AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేంద్ర సింగ్ ధోని

మహేంద్ర సింగ్ ధోని

మహేంద్ర సింగ్ ధోని.. కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ తర్వాత టీమిండియాకు ప్రపంచకప్ అందించిన ఏకైక కెప్టెన్. మహీని ముద్దుగా ఫ్యాన్స్ మిస్టర్ కూల్ అని పిలుస్తారు. ధోని బ్యాటింగ్ కంటే.. అతడు చేసే స్టంపింగ్‌కే ఫ్యాన్స్ ఎక్కువ అని చెప్పొచ్చు. స్టంప్స్ వెనుక ధోని ఉన్నాడంటే.. ప్రత్యర్ధి బ్యాటర్లలో గుండెల్లో గుబులు పుట్టాల్సిందే. అలాగే మిస్టర్ కూల్ వికెట్ల వెనుక తీసుకునే నిర్ణయాలు.. ప్రత్యర్ధి పరాభవాన్ని శాసిస్తాయి. ఇంకా చెప్పాలంటే.. డీఆర్ఎస్.. డెసిషన్ రివ్యూ సిస్టమ్‌ను ఏకంగా ధోని రివ్యూ సిస్టంగా లిఖించుకున్నాడు ఈ మిస్టర్ కూల్. అంపైరలైనా అప్పుడప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు గానీ.. ధోని నిర్ణయాలు మాత్రం ఎప్పుడూ పర్ఫెక్టే. 2007లో సారధిగా టీమిండియా పగ్గాలు చేపట్టిన ధోని.. క్రికెట్ చరిత్రలో అద్భుతమైన కెప్టెన్లలో ఒకరిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇదిలా ఉంటే.. 2010, జూలై 4న ధోని, సాక్షి సింగ్‌ల వివాహం డెహ్రాడున్‌లో జరిగింది. వీరికి జీవా ధోని కుమార్తె.

డిసెంబర్ 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోని. ఆ తర్వాత 2005లో శ్రీలంకతో తన తొలి టెస్ట్ ఆడాడు. 2007లో రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ అనంతరం.. టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు ధోని. ఆ సమయంలో అతడు తీసుకున్న పలు నిర్ణయాలు సంచలనంగా కూడా మారాయి. కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న వెంటనే.. మొట్టమొదటి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లోనే శ్రీలంక, న్యూజిలాండ్‌లపై టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. అలాగే ధోని సారధ్యంలోనే టీమిండియా 2007 ఐసీసీ ప్రపంచ టీ20 ఛాంపియన్‌గా నిలిచింది. అతడి నేతృత్వంలో టీమిండియా 2007-08 సీ.బీ. సిరీస్, 2010 ఆసియా కప్, 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది.

2011 ప్రపంచ కప్ ఫైనల్లో ధోని 91 పరుగులతో అజేయంగా నిలవడమే కాదు.. ఆఖర్లో అతడు కొట్టిన సిక్స్.. ఇప్పటికీ యావత్ భారతదేశానికి గుర్తిండిపోతుంది. 2013 జూన్‌లో ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించడంతో.. ధోనీ మూడు ఐసీసీ పరిమిత ఓవర్ల ట్రోఫీలు(ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ ట్వీంటీ 20) గెలుచుకున్న మొదటి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. 2008లో టెస్ట్ కెప్టెన్సీ చేజిక్కించుకున్న ధోని.. న్యూజిలాండ్, వెస్టిండీస్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2008, 2010, 2013లో టీమిండియాకు విజయాలను అందించాడు. 2009లో ధోనీ మొదటిసారిగా భారత్‌ను ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి తీసుకెళ్లాడు. 2013లో అతడి సారథ్యంలోనే టీమిండియా.. సరిగ్గా 40 సంవత్సరాల తర్వాత ఒక టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను వైట్‌వాష్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో, ధోని సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ ట్వంటీ 2010, 2014 సీజన్లలో కప్పు కొట్టింది. కాగా, 2014 డిసెంబర్ 30న ధోని టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా.. ఆగష్టు 15, 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికాడు ధోని.

ఇంకా చదవండి

MS Dhoni: ధోనీ ఆడకపోవడానికి గాయం కారణం కాదా.. ‘మిస్టర్ కూల్’ గైర్హాజరీ వెనుక అసలు నిజం ఇదే..?

Why Dhoni is not playing: ఐపీఎల్ 2026 చెన్నై సూపర్ కింగ్స్ దూసుకెళ్తోంది. అయితే, ఇప్పటి వరకు ధోని మాత్రం ఆడడం లేదు. అభిమానులు మాత్రం మిస్టర్ కూల్ కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు గాయం కారణంగా ధోని ఆడడం లేదని అంతా అనుకున్నారు. కానీ అసలు రీజన్ వేరొకటి ఉందంట.

MS Dhoni: ధోనీ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ.. ఆడేది ఆ 2 మ్యాచ్‌లేనట.? క్లారిటీ ఇచ్చిన మాజీ ప్లేయర్

MS Dhoni Injury Update: ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తమ ఆరాధ్య దైవం మహేంద్ర సింగ్ ధోనీ రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గాయం కారణంగా ఈ సీజన్‌లో సగానికి పైగా మ్యాచ్‌లకు దూరమైన ధోనీ ఫిట్‌నెస్‌పై తాజాగా బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ కీలక వ్యాఖ్యలు చేయగా, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన అంచనా ఇప్పుడు క్రీడా లోకంలో చర్చనీయాంశమైంది.

SRH vs CSK: హైదరాబాద్ రానున్న ధోని.. సన్‌రైజర్స్‌తో పోరుకు సై అంటోన్న మిస్టర్ కూల్?

MS Dhoni Recovery: ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలో పండుగ వాతావరణం నెలకొంది. గత ఐదు మ్యాచ్‌లకు దూరమైన దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ, హైదరాబాద్‌తో జరగనున్న కీలక పోరులో బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వార్తతో ఎల్లో ఆర్మీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

IPL 2026: ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

MS Dhoni Return Date Revealed: ఈ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తమ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. గాయం కారణంగా ఎంఎస్ ధోనీ జట్టుకు దూరమవడం ఒక పెద్ద ఎదురుదెబ్బ. ఏప్రిల్ 11న జరిగే మ్యాచ్‌కు కూడా ధోనీ దూరమయ్యే అవకాశం ఉంది. అతని గైర్హాజరీ కారణంగా సీఎస్‌కే వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది. డెవాల్డ్ బ్రెవిస్ కూడా గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఈ సమయంలో ధోనీ త్వరగా తిరిగి వస్తే జట్టుకు బలం చేకూరుతుంది.

IPL 2026: చెన్నై ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ధోని రాక మరింత లేట్.. ఎందుకంటే?

IPL 2026: ఐపీఎల్ 2026లో వరుసగా మూడు ఓటములతో చెన్నై సూపర్ కింగ్స్ కష్టాల్లో పడింది. జట్టు కీలక ఆటగాడు ఎంఎస్ ధోనీ కాలి గాయంతో బాధపడుతున్నాడు. మరెన్నో మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. అతని గైర్హాజరీలో, ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌లను గెలవాల్సిన ఒత్తిడి సీఎస్‌కేపై ఉంది. జట్టుకు ధోనీ అనుభవం, ఫినిషింగ్ నైపుణ్యాలు చాలా అవసరం. అతని కోలుకోవడం ఆలస్యం కావడంతో, ఢిల్లీ, కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై కూడా సందేహం నెలకొంది.

Team India: రూ. 2314 కోట్లా.. కుబేరుడే కుళ్లుకునేలా రోహిత్, ధోనీ, కోహ్లీ ఆస్తులు.. లెక్కలు చూస్తారా?

Richest Indian Cricketer: భారత క్రికెట్ చరిత్రలో ముగ్గురు దిగ్గజాలు రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ మైదానంలోనే కాకుండా సంపాదనలోనూ రికార్డులు సృష్టిస్తున్నారు. 2026 నాటికి వీరి నికర ఆస్తుల విలువ కోట్ల రూపాయల్లో ఉన్నాయి. అయితే, ఈ ముగ్గురిలో అత్యంత ధనవంతుడు ఎవరు? ఎవరికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

MS Dhoni: చెన్నై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ధోనీ రీఎంట్రీ డేట్ ఫిక్స్.. ముందే వచ్చేస్తున్నాడుగా..!

MS Dhoni Injury Update: చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములతో సతమతమవుతున్న వేళ, ఆ జట్టు ఆశల కిరణం మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. గాయం కారణంగా గత మూడు మ్యాచ్‌లకు దూరమైన ధోనీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే కీలక పోరులో జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.

Rohit Sharma: ధోనీ రికార్డ్ బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. కోహ్లీకి అందనంత ఎత్తులో హిట్ మ్యాన్..!

Rohit Sharma IPL 2026 Orange Cap: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. వరుస మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకోవడమే కాకుండా, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న ఒక భారీ రికార్డును తుడిచిపెట్టేశాడు. ఈ క్రమంలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీని కూడా రోహిత్ వెనక్కి నెట్టడం విశేషం.

RCB vs CSK: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు తలా రీఎంట్రీ..?

RCB vs CSK: Dhoni's IPL Return: చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్న మ్యాచ్ కోసం వేదిక సిద్ధంగా ఉంది. కండరాల నొప్పితో బాధపడుతున్న ధోని ఈ కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఆసక్తికరంగా ఉంది. ధోని ఇటీవల ప్రాక్టీస్‌లో పాల్గొనడం అభిమానులలో ఆశను రేకెత్తించింది.

CSK vs PBKS: తొలి ఓటమితో ఆ ఇద్దరికి దిమ్మతిరిగే షాక్.. పంజాబ్‌ను ఢీకొట్టే చెన్నై టీం ఇదే..?

Chennai Super Kings vs Punjab Kings: ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఎదురైన పరాజయం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తేరుకుంది. ఏప్రిల్ 3న సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న కీలక పోరు కోసం చెన్నై యాజమాన్యం తుది జట్టులో రెండు కీలక మార్పులు చేస్తోంది. స్టార్ ఆటగాళ్ల రాకతో ఈసారి విజయం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ధోనితో అందుకే మాట్లాడలేదు.. CSK రీయూనియన్ వివాదంపై జడేజా ఏమన్నాడంటే?

Jadeja Dhoni Rift Rumors: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానుల్లో ప్రస్తుతం ఒకే చర్చ నడుస్తోంది. సీఎస్‌కే ప్లేయర్ల రీయూనియన్ సందర్భంగా రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీతో ఎందుకు మాట్లాడలేదు? వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయా? అనే అనుమానాలు సోషల్ మీడియా వేదికగా సంచలనంగా మారింది. తాజాగా జడేజా ఈ విషయంపై స్పందించాడు.

RR vs CSK: ధోనీతో సహా ముగ్గురు స్టార్స్ దూరం.. ఐపీఎల్ హిస్టరీలో తొలిసారి ఇలా..!

Rajasthan Royals vs Chennai Super Kings, 3rd Match, Indian Premier League 2026: ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. అయితే, ఈ పోరుకు ముందే సీఎస్‌కేకు భారీ షాక్ తగిలింది. ఎంఎస్ ధోనీతో పాటు మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఐపీఎల్ చరిత్రలో ముందెన్నడూ జరగని ఒక వింత సంఘటన ఈ మ్యాచ్‌తో నమోదు కానుంది.