AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022, DC vs PBKS: కరోనా దెబ్బకు బీసీసీఐ కీలక నిర్ణయం.. ఢిల్లీ vs పంజాబ్ వేదిక మార్పు..

ఐపీఎల్ (IPL 2022) 32వ మ్యాచ్ వేదిక మారింది. పుణె వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను బీసీసీఐ ముంబైకి మార్చింది. ఎంసీఏ స్టేడియంలో ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో..

IPL 2022, DC vs PBKS: కరోనా దెబ్బకు బీసీసీఐ కీలక నిర్ణయం.. ఢిల్లీ vs పంజాబ్ వేదిక మార్పు..
Ipl 2022, Delhi Capitals Vs Punjab Kings
Venkata Chari
|

Updated on: Apr 19, 2022 | 5:07 PM

Share

ఐపీఎల్ (IPL 2022) 32వ మ్యాచ్ వేదిక మారింది. పుణె వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్(Delhi Capitals vs Punjab Kings) జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను బీసీసీఐ ముంబైకి మార్చింది. ఎంసీఏ స్టేడియంలో ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతుందని బీసీసీఐ సెక్రటరీ జే షా ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. అయితే, ఈ మ్యాచ్ షెడ్యూల్ తేదీ(ఏప్రిల్ 20న) నే జరుగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ని పూణె నుంచి ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియానికి మార్చినట్లు బీసీసీఐ(BCCI) ఓ ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీ క్యాపిటల్స్‌లోని ఐదుగురు సభ్యులకు కరోనా సోకినట్లు బీసీసీఐ తన పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈమేరకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన ఫిజియో పాట్రిక్ ఫర్‌హార్ట్ తొలి కేసుగా గుర్తించారు. ఏప్రిల్ 15న అతనికి పాజిటివ్ అని తేలింది. దీని తరువాత, ఢిల్లీ స్పోర్ట్స్ మసాజ్ స్పెషలిస్ట్ చేతన్ కుమార్ ఏప్రిల్ 16 న కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. ఏప్రిల్ 18న ఢిల్లీ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. టీమ్ డాక్టర్ అభిజీత్ సాల్వికి అదే రోజు కరోనా వచ్చింది. ఏప్రిల్ 18న, ఢిల్లీ సోషల్ మీడియా కంటెంట్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్న ఆకాష్ మానే కూడా కోవిడ్ పాజిటివ్‌గా గుర్తించారు.

ఐపీఎల్ 2022లో సమస్యగా మారనుందా?

ఐపీఎల్ 2022 ప్రస్తుతం పెద్ద సమస్యలో పడనుందా? అంటే అవుననే తెలుస్తోంది. ఎందుకంటే ప్రతి ఆటగాడితో సన్నిహితంగా ఉండే ఢిల్లీ క్యాపిటల్స్ సభ్యులకు కరోనా వచ్చింది. టీమ్ ఫిజియో, మసాజ్ స్పెషలిస్ట్, డాక్టర్ కరోనా బారిన పడ్డారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు వారితోనే ఉంటారు. మిచెల్ మార్ష్ కూడా ఫిజియో పాట్రిక్ ఫర్‌హార్ట్‌తో చాలా సమయం గడిపాడు. మార్ష్ లాగా, ఫిజియో లేదా టీమ్ డాక్టర్, మసాజ్ స్పెషలిస్ట్‌తో మరికొందరు ఆటగాళ్లు ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో, కరోనా జట్టులోని ఇతర సభ్యులకు సోకే అవకాశం ఉంది.

ఐపీఎల్ 2022లో కరోనాకు నియమాలు ఎలా ఉన్నాయి..

బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్‌లో ఉన్న ఏ సభ్యుడైనా ఏడు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఆరో, ఏడో తేదీన ఆ వ్యక్తికి కోవిడ్ పరీక్ష ఉంటుంది. 24 గంటల్లోపు రెండు RT-PCR పరీక్షల్లో ప్రతికూలంగా తేలితేనే, అతన్ని బయో బబుల్‌లో చేర్చుతారు. జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు కరోనా ఉంటే, దానిలోని 12 మంది సభ్యులు మాత్రమే అందుబాటులో ఉంటే, అప్పుడు 11 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఏడుగురు భారత ఆటగాళ్లు, ఒక సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌ ఉంటారు. 12 మంది ఆటగాళ్లు లేకుంటే రెండో రోజు మ్యాచ్ జరుగుతుంది. ఇది జరగకపోతే, విషయం సాంకేతిక కమిటీకి పంపనున్నారు. దాని నిర్ణయం అంతిమంగా ఉంటుంది.

Also Read: Watch Video: ఐపీఎల్‌లో తొలిసారి అద్భుతం చేసిన రాజస్థాన్ టీం.. ఆ స్పెషల్ రికార్డులో చేరిన బ్యాటర్స్ ఎవరంటే?

KTR: సన్‌రైజర్స్‌ బౌలర్‌ స్పీడ్‌కు కేటీఆర్‌ ఫిదా.. ఐపీఎల్‌లో చరిత్రలోనే అత్యుత్తమ ఓవర్‌ అంటూ..

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ