AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేంద్ర సింగ్ ధోని

మహేంద్ర సింగ్ ధోని

మహేంద్ర సింగ్ ధోని.. కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ తర్వాత టీమిండియాకు ప్రపంచకప్ అందించిన ఏకైక కెప్టెన్. మహీని ముద్దుగా ఫ్యాన్స్ మిస్టర్ కూల్ అని పిలుస్తారు. ధోని బ్యాటింగ్ కంటే.. అతడు చేసే స్టంపింగ్‌కే ఫ్యాన్స్ ఎక్కువ అని చెప్పొచ్చు. స్టంప్స్ వెనుక ధోని ఉన్నాడంటే.. ప్రత్యర్ధి బ్యాటర్లలో గుండెల్లో గుబులు పుట్టాల్సిందే. అలాగే మిస్టర్ కూల్ వికెట్ల వెనుక తీసుకునే నిర్ణయాలు.. ప్రత్యర్ధి పరాభవాన్ని శాసిస్తాయి. ఇంకా చెప్పాలంటే.. డీఆర్ఎస్.. డెసిషన్ రివ్యూ సిస్టమ్‌ను ఏకంగా ధోని రివ్యూ సిస్టంగా లిఖించుకున్నాడు ఈ మిస్టర్ కూల్. అంపైరలైనా అప్పుడప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు గానీ.. ధోని నిర్ణయాలు మాత్రం ఎప్పుడూ పర్ఫెక్టే. 2007లో సారధిగా టీమిండియా పగ్గాలు చేపట్టిన ధోని.. క్రికెట్ చరిత్రలో అద్భుతమైన కెప్టెన్లలో ఒకరిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇదిలా ఉంటే.. 2010, జూలై 4న ధోని, సాక్షి సింగ్‌ల వివాహం డెహ్రాడున్‌లో జరిగింది. వీరికి జీవా ధోని కుమార్తె.

డిసెంబర్ 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోని. ఆ తర్వాత 2005లో శ్రీలంకతో తన తొలి టెస్ట్ ఆడాడు. 2007లో రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ అనంతరం.. టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు ధోని. ఆ సమయంలో అతడు తీసుకున్న పలు నిర్ణయాలు సంచలనంగా కూడా మారాయి. కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న వెంటనే.. మొట్టమొదటి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లోనే శ్రీలంక, న్యూజిలాండ్‌లపై టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. అలాగే ధోని సారధ్యంలోనే టీమిండియా 2007 ఐసీసీ ప్రపంచ టీ20 ఛాంపియన్‌గా నిలిచింది. అతడి నేతృత్వంలో టీమిండియా 2007-08 సీ.బీ. సిరీస్, 2010 ఆసియా కప్, 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది.

2011 ప్రపంచ కప్ ఫైనల్లో ధోని 91 పరుగులతో అజేయంగా నిలవడమే కాదు.. ఆఖర్లో అతడు కొట్టిన సిక్స్.. ఇప్పటికీ యావత్ భారతదేశానికి గుర్తిండిపోతుంది. 2013 జూన్‌లో ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించడంతో.. ధోనీ మూడు ఐసీసీ పరిమిత ఓవర్ల ట్రోఫీలు(ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ ట్వీంటీ 20) గెలుచుకున్న మొదటి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. 2008లో టెస్ట్ కెప్టెన్సీ చేజిక్కించుకున్న ధోని.. న్యూజిలాండ్, వెస్టిండీస్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2008, 2010, 2013లో టీమిండియాకు విజయాలను అందించాడు. 2009లో ధోనీ మొదటిసారిగా భారత్‌ను ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి తీసుకెళ్లాడు. 2013లో అతడి సారథ్యంలోనే టీమిండియా.. సరిగ్గా 40 సంవత్సరాల తర్వాత ఒక టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను వైట్‌వాష్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో, ధోని సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ ట్వంటీ 2010, 2014 సీజన్లలో కప్పు కొట్టింది. కాగా, 2014 డిసెంబర్ 30న ధోని టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా.. ఆగష్టు 15, 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికాడు ధోని.

ఇంకా చదవండి

Team India: టీమిండియాలో ఈ ముగ్గురు ధోని శిష్యుల కెరీర్ క్లోజ్.. కోచ్ గంభీర్ ఎప్పటికీ ఛాన్స్ ఇవ్వడు.. కారణం ఇదే?

Team India: ఒకప్పుడు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి సన్నిహితులుగా భావించిన ముగ్గురు క్రికెటర్లు ఇప్పుడు టీం ఇండియా నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని ప్రస్తుత జట్టులో స్పష్టమైన మార్పు ఉంది. ఇప్పుడు దృష్టి పూర్తిగా దీర్ఘకాలికంగా దూసుకెళ్లే యువ, ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను ఎంచుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

టీమిండియా బెస్ట్ కెప్టెన్ ధోని కాదా.. ఇదేంటిది జైషా అంతమాట అనేశాడేంది.. ఎవరిని ఎంచుకున్నాడంటే?

Jay Shah Hails Rohit Sharma as India's Greatest Captain: కెప్టెన్సీ పదవి ఉన్నా లేకపోయినా, భారత క్రికెట్‌లో రోహిత్ శర్మ ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిది. జై షా వంటి అత్యున్నత స్థాయి వ్యక్తులు అతన్ని భారత్ బెస్ట్ కెప్టెన్‌గా గుర్తించడం, రోహిత్ సాధించిన విజయాలకు ఒక గొప్ప గుర్తింపుగా భావించవచ్చు.

MS Dhoni: ధోనీకి బీసీసీఐ నుంచి భారీగా పెన్షన్.. ఆ డబ్బునంతా ఏం చేస్తాడో తెలుసా?

MS Dhoni BCCI Pension: భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఎంఎస్ ధోనీ ఒకరు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే, వందల కోట్ల ఆస్తులు ఉన్న ఈ స్టార్ క్రికెటర్‌కు కూడా బీసీసీఐ నుంచి ప్రతి నెలా పెన్షన్ అందుతుందని మీకు తెలుసా? ఆటగాళ్లు పదవీ విరమణ పొందిన తర్వాత వారి సేవలను గుర్తిస్తూ బీసీసీఐ ఇచ్చే ఈ ఆర్థిక భరోసా గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

MS Dhoni: థాయిలాండ్‌లో ధోని హల్చల్.. న్యూ ఇయర్ ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నాడో తెలుసా?

Happy New Year 2026: టీమిండియా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని 2026 సంవత్సరాన్ని థాయిలాండ్‌లో స్వాగతించారు. ఈ ప్రత్యేక సందర్భంగా ఆయన తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలంటే ఓసారి చూద్దాం.. ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నాడో చూద్దాం..

IPL 2026 Auction: 10 ఓవర్లలో 120+ పరుగులు.. అత్యంత చెత్త రికార్డ్ సృష్టించిన రూ. 40 లక్షల చెన్నై బౌలర్

Chennai Super Kings Aman Khan Worst World Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దక్కించుకున్న యువ ఆల్‌రౌండర్ అమన్ ఖాన్, దేశవాళీ క్రికెట్‌లో ఒక అవాంఛనీయ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో పుదుచ్చేరి కెప్టెన్‌గా ఉన్న అమన్ ఖాన్, బౌలింగ్‌లో ఏకంగా 123 పరుగులు సమర్పించుకుని లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు.

Viral Video : ధోనీ కారులో సిగరెట్ ప్యాకెట్.. వైరల్ వీడియోతో సోషల్ మీడియా షేక్

MS Dhoni : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పుట్టినరోజు వేడుకలకు ధోనీ తన భార్య సాక్షితో కలిసి హాజరయ్యారు. ఆ సమయంలో ధోనీ కారును ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఒక కెమెరామెన్ కారు లోపలి భాగాన్ని జూమ్ చేయగా, అక్కడ సీట్ల మధ్యలో ఒక సిగరెట్ ప్యాకెట్ ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది.

  • Rakesh
  • Updated on: Dec 29, 2025
  • 7:16 pm

వరుసగా 5 సెంచరీలతో రికార్డులకే దడ దడ.. కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌లకే జట్టు నుంచి తప్పించిన చెన్నై..

Dhruv Shorey 5 Consecutive Centuries: విదర్భ బ్యాట్స్‌మన్ ధృవ్ షోరే మరోసారి తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి, మరో సెంచరీ సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీలో, హైదరాబాద్‌పై షోరే సెంచరీ సాధించి, తన జట్టును 89 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు.

MS Dhoni: చెన్నైను దగ్గరుండి మరీ ఓడించిన ధోని.. ఆ జట్టు చారిత్రాత్మక విజయంలో మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్..?

MS Dhoni's Secret Masterclass: అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా, ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నా.. ధోనీకి తన సొంత రాష్ట్ర జట్టు అంటే ఉన్న మక్కువ మరోసారి చాటుకున్నారు. జార్ఖండ్ సాధించిన ఈ విజయం ఆ రాష్ట్ర క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. దీని వెనుక 'కెప్టెన్ కూల్' హస్తం ఉండటం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.

Team India: ధోని వారసుడు దొరికేశాడోచ్.. టీమిండియా నెక్స్ట్ ఫినిషర్ ఇతడే.. ఎంట్రీ ఎప్పుడంటే?

Team India: ప్రస్తుతం టీమ్ ఇండియాలో వికెట్ కీపర్ స్థానం కోసం పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఒక పక్కా ఫినిషర్ అవసరం ఉంది. ఐపీఎల్ 2026లో చెన్నై తరపున కార్తీక్ గనుక మెరిస్తే, త్వరలోనే భారత జట్టులో నీలి రంగు జెర్సీలో చూడటం ఖాయమని క్రికెట్ పండితులు జోస్యం చెబుతున్నారు.

భారత్ గెలిస్తే బట్టలిప్పేస్తా.. బాలీవుడ్ హీరోయిన ఓపెన్ ఛాలెంజ్.. సీన్ కట్‌చేస్తే..

క్రికెట్ అంటే పడిచచ్చే అభిమానులు ఉండే మన దేశంలో, 2011 విజయం ఎంత మధురమో, పూనమ్ పాండే చేసిన ఈ 'బోల్డ్ ప్రామిస్' కూడా అంతే ఆశ్చర్యకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇటీవల ఆమె తన మరణం గురించి చేసిన 'ఫేక్' ప్రకటనతో వార్తల్లో నిలిచిన సందర్భంలో, పాత ప్రపంచకప్ నాటి ఈ ఉదంతం మరోసారి తెరపైకి వచ్చింది.

ధోనిని మేం ఎప్పుడూ అడగలే.. రోకోలపైనే టార్గెట్ ఎందుకు: గంభీర్, అగార్కర్‌లకు మాస్ వార్నింగ్

ప్రస్తుతం జట్టులో యువ ఆటగాళ్ల కంటే రోహిత్, కోహ్లీనే అద్భుతంగా రాణిస్తున్నారని ప్రసాద్ గుర్తుచేశారు. "వారి మనసులను పాడుచేయకూడదు. జాతీయ జట్టుకు ఆడని సమయంలో వారు దేశవాళీ క్రికెట్ ఆడితే అది యువ ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తుంది. కానీ వారిపై అనవసరమైన ఒత్తిడి తేవడం సరికాదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

SMAT 2025: ఒకే మ్యాచ్‌లో 2సార్లు ఔట్.. ధోని బౌలర్ దెబ్బకు కాటేరమ్మ కొడుకు మైండ్ బ్లాంక్..

Syed Mushtaq Ali Trophy 2025: సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025లో హర్యానా వర్సెస్ పంజాబ్ మధ్య సూపర్ ఓవర్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేసి, తుఫాన్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మను రెండుసార్లు అవుట్ చేశాడు.