AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: క్షణాల్లో అమ్ముడైన భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ టిక్కెట్లు.. ధరలు తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Asia Cup 2023: ఆసియా కప్ 2023కు రంగం సిద్ధమైంది. అయితే, ఇప్పటి వరకు భారత జట్టును ప్రకటించలేదు. అయితే, అభిమానులు మాత్రం టీమిండియా స్వ్కాడ్ కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఆసియాకప్ 2023లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య శ్రీలంకలోని పల్లెకెలె మైదానంలో జరగబోయే మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్‌లో సెప్టెంబర్ 2న గ్రూప్-ఏలో పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడిన భారత్.. సెప్టెంబర్ 4న నేపాల్ జట్టుతో రెండో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కి కూడా టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి.

IND vs PAK: క్షణాల్లో అమ్ముడైన భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ టిక్కెట్లు.. ధరలు తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
India Vs Pakistan
Venkata Chari
|

Updated on: Aug 18, 2023 | 9:23 AM

Share

India vs Pakistan Match Ticket Rates: శ్రీలంకలో జరగనున్న ఆసియా కప్ మ్యాచ్‌ల కోసం టిక్కెట్ల విక్రయాలు కూడా ప్రారంభమయ్యాయి. టోర్నీలో 4 మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరగనున్నాయి. అదే సమయంలో శ్రీలంక ఫైనల్‌తో సహా మొత్తం 9 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 2న శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య గ్రూప్-ఏ మ్యాచ్ కూడా జరగనుంది. ఈ మ్యాచ్ అమ్మకాలు ప్రారంభించిన వెంటనే టిక్కెట్లు విక్రయించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అదే సమయంలో అత్యంత ఖరీదైన మ్యాచ్ టిక్కెట్ ధర వింటే షాక్ అవుతారు.

క్రికెట్ ఫీల్డ్‌లో ఏ దేశంలోనైనా భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే అభిమానుల్లో కచ్చితంగా క్రేజ్ ఉంటుంది. శ్రీలంకలో జరగనున్న ఈ మ్యాచ్‌కు సంబంధించి కూడా అలాంటిదే కనిపిస్తుంది. ఇక్కడ మొదట ఖరీదైన టిక్కెట్ల అమ్మకం చాలా వేగంగా కనిపించింది. ఈ మ్యాచ్ కోసం అత్యంత ఖరీదైన టిక్కెట్ ధర 300 US డాలర్లుగా నిలిచింది. ఇది రూ.25,000లుగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ టిక్కెట్లు..

ఈ మ్యాచ్ కోసం అతి తక్కువ టిక్కెట్ ధర 30 US డాలర్లు అంటే రూ.2,500లు. అదే సమయంలో V-VIP, VIP స్టాండ్‌ల టిక్కెట్‌లన్నీ పూర్తిగా అమ్ముడయ్యాయి. వీఐపీ స్టాండ్ టిక్కెట్ ధర దాదాపు రూ.10,500లుగా మారింది. ఆసియా కప్ మ్యాచ్‌ల టిక్కెట్‌లను pcb.bookme.pk వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

ఇండియా వర్సెస్ నేపాల్ మ్యాచ్ టిక్కెట్లు కూడా..

ఆసియా కప్‌లో సెప్టెంబర్ 2న గ్రూప్-ఏలో పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడిన భారత్.. సెప్టెంబర్ 4న నేపాల్ జట్టుతో రెండో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కి కూడా టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. నేపాల్‌తో జరిగే మ్యాచ్‌కి సంబంధించిన అన్ని V-VIP, VIP స్టాండ్ టిక్కెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. ఈ మ్యాచ్‌కు అత్యంత ఖరీదైన టికెట్ ధర దాదాపు రూ.4200లుగా నిర్ణయించారు. అదే సమయంలో చౌకైన టిక్కెట్ ధర సుమారు రూ.850లుగా నిలిచింది.

టిక్కెట్ల రేట్లు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..