Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేంద్ర సింగ్ ధోని

మహేంద్ర సింగ్ ధోని

మహేంద్ర సింగ్ ధోని.. కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ తర్వాత టీమిండియాకు ప్రపంచకప్ అందించిన ఏకైక కెప్టెన్. మహీని ముద్దుగా ఫ్యాన్స్ మిస్టర్ కూల్ అని పిలుస్తారు. ధోని బ్యాటింగ్ కంటే.. అతడు చేసే స్టంపింగ్‌కే ఫ్యాన్స్ ఎక్కువ అని చెప్పొచ్చు. స్టంప్స్ వెనుక ధోని ఉన్నాడంటే.. ప్రత్యర్ధి బ్యాటర్లలో గుండెల్లో గుబులు పుట్టాల్సిందే. అలాగే మిస్టర్ కూల్ వికెట్ల వెనుక తీసుకునే నిర్ణయాలు.. ప్రత్యర్ధి పరాభవాన్ని శాసిస్తాయి. ఇంకా చెప్పాలంటే.. డీఆర్ఎస్.. డెసిషన్ రివ్యూ సిస్టమ్‌ను ఏకంగా ధోని రివ్యూ సిస్టంగా లిఖించుకున్నాడు ఈ మిస్టర్ కూల్. అంపైరలైనా అప్పుడప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు గానీ.. ధోని నిర్ణయాలు మాత్రం ఎప్పుడూ పర్ఫెక్టే. 2007లో సారధిగా టీమిండియా పగ్గాలు చేపట్టిన ధోని.. క్రికెట్ చరిత్రలో అద్భుతమైన కెప్టెన్లలో ఒకరిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇదిలా ఉంటే.. 2010, జూలై 4న ధోని, సాక్షి సింగ్‌ల వివాహం డెహ్రాడున్‌లో జరిగింది. వీరికి జీవా ధోని కుమార్తె.

డిసెంబర్ 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోని. ఆ తర్వాత 2005లో శ్రీలంకతో తన తొలి టెస్ట్ ఆడాడు. 2007లో రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ అనంతరం.. టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు ధోని. ఆ సమయంలో అతడు తీసుకున్న పలు నిర్ణయాలు సంచలనంగా కూడా మారాయి. కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న వెంటనే.. మొట్టమొదటి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లోనే శ్రీలంక, న్యూజిలాండ్‌లపై టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. అలాగే ధోని సారధ్యంలోనే టీమిండియా 2007 ఐసీసీ ప్రపంచ టీ20 ఛాంపియన్‌గా నిలిచింది. అతడి నేతృత్వంలో టీమిండియా 2007-08 సీ.బీ. సిరీస్, 2010 ఆసియా కప్, 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది.

2011 ప్రపంచ కప్ ఫైనల్లో ధోని 91 పరుగులతో అజేయంగా నిలవడమే కాదు.. ఆఖర్లో అతడు కొట్టిన సిక్స్.. ఇప్పటికీ యావత్ భారతదేశానికి గుర్తిండిపోతుంది. 2013 జూన్‌లో ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించడంతో.. ధోనీ మూడు ఐసీసీ పరిమిత ఓవర్ల ట్రోఫీలు(ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ ట్వీంటీ 20) గెలుచుకున్న మొదటి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. 2008లో టెస్ట్ కెప్టెన్సీ చేజిక్కించుకున్న ధోని.. న్యూజిలాండ్, వెస్టిండీస్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2008, 2010, 2013లో టీమిండియాకు విజయాలను అందించాడు. 2009లో ధోనీ మొదటిసారిగా భారత్‌ను ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి తీసుకెళ్లాడు. 2013లో అతడి సారథ్యంలోనే టీమిండియా.. సరిగ్గా 40 సంవత్సరాల తర్వాత ఒక టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను వైట్‌వాష్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో, ధోని సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ ట్వంటీ 2010, 2014 సీజన్లలో కప్పు కొట్టింది. కాగా, 2014 డిసెంబర్ 30న ధోని టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా.. ఆగష్టు 15, 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికాడు ధోని.

ఇంకా చదవండి

IPL 2025: ఈ సీజన్ పై నాకు నమ్మకం లేదు దొరా! మాజీ జట్టు ప్లేఆఫ్ ఆశలపై ధోని ఫ్రెండ్ కామెంట్స్

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శనపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్లేఆఫ్స్‌కు అవకాశం లేకుండా పోయిందని, జట్టు ఇప్పటికే యువ ఆటగాళ్లను సెట్ చేయాలని చూస్తోందని తెలిపారు. మధ్య ఓవర్లలో చెన్నై స్కోరు తగ్గినదే పరాజయానికి ప్రధాన కారణమని వివరించారు. ధోనీ భవిష్యత్, జట్టు వ్యూహంపై రాయుడు వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

  • Narsimha
  • Updated on: Apr 22, 2025
  • 4:17 pm

IPL 2025: సీఎస్కే టీమ్‌లో తీవ్ర విషాదం.. ఆ జట్టు స్టార్ ప్లేయర్ తండ్రి హఠాన్మరణం

ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన 38వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు చేతికి నల్లటి బ్యాండ్‌లు ధరించి మైదానంలోకి అడుగు పెట్టారు. దీనికి కారణం ఆ జట్టు స్టార్ ప్లేయర్ తండ్రి హఠాన్మరణం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చెన్నై టీమ్ మేనేజ్ మెంట్.

Video: డ్రెస్సింగ్ రూమ్‌లో విన్నింగ్ స్పీచ్ ఇచ్చిన హిట్‌మ్యాన్! స్వాగ్ చూడు భయ్యా!

ఐపీఎల్ 2025లో చెన్నైపై ఘన విజయం సాధించిన ముంబై ఇండియన్స్ విజయానికి రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఇంపాక్ట్ సబ్‌గా వచ్చిన రోహిత్ 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఇచ్చిన అతని స్టైలిష్ ప్రసంగం వైరల్ అయ్యింది. కెప్టెన్సీ లేకున్నా తన బ్యాట్‌తో, నాయకత్వంతో రోహిత్ మళ్లీ ‘హిట్‌మ్యాన్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

  • Narsimha
  • Updated on: Apr 21, 2025
  • 10:00 pm

IPL 2025: అరిగిపోయిన ధోని రివ్యూ సిస్టమ్! దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ధోని ఒక డీఆర్‌ఎస్‌ను తీసుకోకపోవడం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసింది. ఈ తప్పిదంపై అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ, సోషల్ మీడియాలో ధోనిని ట్రోల్ చేస్తున్నారు. అయితే, యువ ఆటగాడు ఆయుష్ మాత్రే, దూబే, జడేజాల అర్ధసెంచరీలు చెన్నైకు భరోసానిచ్చాయి. చివరికి, రోహిత్ ఇన్నింగ్స్‌తో ముంబై విజయం సాధించినా, సీఎస్‌కేపై అభిమానుల ఆశలు ఇంకా నిలిచేలా ఉన్నాయి.

  • Narsimha
  • Updated on: Apr 21, 2025
  • 2:49 pm

IPL 2025: నీ కొడుకుని నాకు వదిలేయ్ ఆ ఒక్కటి చూసుకో చాలు! గుంటూరోడిపై ధోని కామెంట్స్ రివీల్..

షేక్ రషీద్ తన ఐపీఎల్ అరంగేట్రంతో క్రికెట్ అభిమానులను ఆకర్షించాడు. అతని తండ్రి బలిషా వలి, రషీద్ ఫిట్‌నెస్ మరియు ఆహారం విషయంలో ఎంఎస్ ధోనీ ఇచ్చిన విలువైన సలహాలను గుర్తు చేస్తూ, అది తల్లిదండ్రులుగా చేసే శ్రమను చెప్పాడు. రషీద్ చిన్న వయస్సులోనే తన క్రికెట్ ప్రయాణం ప్రారంభించి, అండర్-14, అండర్-16 జట్లలో స్థానం సంపాదించాడు. అతను ప్రస్తుతానికి ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో కూడా ప్రభావవంతమైన ఆటగాడిగా నిలిచాడు.

  • Narsimha
  • Updated on: Apr 21, 2025
  • 2:30 pm

Video: అంపైర్ తో గొడవకు దిగిన మిస్టర్ కూల్! ఇంతకీ ఏమై ఉంటది గురు?

వాంఖడే వేదికగా జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చెన్నైపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో ధోని తీవ్రంగా నిరాశకు గురయ్యాడు, మ్యాచ్ అనంతరం అంపైర్‌తో వాదనలో కూడా కనిపించాడు. రోహిత్ శర్మ అర్ధసెంచరీతో ముంబైను విజయ దిశగా నడిపించాడు. సీఎస్‌కే ప్లేఆఫ్స్ ఆశలు తగ్గిపోతున్న వేళ, ధోని వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చకు దారి తీశాయి.

  • Narsimha
  • Updated on: Apr 21, 2025
  • 1:10 pm

IPL 2025: సీజన్లో మొదటి హాఫ్ సెంచరీ.. కట్ చేస్తే.. కోహ్లీని అధిగమించిన రోహిత్! ఆ లిస్ట్ లో టాప్ అవ్వాలంటే?

ఐపీఎల్ 2025లో చెన్నైపై జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ అజేయంగా 76 పరుగులు చేసి ఘన విజయం అందించాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా, అత్యధిక అవార్డులు అందుకున్న జాబితాలో విరాట్ కోహ్లీని అధిగమించి మూడవ స్థానానికి చేరాడు. రోహిత్ ఫామ్‌లోకి రావడం ముంబై ఇండియన్స్‌కు చాలా ధైర్యాన్నిస్తుంది.

  • Narsimha
  • Updated on: Apr 21, 2025
  • 11:59 am

MS Dhoni: రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చేసిన ధోని.. ముంబైపై ఓటమితో కీలక వ్యాఖ్యలు

MS Dhoni Retainment: ఐపీఎల్ 2025లో భాగంగా 38వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను తమ సొంత మైదానంలో 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ తర్వాత చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ చెప్పిన కొన్ని విషయాలు అందరినీ షాక్‌కి గురి చేశాయి.

Video: లియోనెల్ మెస్సీతో MS ధోని యాడ్! సోషల్ మీడియాలో ఆల్ టైమ్ రికార్డ్స్..

ఒక్క ODI, T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఏకైక భారత కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ, ఐపీఎల్ 2025లోనూ తన మేజిక్‌ను కొనసాగిస్తున్నారు. 43 ఏళ్ల వయస్సులో చెన్నై సూపర్ కింగ్స్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తూ, లక్నోపై కీలక ఇన్నింగ్స్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. ఇదే సమయంలో లేయ్స్ ప్రకటనలో మెస్సీతో కలిసి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ కలయిక అభిమానుల్లో ఆనంద జ్వాలలు రేపింది, ధోనీని మరింత ప్రత్యేకంగా నిలిపింది.

  • Narsimha
  • Updated on: Apr 19, 2025
  • 10:30 am

Video: రోబోకే దిమ్మతిరిగేలా బొమ్మ చూపించిన కెప్టెన్ కూల్.. తలా ఫర్ ఏ రీజన్ అంటున్న ఫ్యాన్!

ఐపీఎల్ 2025లో ధోని మైదానంలోకి వస్తున్న సమయంలో రోబోటిక్ కుక్కను చిలిపితనంతో పక్కకు పెట్టిన దృశ్యం వైరల్‌గా మారింది. ఈ సరదా సంఘటనతో ఫ్యాన్స్ "చంటోడిలా మారిన కెప్టెన్ కూల్" అంటూ కామెంట్లు చేశారు. అదే మ్యాచ్‌లో ధోని అద్భుత ప్రదర్శన చేస్తూ 26 పరుగులు చేసి సీఎస్కేకు విజయాన్ని అందించాడు. 43ఏళ్ల వయసులోనూ ధోని చూపించిన ఆటతీరు అభిమానుల హృదయాలను మరోసారి గెలుచుకుంది.

  • Narsimha
  • Updated on: Apr 15, 2025
  • 7:10 pm