AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni : గుజరాత్ మ్యాచ్‌లోనూ కనిపించని ధోనీ.. అసలు ఏం జరిగింది? కోచ్ ఏమన్నాడంటే ?

MS Dhoni : ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లోనే ఎంఎస్ ధోనీకి పిక్క కండరానికి గాయమైంది. సాధారణంగా ఇలాంటి గాయాలు తగ్గడానికి రెండు వారాల సమయం పడుతుందని మేనేజ్‌మెంట్ భావించింది. కానీ సీజన్ మొదలై నెల రోజులు కావస్తున్నా ధోనీ ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదు.

MS Dhoni : గుజరాత్ మ్యాచ్‌లోనూ కనిపించని ధోనీ.. అసలు ఏం జరిగింది? కోచ్ ఏమన్నాడంటే ?
Ms Dhoni
Rakesh
|

Updated on: Apr 27, 2026 | 7:53 AM

Share

MS Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం ఇంకా రానేలేదు. ఏప్రిల్ 26న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ మైదానంలోకి వస్తాడని అందరూ ఆశపడ్డారు. కానీ మ్యాచ్ ముగిసే వరకు కనీసం ధోనీ డగౌట్‌లో కూడా సరిగ్గా కనిపించకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. అసలు ధోనీ ఎప్పుడు ఆడతాడు? ఈ సీజన్ మొత్తానికి దూరం కాబోతున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ, చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కీలక విషయాలు వెల్లడించారు.

అసలు ధోనీకి ఏమైంది?

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లోనే ఎంఎస్ ధోనీకి పిక్క కండరానికి గాయమైంది. సాధారణంగా ఇలాంటి గాయాలు తగ్గడానికి రెండు వారాల సమయం పడుతుందని మేనేజ్‌మెంట్ భావించింది. కానీ సీజన్ మొదలై నెల రోజులు కావస్తున్నా ధోనీ ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇలాంటి కష్ట సమయంలో ధోనీ జట్టులో లేకపోవడం పెద్ద లోటుగా మారింది.

కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఏమన్నారంటే?

గుజరాత్ మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ధోనీ గురించి మాట్లాడుతూ నిజాన్ని ఒప్పేసుకున్నారు. “పిక్క కండరం గాయం అనేది చాలా మొండిది. అది పూర్తిగా తగ్గకుండా మైదానంలోకి వస్తే పరిస్థితి ఇంకా విషమిస్తుంది. ఒకవేళ ధోనీ తొందరపడి ఆడి, మళ్ళీ గాయపడితే.. ఇక ఈ సీజన్ మొత్తానికి దూరం కావాల్సి వస్తుంది. అందుకే మేము రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు” అని ఫ్లెమింగ్ పేర్కొన్నారు. ధోనీ ఫిజియోల పర్యవేక్షణలో కఠినంగా శ్రమిస్తున్నాడని, అయితే అతను ఎప్పుడు ఆడతాడనే దానిపై ఇప్పటికిప్పుడు ఒక తేదీని చెప్పలేమని స్పష్టం చేశారు.

అభిమానుల ఆందోళన

ధోనీ ప్రస్తుతానికి జట్టుతో పాటే ప్రయాణం చేస్తున్నాడు. నెట్స్ ప్రాక్టీస్‌లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు. కానీ మ్యాచ్ ఆడటానికి కావలసిన పూర్తి స్థాయి ఫిట్‌నెస్ ఇంకా రాకపోవడం వల్ల మేనేజ్‌మెంట్ అతడిని పక్కన పెడుతోంది. ధోనీ వయస్సు దృష్ట్యా ఇలాంటి గాయాలు తగ్గడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుందనేది వాస్తవం. అయితే ధోనీ లేని కారణంగా చెన్నై టీమ్ బ్యాటింగ్ ఆర్డర్ లో, వికెట్ల వెనుక లోటు స్పష్టంగా కనిపిస్తోంది.

తిరిగి ఎప్పుడు రావచ్చు?

ఫ్లెమింగ్ మాటలను బట్టి చూస్తే, ధోనీ రాబోయే మరో రెండు మూడు మ్యాచ్‌లకు కూడా దూరం కావచ్చని తెలుస్తోంది. కేవలం డాక్టర్లు, ఫిజియోల నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ రాగానే ధోనీ మైదానంలో అడుగుపెడతాడు. లీగ్ దశ ముగిసేలోపు ధోనీ కచ్చితంగా కొన్ని మ్యాచ్‌లు ఆడి ప్లేఆఫ్స్ నాటికి జట్టును సిద్ధం చేస్తాడని మేనేజ్‌మెంట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అంతవరకు ధోనీ ఫ్యాన్స్ మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us