IND vs SA: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. జట్టులో చేరిన విరాట్ కోహ్లీ.. లండన్ వెళ్లింది ఎందుకంటే?

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ కోసం విరాట్ కోహ్లీ డిసెంబర్ 15న భారత్ నుంచి సౌతాఫ్రికాకు చేరుకున్నాడు. అయితే 3-4 రోజుల తర్వాత ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా అకస్మాత్తుగా దక్షిణాఫ్రికా వదిలి ఇండియాకు రావాల్సి వచ్చింది. దీంతో అతను 3 రోజుల వార్మప్ మ్యాచ్ ఆడలేకపోయాడు. 'కోహ్లీ లండన్‌కు వెళ్లాలని ముందే నిర్ణయించుకున్నాడు.'

IND vs SA: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. జట్టులో చేరిన విరాట్ కోహ్లీ.. లండన్ వెళ్లింది  ఎందుకంటే?
Team India
Follow us

|

Updated on: Dec 24, 2023 | 5:46 PM

దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్ కు ముందు టీమిండియా అభిమానులకు గుడ్‌ న్యూస్‌. భారత క్రికెట్ జట్టు స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లి జట్టులో చేరాడు. ఈ వారం ప్రారంభంలో ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా కోహ్లీ హఠాత్తుగా లండన్‌కు వెళ్లి పోయాడు. దీంతో రన్‌ మెషిన్‌ సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా?లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే డిసెంబర్ 26న సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగే మొదటి టెస్టుకు ముందే విరాట్‌ తిరిగి జట్టులోకి చేరాడు. అయితే కోహ్లి ఎందుకు లండన్ వెళ్లాడు అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే విరాట్ లండన్ వెళ్లే ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతి తీసుకున్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ కోసం విరాట్ కోహ్లీ డిసెంబర్ 15న భారత్ నుంచి సౌతాఫ్రికాకు చేరుకున్నాడు. అయితే 3-4 రోజుల తర్వాత ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా అకస్మాత్తుగా దక్షిణాఫ్రికా వదిలి ఇండియాకు రావాల్సి వచ్చింది. దీంతో అతను 3 రోజుల వార్మప్ మ్యాచ్ ఆడలేకపోయాడు. ‘కోహ్లీ లండన్‌కు వెళ్లాలని ముందే నిర్ణయించుకున్నాడు. ఇది అత్యవసరం కాదు. ఇది కూడా రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు. అతను ఇప్పటికే టీమ్ మేనేజ్‌మెంట్ అలాగే బోర్డుకు సమాచారం ఇచ్చాడు’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

దక్షిణాఫ్రికాలో తొలి టెస్టు సిరీస్ విజయం కోసం ఎదురుచూస్తున్న భారత్‌కు కోహ్లీ కీలకం. గత టూర్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ సిరీస్‌ను గెలుచుకునే అవకాశం వచ్చింది. అయితే అనూహ్యంగా తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయింది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు భారత్‌కు ఇప్పుడు మరో సువర్ణావకాశం లభించింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. టీమ్ ఇండియాలో ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే లేకపోవడంతో ఆ బాధ్యత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై పడింది. కోహ్లి దక్షిణాఫ్రికాలో 14 ఇన్నింగ్స్‌లలో 50 ఓవర్ల సగటుతో 719 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 4 టెస్టుల్లో 123 పరుగులు మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే, స్టార్ పేసర్ మహ్మద్ షమీ, బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్‌లు సిరీస్‌కు దూరమవడంతో టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌కు పెద్ద దెబ్బ తగిలింది. గైక్వాడ్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ టెస్టు జట్టులోకి వచ్చాడు. వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో కేఎస్ భరత్ జట్టులో చేరాడు.

ఇవి కూడా చదవండి

విరాట్ కోహ్లీ ప్రాక్టీస్..

భారత టెస్టు జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్‌ కృష్ణ, కేఎస్ భరత్ (వికెట్ కీపర్).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వరద బాధితులకు విరాళమిచ్చిన ఏకైక నటి.. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
వరద బాధితులకు విరాళమిచ్చిన ఏకైక నటి.. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. తులం ఎంతంటే?
మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. తులం ఎంతంటే?
Weekly Horoscope: వారు ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్త..
Weekly Horoscope: వారు ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్త..
నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ.. ఇలా వండారంటే అదిరిపోతుంది..
నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ.. ఇలా వండారంటే అదిరిపోతుంది..
ఆకాశానికి చిల్లు పడ్డట్లే.. మళ్లీ కుండపోత వర్షం.. హై అలర్ట్..
ఆకాశానికి చిల్లు పడ్డట్లే.. మళ్లీ కుండపోత వర్షం.. హై అలర్ట్..
పిగ్మెంటేషన్, మొటిమలకు బైబై చెప్పాలంటే ఉల్లిపాయతో ఇలా చేయండి..
పిగ్మెంటేషన్, మొటిమలకు బైబై చెప్పాలంటే ఉల్లిపాయతో ఇలా చేయండి..
స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫింగర్స్.. 20 నిమిషాల్లోనే సిద్ధం..
స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫింగర్స్.. 20 నిమిషాల్లోనే సిద్ధం..
భారత్‌ రష్యా-ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరిస్తుంది: ఇటలీ ప్రధాని
భారత్‌ రష్యా-ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరిస్తుంది: ఇటలీ ప్రధాని
ఇంట్లో తమలపాకు మొక్క పెడితే ఏం జరుగుతుంది.. ఏ దిక్కులో ఉంచాలి?
ఇంట్లో తమలపాకు మొక్క పెడితే ఏం జరుగుతుంది.. ఏ దిక్కులో ఉంచాలి?
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస..
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస..
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు