AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Vs Australia: స్పిన్‌ మంత్రజాలానికి కంగుతున్న కంగారులు.. జడ్డు విశ్వరూపం..

సెకండ్‌ టెస్ట్‌లోనూ టీమిండియా ఆధిపత్యం కొనసాగింది. రెండో ఇన్నింగ్స్‌ భారత స్పిన్నర్లు సత్తా చాటారు. ఓవర్‌ నైట్‌ స్కోరు 61/1తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌.. టీమిండియా స్పిన్నర్ల ధాటికి చిగురుటాకులా వణికిపోయి 113 పరుగులకు ఆలౌటైంది. పకడ్బందీగా బౌలింగ్ చేసి అస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను కంగారెత్తించారు.

India Vs Australia: స్పిన్‌ మంత్రజాలానికి కంగుతున్న కంగారులు.. జడ్డు విశ్వరూపం..
Ravindra Jadeja
Sanjay Kasula
|

Updated on: Feb 19, 2023 | 2:36 PM

Share

టీమిండియా స్పిన్‌ మంత్రజాలానికి మరోసారి కంగారులు కంగుతున్నారు. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో బాగంగా ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది ఆస్ట్రేలియా. భారత బౌలర్‌ జడేజా విశ్వరూపం ప్రదర్శించాడు. ఏకంగా 7 వికెట్లను పడొగొట్టి చుక్కలు చూపించాడు. అశ్విన్‌ 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఒక్క పరుగు ఆధిక్యంలో ఉంది. తాజాగా 113 పరుగులకు ఆలౌట్‌ కావడంతో భారత్‌ ముందు 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్‌ ఉంచినట్లయింది.

ఓవర్‌ నైట్‌ స్కోరు 61/1తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌కు ఆదిలోనే బిగ్ షాక్​ ఎదురైంది. పెనర్‌ ట్రెవిస్‌ హెడ్‌ను అశ్విన్‌ ఔట్ చేశాడు. 43 పరుగులు చేసిన ట్రెవిస్‌ హెడ్‌ వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఇంటి దారి పట్టాడు. దీని తర్వాత మొత్తం 95 పరుగుల వద్ద మరో మూడు వికెట్లు పడ్డాయి. మ్యాట్ రాన్ షా (2), పీటర్ హ్యాండ్స్ కోంబ్ (0), కెప్టెన్ పాట్ కమిన్స్ (0) కొద్దిసేపు పిచ్ పై నిలవలేకపోయారు. అశ్విన్ రాన్ షాను పెవిలియన్ కు పంపగా, జడేజా పీటర్, కమిన్స్ లను పెవిలియన్ కు పంపాడు. 95 పరుగులకే 7గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు వరసుగా వెనుదిరిగారు..

ఢిల్లీ టెస్టులో మూడో రోజు ఆస్ట్రేలియా స్కోరు 61/1తో ప్రారంభమైంది. క్రీజులో ట్రావిస్ హెడ్ (39), మార్నస్ లబుషెన్ (16) ఉన్నారు. ఇక్కడ ఆస్ట్రేలియా జట్టు తమ స్కోరుకు 4 పరుగులు మాత్రమే జోడించగలిగింది, అశ్విన్ ట్రెవిడ్ హెడ్ (43) నడిచాడు. దీని తర్వాత స్టీవ్ స్మిత్ మరియు లాబుషెన్ 20 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు, ఆపై స్మిత్ (9) కూడా అశ్విన్‌కు బలి అయ్యాడు.

అప్పటికే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 24 ఓవర్‌లో జడేజా వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు సాధించాడు. తొలి బంతికి హ్యాండ్‌ కాంబ్‌ను పెవిలియన్‌కు పంపగా.. రెండో బంతికి కమ్మిన్స్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. జడేజా విశ్వరూపంతో ఆస్ట్రేలియా ఆలౌట్​ అయింది.

ఢిల్లీ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది . దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 262 పరుగులకు కుదించింది. ఈ విధంగా తొలి ఇన్నింగ్స్‌ ఆధారంగా కంగారూ జట్టుకు ఒక పరుగు ఆధిక్యం లభించింది. ఇప్పుడు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను చవకగా తేల్చిన భారత జట్టు ఢిల్లీ టెస్టులో గెలవాలంటే కేవలం 115 పరుగులకే ఛేజింగ్ చేయాల్సి ఉంది. ఢిల్లీ టెస్టులో విజయం సాధించడం ద్వారా నాలుగు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌లో భారత జట్టు 2-0 ఆధిక్యం సాధించింది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం