టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ

జైపూర్: ఐపీఎల్‌ 12వ సీజన్‌లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మైదానంలో ఎక్కువ జట్లు ఛేజింగ్ చేసి విజయం సాధించడంతో బౌలింగ్‌ ఎంచుకున్నానని అయ్యర్ వెల్లడించాడు. ఆడిన 10 మ్యాచుల్లో 6 గెలిచి 12 పాయింట్లతో ఉన్న ఢిల్లీ ఈ పోరులో గెలిచి ప్లేఆఫ్‌కు మార్గం మరింత సులభం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా […]

టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ
Follow us

|

Updated on: Apr 22, 2019 | 7:56 PM

జైపూర్: ఐపీఎల్‌ 12వ సీజన్‌లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మైదానంలో ఎక్కువ జట్లు ఛేజింగ్ చేసి విజయం సాధించడంతో బౌలింగ్‌ ఎంచుకున్నానని అయ్యర్ వెల్లడించాడు. ఆడిన 10 మ్యాచుల్లో 6 గెలిచి 12 పాయింట్లతో ఉన్న ఢిల్లీ ఈ పోరులో గెలిచి ప్లేఆఫ్‌కు మార్గం మరింత సులభం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే రాజస్థాన్‌కు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్‌.

Latest Articles