AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: వైజాగ్‌ మ్యాచ్‌లో ‘ఆరే’సిన బుమ్రా.. కుప్పకూలిన ఇంగ్లండ్‌.. టీమిండియా ఆధిక్యం ఎంతంటే?

ఇంగ్లండ్‌ తో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. విశాఖపట్నం డా.  వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ లో 253 పరుగులకు ఆలౌట్ అయ్యింది . దీంతో టీమిండియాకు

IND vs ENG: వైజాగ్‌ మ్యాచ్‌లో 'ఆరే'సిన బుమ్రా.. కుప్పకూలిన ఇంగ్లండ్‌.. టీమిండియా ఆధిక్యం ఎంతంటే?
Team India
Basha Shek
|

Updated on: Feb 03, 2024 | 6:08 PM

Share

ఇంగ్లండ్‌ తో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. విశాఖపట్నం డా.  వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ లో 253 పరుగులకు ఆలౌట్ అయ్యింది . దీంతో టీమిండియాకు 143 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్‌ తరఫున ఓపెనర్‌ జాక్‌ క్రాలే అత్యధికంగా 76 పరుగులతో ఇన్నింగ్స్‌ ఆడగా, కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ 47 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో టీమిండియా తరఫున మెరిసిన జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగలిగాడు. రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు తొలి సెషన్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ను 396 పరుగులకు ముగించింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు చావు దెబ్బ తీశారు. జస్ప్రీత్ బుమ్రా విధ్వంసక దాడితో 55.5 ఓవర్లలో 253 పరుగులకే కుప్పుకూలింది ఇంగ్లండ్‌. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్‌లో జాక్ క్రౌలీ 76, బెన్ స్టోక్స్ 47 పరుగులు చేశారు. జస్‌ప్రీత్ బుమ్రా టీమిండియా తరఫున అత్యధికంగా 6 వికెట్లు పడగొట్టాడు.

బుమ్రా, కుల్దీప్‌ చెలరేగడంతో..

టీమ్ ఇండియా 396 పరుగులకు సమాధానంగా బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లండ్ కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఓపెనింగ్ జోడీ జాక్ క్రౌలీ-బెన్ డకెట్ 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జాక్ క్రౌలీ, ఆలీ పోప్ ఇద్దరూ రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. కానీ ఆ తర్వాత భారత జట్టు బౌలర్లు చెలరేగారు. జాక్ క్రౌలీ, బెన్ స్టోక్స్ మినహా ఇంగ్లండ్ నుంచి ఎవరూ టీమ్ ఇండియా ఇచ్చిన 396 పరుగులకు సమాధానంగా ఇంగ్లండ్ తొలి 2 వికెట్లకు అర్ధ సెంచరీలు నమోదు చేసింది. ఓపెనింగ్ జోడీ జాక్ క్రౌలీ-బెన్ డకెట్ 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జాక్ క్రౌలీ మరియు ఆలీ పోప్ ఇద్దరూ రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. కానీ ఆ తర్వాత భారత జట్టు బౌలర్లు నిర్ణీత దూరంలో ఇంగ్లండ్ జట్టు వికెట్ తీసి త్వరగానే ఆలౌట్ చేశారు. జాక్ క్రౌలీ, బెన్ స్టోక్స్ మినహా ఇంగ్లండ్ నుంచి ఎవరూ భారీ ఇన్నింగ్స్ లు ఆడలేకపోయారు.

ఇవి కూడా చదవండి

జస్ప్రీత్ బుమ్రా టీమ్ ఇండియా తరఫున 6 వికెట్లు పడగొట్టి, టెస్టు క్రికెట్‌లో 150 వికెట్ల మైలురాయిని దాటిన 17వ భారత బౌలర్‌గా నిలిచాడు. బుమ్రాతో పాటు కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. రెండో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 15 పరుగులు, కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.

బిక్కమొహం వేసిన పోప్..

భారత్ ప్లేయింగ్ 11:

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రజత్ పాటిదార్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్.

ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..