Afghanistan Players : ఐపీఎల్ – 2021 కి ముందు ఎంఎస్ ధోనికి గుడ్‌న్యూస్.. ఆ ఇద్దరు ఆటగాళ్లు సీఎస్‌కే కు కొండంత అండ..

Afghanistan Players : గత ఐపీఎల్‌లో చేసిన తప్పుల నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ పాఠాలు నేర్చుకున్నట్లుగా కనిపిస్తోంది. కరోనా వైరస్ కారణంగా ఐపిఎల్ 2020 కి ముందు ధోని జట్టు ఎటువంటి సన్నాహాలు

Afghanistan Players : ఐపీఎల్ - 2021 కి ముందు ఎంఎస్ ధోనికి గుడ్‌న్యూస్.. ఆ ఇద్దరు ఆటగాళ్లు సీఎస్‌కే కు కొండంత అండ..
Afghanistan Players
Follow us

|

Updated on: Mar 30, 2021 | 10:29 PM

Afghanistan Players : గత ఐపీఎల్‌లో చేసిన తప్పుల నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ పాఠాలు నేర్చుకున్నట్లుగా కనిపిస్తోంది. కరోనా వైరస్ కారణంగా ఐపిఎల్ 2020 కి ముందు ధోని జట్టు ఎటువంటి సన్నాహాలు చేయలేకపోయింది.. అంతేకాకుండా ఆ సీజన్‌లో ఏడో స్థానంలో నిలిచింది. పదమూడు మంది సభ్యులు కరోనా బారిన పడ్డారు. సురేష్ రైనా, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాలు టోర్నమెంట్ నుంచి వైదొలిగారు. ఐపీఎల్ టోర్నమెంట్ చరిత్రలో మొదటిసారి ప్లేఆఫ్‌లోకి ప్రవేశించలేకపోయింది. దీంతో 2021 ఐపీఎల్‌కి అలా కాకూడదని గట్టి ప్రణాళికతో ముందుకు వెళుతుంది.

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముంబైలో క్యాంప్ చేస్తోంది.. ఎంఎస్ ధోని, అంబటి రాయుడు, సురేష్ రైనా, డ్వేన్ బ్రావోలు జట్టులో చేరారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు ఇద్దరు స్టార్స్ నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫారూకి కూడా ధోని జట్టులో చేరడానికి వచ్చారు. వాస్తవానికి, ఐపిఎల్ 2021 బలమైన సన్నాహాలకు సిఎస్‌కె ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఈ ఇద్దరు ఆటగాళ్లను ప్రాక్టీస్ కోసం పిలిపించింది. ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ హర్దాస్ విల్జోయెన్ సిఎస్‌కె బ్యాట్స్‌మెన్‌లకు నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నట్లు కనిపించాడు.

16 ఏళ్ల నూర్ అహ్మద్ లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్.. బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్‌తో కూడా సంబంధం కలిగి ఉన్నాడు. సెయింట్ లూసియా కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో గత సీజన్లో నూర్ అహ్మద్‌ను తన జట్టులో చేర్చుకున్నారు. కానీ ట్రాన్సిట్ వీసా పొందకపోవడం వల్ల ఈ టోర్నమెంట్‌లో ఆడలేదు. అదే సమయంలో.. 20 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఫజ్లాక్ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తరఫున అరంగేట్రం చేశాడు. అబుదాబిలో ఇటీవల ఆడిన టి 20 సిరీస్‌లో జింబాబ్వేపై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో అతను నాలుగు ఓవర్లలో 27 పరుగులకు ఒక వికెట్ తీసుకున్నాడు.

విద్యుత్‌షాక్‌కు గురై చనిపోయిన చిలుక.. సంప్రదాయబద్ధంగా రామచిలుకకు అంతిమ సంస్కారాలు

Tamil Nadu Election 2021 : వాళ్ళొస్తే మహిళలకు డేంజర్, అసెంబ్లీలో దివంగత జయలలితకు జరిగిన అవమానాన్ని గుర్తుచేసిన మోదీ

కరోనావైర‌స్ ఇంకా యాక్టివ్‌గానే ఉంది.. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సూచిన సీఎస్ సోమేశ్ ‌కుమార్