AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వీడెవడండీ బాబూ.. బాల్ తిరిగి ఇవ్వకుండా దాచిన రింకూ సింగ్ ఫ్యాన్.. కట్‌చేస్తే.. షాకిచ్చిన పోలీస్..

IPL 2024: రింకూ సింగ్ అభిమానిని స్టేడియం నుంచి బయటకు నెట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఘటన కోల్‌కతాలో ముంబై ఇండియన్స్‌తో కేకేఆర్ ఆడిన చివరి మ్యాచ్‌ సమయంలో చోటు చేసుకుంది. కాగా, రింకూ సింగ్ పేరు ఉన్న జెర్సీని ధరించిన ఫ్యాన్‌ను పోలీసులు బయటకు నెట్టడం కనిపించింది.

Video: వీడెవడండీ బాబూ.. బాల్ తిరిగి ఇవ్వకుండా దాచిన రింకూ సింగ్ ఫ్యాన్.. కట్‌చేస్తే.. షాకిచ్చిన పోలీస్..
police pushing kkr rinku singh fanImage Credit source: X
Follow us
Venkata Chari

|

Updated on: May 14, 2024 | 12:17 PM

రింకూ సింగ్ అభిమానిని స్టేడియం నుంచి బయటకు నెట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఘటన కోల్‌కతాలో ముంబై ఇండియన్స్‌తో కేకేఆర్ ఆడిన చివరి మ్యాచ్‌ సమయంలో చోటు చేసుకుంది. కాగా, రింకూ సింగ్ పేరు ఉన్న జెర్సీని ధరించిన ఫ్యాన్‌ను పోలీసులు బయటకు నెట్టడం కనిపించింది.

వైరల్ వీడియోలో, ఈ కోల్‌కతా అభిమాని తన ప్యాంట్ లోపల దాచుకున్న బంతిని పోలీసులు వెనక్కి తీసుకోవడం కనిపిస్తుంది. వాస్తవానికి, యువ అభిమాని బంతి సిక్స్ స్టాండ్‌లో పడిన తర్వాత దానిని దాచడానికి ప్రయత్నించాడు. బంతిని వెనక్కు ఇవ్వకుండా తన ప్యాంట్‌లో దాచుకున్నాడు. దీంతో ఈ అభిమానిపై పోలీసులు చేయి చేసుకోవాల్సి వచ్చింది. సదరు పోలీసు ఫ్యాన్ నుంచి బంతిని తీసుకుని మైదానంలోకి తిరిగి విసిరేశాడు. ఆ తర్వాత ఫ్యాన్‌ను తిట్టి బయటి గేటు వైపు నెట్టాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

ఇవి కూడా చదవండి

MI vs KKR మ్యాచ్ స్థితి..

ఐపీఎల్ 2024లో వర్షం అంతరాయం కలిగించిన 60వ మ్యాచ్‌లో కోల్‌కతా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. 16 ఓవర్ల ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 8 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంది. కాగా ముంబై లీగ్‌ నుంచి నిష్క్రమించింది. కోల్‌కతా అద్భుత విజయానికి హీరో వరుణ్ చక్రవర్తి 17 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. వెంకటేష్ అయ్యర్ 21 బంతుల్లో 42 పరుగులు చేశాడు.

గాయం తర్వాత తిరిగి వచ్చిన నితీశ్ రాణా 23 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ముంబై తరపున ఇషాన్ కిషన్ అత్యధికంగా 40 పరుగులు చేశాడు. అతనితో పాటు తిలక్ వర్మ 17 బంతుల్లో 32 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా దారుణంగా ఫ్లాప్ అయ్యారు. రోహిత్ 19 పరుగులు చేయగా, కెప్టెన్ పాండ్యా రెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..