్నాయి. CSK 2025 సీజన్‌ను ముంబై ఇండియన్స్‌తో ప్రారంభించనుండగా, ధోని చివరి మేజిక్ చేయగలడా అన్నది ఆసక్తికరంగా మారింది.

  • Narsimha
  • Updated on: Mar 15, 2025
  • 7:49 pm

IPL 2025: మా పెద్దన్న కోసం IPL రూల్స్ బ్రేక్ చెయ్యడానికి కూడా రెడీ! RR కెప్టెన్ బోల్డ్ కామెంట్స్

సంజు సామ్సన్ IPL 2025లో తన సన్నిహితుడు జోస్ బట్లర్‌ను విడిచిపెట్టడం అత్యంత కఠినమైన పని అని చెప్పాడు. జట్టును సమతుల్యం చేయడానికి RR అతన్ని వదులుకోవాల్సి వచ్చింది. సంజు తన కెప్టెన్సీ గురించి, కొత్త ఆటగాళ్ల గురించి, ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీకి దారి చూపడం గురించి మాట్లాడాడు. ఎంఎస్ ధోనితో తన అనుబంధాన్ని కూడా వివరించాడు, అతనితో గడిపిన అనుభవాన్ని జీవితంలో అద్భుతమైన భాగంగా అభివర్ణించాడు.

  • Narsimha
  • Updated on: Mar 14, 2025
  • 6:27 am

IPL 2025: ఐపీఎల్ హిస్టరీలోనే తొలి జట్టుగా భారీ రికార్డ్ సృష్టించిన చెన్నై.. అదేంటంటే?

Chennai Super Kings: మార్చి 23 ఆదివారం సాయంత్రం చెన్నైలోని తమ సొంత మైదానం ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తలపడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమైంది. తమ రికార్డు 6వ IPL టైటిల్‌ను లక్ష్యంగా చేసుకునేందుకు పావులు కదుపుతోంది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో బరిలోకి దిగనున్న చెన్నై. తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించి తమ ప్రచారాన్ని అద్భుతంగా ప్రారంభించాలని చూస్తోంది.

MS Dhoni: ధోని మీరు అనుకున్నంత కూల్ ఏంకాదు! తల విశ్వరూపాన్ని లీక్ చేసిన రాయుడు!

అంబటి రాయుడు తాజా ఇంటర్వ్యూలో ధోనీ బిర్యానీ ప్రేమను గుర్తుచేశాడు. 2014 ఐపీఎల్ సమయంలో, హైదరాబాద్ బిర్యానీని తినేందుకు ధోనీ తన బస హోటల్‌ను మార్పించుకున్నాడు. అదే సమయంలో క్రికెట్‌లో పీఆర్ హైప్ కారణంగా ప్రతిభ గల ఆటగాళ్లకు నష్టమవుతోందని రాయుడు విమర్శించాడు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతూ, క్రికెట్‌లో నిజమైన టాలెంట్‌కి ప్రాధాన్యత ఇవ్వాలనే చర్చను తెరపైకి తెచ్చాయి.

  • Narsimha
  • Updated on: Mar 11, 2025
  • 2:17 pm

Team India: 3 ట్రోఫీలు గెలిచినా.. రోహిత్ కంటే వెనుకంజలోనే ధోని.. కారణం ఏంటో తెలుసా?

Rohit Sharma vs MS Dhoni: రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీం ఇండియా ఒక సంవత్సరంలో రెండోసారి ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. న్యూజిలాండ్‌ జట్టును ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన భారత్ జట్టు.. 12 ఏళ్ల తర్వాత ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. అయితే, ఓ విషయంలో రోహిత్ శర్మ ధోనిని వెనక్కునెట్టేశాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Dhoni vs Rohit: ధోని వర్సెస్ రోహిత్.. కెప్టెన్‌గా ఎవరెన్ని ట్రోఫీలు గెలిచారంటే?

MS Dhoni vs Rohit Sharma Captaincy: 2023 ప్రపంచ కప్ ఫైనల్లో రోహిత్ తన జట్టుకు ట్రోఫీని గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయాడు. రెండు ఐసీసీ టైటిళ్లు గెలిచిన తర్వాత రోహిత్‌ను భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో పోల్చుతున్నారు. ఈ క్రమంలో ఐసీసీ ట్రోఫీ కాకుండా, రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు తన కెప్టెన్సీలో ఇతర టైటిళ్లు కూడా సాధించింది.

MS Dhoni: ట్రెడిషనల్ ఎటైర్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ధోని.. ఫ్యాన్స్‌కు మాటల్లేవంతే..

MS Dhoni Traditional Attire: ఓ వైపు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోన్న సంగతి తెలిసిందే. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం, టీమిండియా మాజీ ప్లేయర్ ఎంఎస్ ధోని తన లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సంచలనంగా మారింది.

MS Dhoni: ధోని కూతురు జీవా స్కూల్ ఫీజు ఎంతో తెలుసా? తెలిస్తే షాక్ అవడం ఖాయం

ధోని కూతురు జీవా రాంచీలోని టౌరియన్ వరల్డ్ స్కూల్‌లో చదువుతోంది, ఇది అత్యంత ప్రీమియం విద్యా సంస్థల్లో ఒకటి. ఈ స్కూల్ విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహిస్తూ, అత్యాధునిక సౌకర్యాలను అందిస్తుంది. జీవా చదువుతున్న స్కూల్ ఫీజు సంవత్సరానికి రూ. 4.40 - 4.80 లక్షలు ఉంటుందని సమాచారం. ధోని తన కూతురి భవిష్యత్తు కోసం అత్యుత్తమ విద్యా అవకాశాలను అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు.

  • Narsimha
  • Updated on: Mar 7, 2025
  • 12:15 pm

Virat Kohli: కష్ట సమయాల్లో తానొక్కడే ఉన్నాడు! కెప్టెన్సీ డ్రాప్ విషయంపై కోహ్లీ ఓపెన్ స్టేట్మెంట్

ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ మధ్య ఉన్న అనుబంధం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలగిన సమయంలో తనను ధోని మాత్రమే పరామర్శించాడని కోహ్లీ వెల్లడించాడు. ధోని కూడా తన సహజమైన విధంగా స్పందిస్తూ, అవసరమైన వారికి సందేశం పంపడం తన పద్ధతి అని చెప్పాడు. క్రికెట్‌ను మించి ఉన్న ఈ స్నేహం నిజమైన మద్దతు ఎంత కీలకమో తెలియజేస్తోంది.

  • Narsimha
  • Updated on: Feb 27, 2025
  • 4:27 pm