AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: విన్నింగ్ కింగ్ ధోనీకి జట్టు సభ్యుల గిఫ్ట్.. తొలి విజయాన్ని అందుకున్న సీఎస్‌కే

ఐపీఎల్ 2021లో తొలి విజయాన్ని అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చాలా  ఛాలా ఈజీగా విజయం సాధించింది. పంజాబ్ విసిరిన 107 ప‌రుగుల..

IPL 2021: విన్నింగ్ కింగ్ ధోనీకి జట్టు సభ్యుల గిఫ్ట్.. తొలి విజయాన్ని అందుకున్న సీఎస్‌కే
Csk Win
Sanjay Kasula
|

Updated on: Apr 17, 2021 | 5:13 AM

Share

ఐపీఎల్ 2021లో తొలి విజయాన్ని అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చాలా  ఛాలా ఈజీగా విజయం సాధించింది. పంజాబ్ విసిరిన 107 ప‌రుగుల టార్గెట్ ను  మ‌రో 4.2 ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే 4 వికెట్లు న‌ష్ట‌పోయి ఛేదించింది.

ఆల్‌రౌండ‌ర్ మొయిన్ అలీ 31 బంతుల్లో 46 ప‌రుగులు చేసి చెన్నై విజ‌యాన్ని అందించాడు. చేజింగ్‌లో 24 ప‌రుగుల‌కే రుతురాజ్ గైక్వాడ్ (5) రూపంలో సూప‌ర్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయినా రెండో వికెట్‌కు డుప్లెస్సితో క‌లిసి 66 ప‌రుగులు జోడించాడు. ఈ ఇద్ద‌రూ పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లను పరుగులు పెట్టించారు. వీలు దొరికిన‌ప్పుడ‌ల్లా బౌండ‌రీలతో మెరిపిస్తూ జట్టును టార్గెట్ కు ద్గరగా  .. చెన్నైని ల‌క్ష్యం వైపు న‌డిపించారు. అస‌లు ఏ స‌మ‌యంలోనూ చెన్నై ఇబ్బంది ప‌డ‌లేదు. గెలుపు ముంగిట రైనా (8), రాయుడు (0) వ‌రుస బంతుల్లో అవుట‌య్యారు. అయితే మిగిలిన ప‌నిని డుప్లెస్సి (36 నాటౌట్‌), శామ్ క‌ర‌న్‌ (5 నాటౌట్) ముగించారు. చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌ఫున 200వ మ్యాచ్ ఆడుతున్న ధోనీకి టీమ్ సభ్యులు విజ‌యాన్ని గిఫ్ట్‌గా అందించారు.