AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK Playing XI: టాస్ గెలిచిన రోహిత్.. ఇషాన్ ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11లో కీలక మార్పు?

ఈ ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మూడో మ్యాచ్ ఆడనున్నాయి. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను భారత్‌ తొలి మ్యాచ్‌లో ఓడించింది. రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరోవైపు పాకిస్థాన్‌ కూడా తన రెండు ఓపెనింగ్‌ మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను, రెండో మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించింది.

IND vs PAK Playing XI: టాస్ గెలిచిన రోహిత్.. ఇషాన్ ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11లో కీలక మార్పు?
India Vs Pakistan
Follow us
Venkata Chari

|

Updated on: Oct 14, 2023 | 1:44 PM

ICC Men’s ODI world cup India vs Pakistan Playing XI: వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో అతిపెద్ద మ్యాచ్ అంటే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పాక్ బ్యాటింగ్ చేయనుంది. శుభ్‌మన్ గిల్ ప్లేయింగ్-11కి తిరిగి వచ్చాడు. అతను ఇషాన్ కిషన్ స్థానంలో ఉన్నాడు.

ఈ ప్రపంచకప్‌లో ఇరు జట్లకు ఇది మూడో మ్యాచ్..

ఈ ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మూడో మ్యాచ్ ఆడనున్నాయి. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను భారత్‌ తొలి మ్యాచ్‌లో ఓడించింది. రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరోవైపు పాకిస్థాన్‌ కూడా తన రెండు ఓపెనింగ్‌ మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను, రెండో మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించింది.

ఇవి కూడా చదవండి

చివరి 5 మ్యాచుల్లో ఫలితాలు..

భారత్: చివరి 5 వన్డేల్లో 4 గెలిచింది. ఒక్క మ్యాచ్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

పాకిస్థాన్: 5లో 3 గెలిచింది. 2 ఓడిపోయింది.

ప్రపంచకప్‌లో అన్ని మ్యాచ్‌లు గెలిచిన భారత్..

వన్డే ప్రపంచకప్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఇరుజట్ల మధ్య ఏడు మ్యాచ్‌లు జరగ్గా, ఆతిథ్య జట్టు అన్నింటిలోనూ విజయం సాధించింది.

భారత్‌లో పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా రికార్డు..

ఇరు జట్ల మధ్య 134 వన్డేలు జరగ్గా అందులో భారత్ 56, పాకిస్థాన్ 73 విజయాలు సాధించాయి. ఐదు మ్యాచ్‌లు అసంపూర్తిగా నిలిచాయి. భారత్‌లో ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 30 వన్డేలు జరగ్గా, 19 వన్డేల్లో పాకిస్థాన్ గెలుపొందగా, 11 వన్డేల్లో మాత్రమే భారత్ గెలుపొందింది.

పిచ్ రిపోర్ట్..

నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. ఫాస్ట్ బౌలర్లు కూడా ఇక్కడ సహాయం పొందుతారు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక్కడ మంచు కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది. మంచు కురిస్తే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసే జట్టుకే ప్రయోజనం.

ఈ స్టేడియంలో ఇప్పటి వరకు మొత్తం 27 వన్డేలు జరిగాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 14 మ్యాచ్‌లు గెలుపొందగా, ఛేజింగ్ చేసిన జట్టు 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

ఇరుజట్ల ప్లేయింగ్ 11:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..