మహేంద్ర సింగ్ ధోని

మహేంద్ర సింగ్ ధోని

మహేంద్ర సింగ్ ధోని.. కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ తర్వాత టీమిండియాకు ప్రపంచకప్ అందించిన ఏకైక కెప్టెన్. మహీని ముద్దుగా ఫ్యాన్స్ మిస్టర్ కూల్ అని పిలుస్తారు. ధోని బ్యాటింగ్ కంటే.. అతడు చేసే స్టంపింగ్‌కే ఫ్యాన్స్ ఎక్కువ అని చెప్పొచ్చు. స్టంప్స్ వెనుక ధోని ఉన్నాడంటే.. ప్రత్యర్ధి బ్యాటర్లలో గుండెల్లో గుబులు పుట్టాల్సిందే. అలాగే మిస్టర్ కూల్ వికెట్ల వెనుక తీసుకునే నిర్ణయాలు.. ప్రత్యర్ధి పరాభవాన్ని శాసిస్తాయి. ఇంకా చెప్పాలంటే.. డీఆర్ఎస్.. డెసిషన్ రివ్యూ సిస్టమ్‌ను ఏకంగా ధోని రివ్యూ సిస్టంగా లిఖించుకున్నాడు ఈ మిస్టర్ కూల్. అంపైరలైనా అప్పుడప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు గానీ.. ధోని నిర్ణయాలు మాత్రం ఎప్పుడూ పర్ఫెక్టే. 2007లో సారధిగా టీమిండియా పగ్గాలు చేపట్టిన ధోని.. క్రికెట్ చరిత్రలో అద్భుతమైన కెప్టెన్లలో ఒకరిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇదిలా ఉంటే.. 2010, జూలై 4న ధోని, సాక్షి సింగ్‌ల వివాహం డెహ్రాడున్‌లో జరిగింది. వీరికి జీవా ధోని కుమార్తె.

డిసెంబర్ 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోని. ఆ తర్వాత 2005లో శ్రీలంకతో తన తొలి టెస్ట్ ఆడాడు. 2007లో రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ అనంతరం.. టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు ధోని. ఆ సమయంలో అతడు తీసుకున్న పలు నిర్ణయాలు సంచలనంగా కూడా మారాయి. కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న వెంటనే.. మొట్టమొదటి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లోనే శ్రీలంక, న్యూజిలాండ్‌లపై టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. అలాగే ధోని సారధ్యంలోనే టీమిండియా 2007 ఐసీసీ ప్రపంచ టీ20 ఛాంపియన్‌గా నిలిచింది. అతడి నేతృత్వంలో టీమిండియా 2007-08 సీ.బీ. సిరీస్, 2010 ఆసియా కప్, 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది.

2011 ప్రపంచ కప్ ఫైనల్లో ధోని 91 పరుగులతో అజేయంగా నిలవడమే కాదు.. ఆఖర్లో అతడు కొట్టిన సిక్స్.. ఇప్పటికీ యావత్ భారతదేశానికి గుర్తిండిపోతుంది. 2013 జూన్‌లో ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించడంతో.. ధోనీ మూడు ఐసీసీ పరిమిత ఓవర్ల ట్రోఫీలు(ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ ట్వీంటీ 20) గెలుచుకున్న మొదటి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. 2008లో టెస్ట్ కెప్టెన్సీ చేజిక్కించుకున్న ధోని.. న్యూజిలాండ్, వెస్టిండీస్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2008, 2010, 2013లో టీమిండియాకు విజయాలను అందించాడు. 2009లో ధోనీ మొదటిసారిగా భారత్‌ను ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి తీసుకెళ్లాడు. 2013లో అతడి సారథ్యంలోనే టీమిండియా.. సరిగ్గా 40 సంవత్సరాల తర్వాత ఒక టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను వైట్‌వాష్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో, ధోని సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ ట్వంటీ 2010, 2014 సీజన్లలో కప్పు కొట్టింది. కాగా, 2014 డిసెంబర్ 30న ధోని టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా.. ఆగష్టు 15, 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికాడు ధోని.

ఇంకా చదవండి

World Record: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. బద్దలైన ధోని, రోహిత్‌ రికార్డులు

Babar Azam World Record: రెండో టీ20లో ఐర్లాండ్‌ను ఓడించి పాక్ కెప్టెన్ బాబర్ ఆజం చరిత్ర సృష్టించాడు. దీంతో బాబర్ పేరిట ప్రపంచ రికార్డు నమోదైంది. అతను ఎంఎస్ ధోని, రోహిత్ శర్మలతో కూడిన క్లబ్‌లో చేరాడు.

IPL 2024: దురదృష్టం అంటే నీదే భయ్యా.. ‘అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’గా ఔటైన మూడో ప్లేయర్‌గా ధోని టీంమేట్..

Obstructing The Field: రవీంద్ర జడేజా ఐపీఎల్ చరిత్రలో 'అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్' ద్వారా అవుట్ అయిన మూడో ఆటగాడిగా నిలిచాడు. 2013లో టోర్నీలో తొలిసారిగా ఈ తరహా వికెట్ కనిపించింది.

IPL 2024: బెంగళూరు ప్లే ఆఫ్ చేరాలంటే చెన్నైపై గెలవాల్సిన మార్జిన్ ఇదే.. ఆర్‌సీబీ లక్ మారేనా?

RCB Playoffs Scenario: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడాయి. ఈ మ్యాచ్‌ల్లో సీఎస్‌కే 7 గెలవగా, ఆర్‌సీబీ 6 గెలిచింది. ఇప్పుడు లీగ్ దశలో ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోవచ్చు.

IPL 2024: మహి క్రేజ్ అలాంటిది మరి.. గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి ధోని కాళ్లపై పడిన అభిమాని.. వీడియో చూశారా?

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగి ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓడిపోయినా.. యధావిధిగా ధోనీ తన మెరుపు బ్యాటింగ్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 11 బంతులు ఎదుర్కొన్న ధోని 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 1 బౌండరీ, 3 అద్భుతమైన సిక్సర్లు ఉన్నాయి.

MS Dhoni: ‘తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తో మైదానంలోకి.. పరిగెత్తలేకే 9వ నంబర్‌లో బరిలోకి ధోని’

Dhoni Muscle Tear: ధోనీ చాలా బాధతో ఆడుతున్నాడు. రన్నింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మైదానంలో మెడిసిన్స్ తీసుకుంటున్నాడు. వైద్యులు ధోనీని ఆడోద్దని సూచించారు. కానీ ధోనికి వేరే మార్గం లేదు. ఎందుకంటే జట్టులోని చాలా మంది ఆటగాళ్లు గాయపడ్డారు. మేం మా B టీమ్‌తో ఆడుతున్నాం అంటూ ఇంతకుముందే ప్రకటించారు. ధోనీ గాయం గురించి తెలియని వారు ఇలా మాట్లాడుతున్నారు. కానీ అతను తన టీమ్ కోసం ఇలా చేస్తున్నాడు అంటూ ఫ్యా్న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

IPL 2024: ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రవీంద్ర జడేజా.. ఆ లిస్టులో తొలి ఆటగాడిగా..

IPL 2024, PBKS vs CSK: ధర్మశాలలోని HPCA స్టేడియంలో జరిగిన ఐపీఎల్ (IPL 2024) 53వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన పంజాబ్ కింగ్స్ జట్టు 139 పరుగులకే ఆలౌట్ అయి 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్ నుంచి దూరమైంది. చెన్నై మాత్రం తన సత్తా చాటుతూ టాప్ 4లో నిలిచింది.

IPL 2024: 16 ఏళ్లుగా ఆ విషయంలో విఫలమవుతోన్న ధోని.. చెక్ పెట్టేందుకు సిద్ధమైన కేరళ కింగ్.. అదేంటంటే?

500 Runs in An IPL Season: మహేంద్ర సింగ్ ధోనీ 16 ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నాడు. అతను ప్రారంభ సీజన్‌లో చాలా పరుగులు చేశాడు. కానీ, ఒక సీజన్‌లో 500 పరుగుల సంఖ్యను ఎప్పటికీ చేరుకోలేకపోయాడు. కాగా, ఓ సీజన్‌లో అతని అత్యధిక స్కోరు 461లుగా నిలిచింది. మరోవైపు, శాంసన్ కూడా 2013 నుంచి ఈ లీగ్‌లో భాగమయ్యాడు. కానీ, అతను కూడా ఈ ఫీట్‌ను ఎప్పటికీ సాధించలేకపోయాడు. అతను ఒక సీజన్‌లో అత్యధికంగా 483 పరుగులు చేశాడు.

IPL 2024: ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్.. లిస్టులో ధోనితో సహా ఎవరెవరున్నారంటే?

క్రికెట్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా, ఒక రోజు ఒక స్టార్ ఆటగాడు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే సమయం వస్తుంది. ఇది అభిమానులకు చాలా బాధ కలిగించవచ్చు. ఈ IPL 2024 సీజన్‌ తర్వాత కూడా కొంతమంది ఆటగాళ్లు క్రికెట్ కు గుడ్ బై చెప్పే అవకాశముంది. అంటే IPL 2025లో వీరు ఇక ఆడకపోవచ్చు.

IPL 2024: ‘ధోని నాకు తండ్రితో సమానం’.. మిస్టర్ కూల్‌పై అభిమానం చాటుకున్న ‘బేబి మలింగ’

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఎంతో మంది యువ క్రికెటర్లకు ఆదర్శం. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న సీనియర్లు కూడా ధోనిని అమితంగా ఆరాధిస్తారు. ఈనేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ పై ఆ జట్టు స్టార్ పేసర్ మతీషా పతిరణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

IPL 2024 : ఆ స్పెషల్ పర్సన్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన ధోని.. వీడియో చూసి హ్యాట్సాఫ్ చెబుతోన్న ఫ్యాన్స్

ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మెరుపు ఇన్నింగ్స్ లతో అభిమానులను అలరిస్తున్నాడు. సీఎస్కే కూడా ఇప్పటివరకు టోర్నీలో మంచి ప్రదర్శన చేసింది. ఇప్పుడు చెన్నై తదుపరి మ్యాచ్‌ని ధర్మశాలలో ఆడవలసి ఉంది. అయితే దీనికి ముందు ధోనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

IPL 2024: చెన్నైకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. ఇలాగైతే ఇంటికే

గతేడాది ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడింది. ఈ పది మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. మొత్తం 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు 4వ స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా 10 పాయింట్లతో ప్లేఆఫ్ రేసులో ఉన్నాయి.

CSK vs PBKS: మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న గైక్వాడ్.. పంజాబ్ టార్గెట్ 163..

Chennai Super Kings vs Punjab Kings, 49th Match: ఐపీఎల్-2024 49వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది.

Video: కెమెరా‌మెన్‌కు ఇచ్చిపడేసిన ధోని.. ఏకంగా బాటిల్‌తో.. వైరల్ వీడియో

IPL 2024: ఈ కఠినమైన లక్ష్యాన్ని ఛేదించిన లక్నో సూపర్‌జెయింట్స్‌కు మార్కస్ స్టోయినిస్ తుఫాన్ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. అద్భుతమై ఆటతో చెలరేగిన స్టోయినిస్ 63 బంతుల్లో 6 భారీ సిక్సర్లు, 13 ఫోర్లతో అజేయంగా 124 పరుగులు చేశాడు. ఈ తుఫాన్ బ్యాటింగ్‌తో లక్నో సూపర్‌జెయింట్‌ 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

CSK: టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్.. టీ20 క్రికెట్‌లోనే స్పెషల్ రికార్డ్..

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 39వ మ్యాచ్ ద్వారా టీ20 క్రికెట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. భారత జట్టు పేరిట ఉన్న అరుదైన రికార్డును బద్దలు కొట్టడం కూడా విశేషం. CSK నెలకొల్పిన సరికొత్త రికార్డు గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

IPL 2024: 65 సిక్స్‌లు, 53 ఫోర్లు.. ఇదేం ఊచకోత సామీ.. 42 ఏళ్లలోనూ జోరు ఏమాత్రం తగ్గేలేదుగా..

MS Dhoni In The 20th Over In IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) చరిత్రలో మహేంద్ర సింగ్ చివరి ఓవర్‌లో మొత్తం 313 బంతులు ఎదుర్కొన్నాడు. ఈసారి MSD బ్యాట్ కొట్టిన సిక్సర్ల సంఖ్య 65. అలాగే ఐపీఎల్‌లో చివరి ఓవర్లలో ధోనీ 772 పరుగులు చేశాడు.