AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. జట్టులో చేరిన విరాట్ కోహ్లీ.. లండన్ వెళ్లింది ఎందుకంటే?

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ కోసం విరాట్ కోహ్లీ డిసెంబర్ 15న భారత్ నుంచి సౌతాఫ్రికాకు చేరుకున్నాడు. అయితే 3-4 రోజుల తర్వాత ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా అకస్మాత్తుగా దక్షిణాఫ్రికా వదిలి ఇండియాకు రావాల్సి వచ్చింది. దీంతో అతను 3 రోజుల వార్మప్ మ్యాచ్ ఆడలేకపోయాడు. 'కోహ్లీ లండన్‌కు వెళ్లాలని ముందే నిర్ణయించుకున్నాడు.'

IND vs SA: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. జట్టులో చేరిన విరాట్ కోహ్లీ.. లండన్ వెళ్లింది  ఎందుకంటే?
Team India
Basha Shek
|

Updated on: Dec 24, 2023 | 5:46 PM

Share

దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్ కు ముందు టీమిండియా అభిమానులకు గుడ్‌ న్యూస్‌. భారత క్రికెట్ జట్టు స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లి జట్టులో చేరాడు. ఈ వారం ప్రారంభంలో ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా కోహ్లీ హఠాత్తుగా లండన్‌కు వెళ్లి పోయాడు. దీంతో రన్‌ మెషిన్‌ సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా?లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే డిసెంబర్ 26న సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగే మొదటి టెస్టుకు ముందే విరాట్‌ తిరిగి జట్టులోకి చేరాడు. అయితే కోహ్లి ఎందుకు లండన్ వెళ్లాడు అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే విరాట్ లండన్ వెళ్లే ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతి తీసుకున్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ కోసం విరాట్ కోహ్లీ డిసెంబర్ 15న భారత్ నుంచి సౌతాఫ్రికాకు చేరుకున్నాడు. అయితే 3-4 రోజుల తర్వాత ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా అకస్మాత్తుగా దక్షిణాఫ్రికా వదిలి ఇండియాకు రావాల్సి వచ్చింది. దీంతో అతను 3 రోజుల వార్మప్ మ్యాచ్ ఆడలేకపోయాడు. ‘కోహ్లీ లండన్‌కు వెళ్లాలని ముందే నిర్ణయించుకున్నాడు. ఇది అత్యవసరం కాదు. ఇది కూడా రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు. అతను ఇప్పటికే టీమ్ మేనేజ్‌మెంట్ అలాగే బోర్డుకు సమాచారం ఇచ్చాడు’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

దక్షిణాఫ్రికాలో తొలి టెస్టు సిరీస్ విజయం కోసం ఎదురుచూస్తున్న భారత్‌కు కోహ్లీ కీలకం. గత టూర్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ సిరీస్‌ను గెలుచుకునే అవకాశం వచ్చింది. అయితే అనూహ్యంగా తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయింది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు భారత్‌కు ఇప్పుడు మరో సువర్ణావకాశం లభించింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. టీమ్ ఇండియాలో ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే లేకపోవడంతో ఆ బాధ్యత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై పడింది. కోహ్లి దక్షిణాఫ్రికాలో 14 ఇన్నింగ్స్‌లలో 50 ఓవర్ల సగటుతో 719 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 4 టెస్టుల్లో 123 పరుగులు మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే, స్టార్ పేసర్ మహ్మద్ షమీ, బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్‌లు సిరీస్‌కు దూరమవడంతో టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌కు పెద్ద దెబ్బ తగిలింది. గైక్వాడ్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ టెస్టు జట్టులోకి వచ్చాడు. వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో కేఎస్ భరత్ జట్టులో చేరాడు.

ఇవి కూడా చదవండి

విరాట్ కోహ్లీ ప్రాక్టీస్..

భారత టెస్టు జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్‌ కృష్ణ, కేఎస్ భరత్ (వికెట్ కీపర్).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us