కోహ్లీ, రోహిత్లు ఏమాత్రం పనికిరారు భయ్యో.. సంపదలో అంబానీతో టీమిండియా క్రికెటర్ పోటీ.. ఎవరో తెలుసా?
Team India: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ ద్వారా ఎంతో డబ్బు సంపాదించారు. ఇది మాత్రమే కాదు వీరు ప్రకటనలు, ప్రమోషన్ల ద్వారా కూడా చాలా డబ్బు సంపాదిస్తున్నారు. నివేదికల ప్రకారం, విరాట్ కోహ్లీ మొత్తం నికర విలువ దాదాపు రూ. 1050 కోట్లు కాగా, రోహిత్ శర్మ నికర విలువ దాదాపు రూ. 214 కోట్లు.

Aryaman Birla Net Worth: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ క్రికెట్ ప్రపంచంలో కీలక పేర్లు. తమ ఆట ఆధారంగా ఎంతో డబ్బు సంపాదించారు. నికర విలువ పరంగా వీరు అగ్రశ్రేణి క్రికెటర్ల జాబితాలో ఉన్నారు. అయితే, వీళ్లను మించి ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన క్రికెటర్ల జాబితాలో చేరిన 28 ఏళ్ల భారతీయ ఆటగాడి గురించి మీకు తెలుసా? సంపాదన పరంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కంటే చాలా ముందున్న వ్యక్తి గురించి తెలుసుకుంటే కచ్చితంగా షాక్ అవుతారు.
నికర విలువ పరంగా, ఈ ఇద్దరు ఆటగాళ్ళు ఎక్కడా కనిపించరు. ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి భారతదేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి గట్టి పోటీని ఇస్తున్నారని నేరుగా చెప్పవచ్చు. ఈ నివేదికలో ఆ ఆటగాడి గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. 28 ఏళ్ల భారతీయ యజమాని ఎన్ని వేల కోట్లకు అధిపతో చూద్దాం?
ఈ ఆటగాడి ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ మొత్తం సంపద చిన్నదే..
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ ద్వారా ఎంతో డబ్బు సంపాదించారు. ఇది మాత్రమే కాదు వీరు ప్రకటనలు, ప్రమోషన్ల ద్వారా కూడా చాలా డబ్బు సంపాదిస్తున్నారు. నివేదికల ప్రకారం, విరాట్ కోహ్లీ మొత్తం నికర విలువ దాదాపు రూ. 1050 కోట్లు కాగా, రోహిత్ శర్మ నికర విలువ దాదాపు రూ. 214 కోట్లు. కానీ, 28 ఏళ్ల భారతీయ ఆటగాడు నికర విలువ పరంగా చాలా ముందున్నాడు.
ఈ 28 ఏళ్ల ఆటగాడి నికర విలువ తెలిస్తే షాక్..
ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా కుమారుడు ఆర్యమాన్ బిర్లా గురించి చాలా తక్కువ మంది క్రికెట్ ప్రేమికులకు తెలుసు. ఆయన జులై 9, 1997న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు. అయితే, ఆర్యమాన్ బిర్లా క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక మనీ గురించి మాట్లాడుకుంటే, ఆయన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కంటే మాత్రమే కాకుండా సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీల కంటే కూడా చాలా ముందున్నాడు.
ఇక ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన క్రికెటర్లలో ఆయన మొదటి స్థానంలో ఉన్నాడు. ఆర్యమన్ బిర్లా మొత్తం సంపద 70,000 కోట్లు. 15 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్న కోహ్లీ (1050 కోట్లు), రోహిత్ (214 కోట్లు) ఎక్కడ ఉన్నారో మీరే ఊహించుకోండి.
కాగా, ఆర్యమాన్ బిర్లా తన క్రికెట్ కెరీర్లో లోతైన ముద్ర వేయలేకపోయాడు. ఆర్యమాన్ బిర్లా 2022 సంవత్సరంలో క్రికెట్కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. 22 సంవత్సరాల వయస్సులో క్రికెట్ నుంచి రిటైర్ కావడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఐపీఎల్ 2018లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా..
నికర విలువ పరంగా విరాట్ కోహ్లీ కంటే ధనవంతుడైన ఆర్యమాన్ బిర్లా, మధ్యప్రదేశ్ దేశవాళీ క్రికెట్లో భాగంగా ఉన్నాడు. ఈ జట్టు తరపున అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 9 మ్యాచ్లు ఆడాడు. 16 ఇన్నింగ్స్లలో 414 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ నుంచి 1 సెంచరీ, 1 హాఫ్ సెంచరీ కనిపించాయి. లిస్ట్ A గురించి చెప్పాలంటే, అతను 4 మ్యాచ్లలో 3 ఇన్నింగ్స్లలో 36 పరుగులు చేశాడు.
అదే సమయంలో, అతను 2018లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్లో భాగమయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ ఆర్యమాన్ బిర్లాను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ, ఈ కాలంలో అతనికి ఒక్క మ్యాచ్లోనూ ఆడే అవకాశం రాలేదు. అటువంటి పరిస్థితిలో, IPLలో అరంగేట్రం చేయాలనే అతని కల నెరవేరలేదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








