IND vs PAK Score: పేసర్ల దెబ్బకు భారత్ ఆలౌట్.. పాక్ టార్గెట్ ఎంతంటే?
ICC T20 World Cup India vs Pakistan 1st innings score: టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్కు భారత్ 120 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమ్ ఇండియా తరపున రిషబ్ పంత్ అత్యధికంగా 42 పరుగులు చేశాడు. అతను తప్ప మరే బ్యాట్స్మెన్ కూడా 20 మార్కును దాటలేకపోయాడు. జట్టు మొత్తం 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది.
![IND vs PAK Score: పేసర్ల దెబ్బకు భారత్ ఆలౌట్.. పాక్ టార్గెట్ ఎంతంటే?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/india-vs-pakistan-5.jpg?w=1280)
టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్కు భారత్ 120 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమ్ ఇండియా తరపున రిషబ్ పంత్ అత్యధికంగా 42 పరుగులు చేశాడు. అతను తప్ప మరే బ్యాట్స్మెన్ కూడా 20 మార్కును దాటలేకపోయాడు. జట్టు మొత్తం 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది.
వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో భారత్ పవర్ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. అయితే, ఆ తర్వాత 13 ఓవర్లలో 69 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా 3 వికెట్లు తీశాడు. 15వ ఓవర్లో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా వికెట్లు పడగొట్టడం ద్వారా అమీర్ భారత్ను వెనక్కి నెట్టాడు.
పాక్ తరపున పేసర్లే అన్ని వికెట్లు తీశారు. నసీమ్ షా 3, హరీస్ రవూఫ్ 3, మహ్మద్. అమీర్కు 2 వికెట్లు, షాహీన్ షా ఆఫ్రిదికి ఒక వికెట్ లభించింది
నసావులో ఇప్పటివరకు 4 మ్యాచ్లు జరగగా, ఛేజింగ్ జట్టు 3 మ్యాచ్ల్లో విజయం సాధించింది. టి-20 ప్రపంచకప్ గురించి మాట్లాడితే, ఈ టోర్నమెంట్లో భారత్-పాకిస్థాన్ మధ్య ఇది 8వ మ్యాచ్. గత 7 మ్యాచ్ల్లో భారత్ 6, పాకిస్థాన్ 1 గెలిచాయి.
ఇరు జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): మహ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్.