Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: ప్రపంచకప్-2023లో మరోసారి భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే?

India vs Pakistan, 12th Match: ప్రపంచకప్-2023లో శనివారం భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరు జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ మధ్యాహ్నం 1.30 గంటలకు జరుగుతుంది. అయితే, ఈ మ్యాచ్ తర్వాత రెండు జట్లు టోర్నీలో మరోసారి తలపడగలవని మీకు తెలుసా?

IND vs PAK: ప్రపంచకప్-2023లో మరోసారి భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
India Vs Pakistan Cwc 2023
Follow us
Venkata Chari

|

Updated on: Oct 14, 2023 | 1:12 PM

India vs Pakistan, 12th Match: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను క్రికెట్‌లో అతిపెద్ద మ్యాచ్‌గా పిలుస్తుంటారు. లక్షలాది మంది దీనిని చూస్తుంటారు. చూసేందుకు ఆసక్తిగా ఉంటారు. విజయాల్లో భారీ సంబరాలే కాదు.. పరాజయాల్లో ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తుంటాయి. అయితే, ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు తలపడినప్పుడల్లా ఒక్క జట్టు మాత్రమే విజేతగా నిలుస్తుంది. కానీ, ఇరుజట్ల మధ్య పోటీ జరిగితే మాత్రం.. టీమిండియాదే గెలుపుగా మారుతుంది. 1992లో సిడ్నీలో తొలిసారి తలపడినప్పటి నుంచి ప్రపంచకప్‌లో భారత్ ఏడుసార్లు పాకిస్థాన్‌ను ఓడించింది. శనివారం అహ్మదాబాద్‌లో ఆతిథ్య జట్టుతో ఈ వరుస ఓటములకు తెరపడుతుందని బాబర్ అజామ్ జట్టు భావిస్తోంది.

సరే, శనివారం మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా, రెండు జట్ల ప్రయాణం ఇంతకు మించి కొనసాగుతుంది. అది లీగ్ దశ దాటి కూడా కొనసాగవచ్చు. రెండు జట్లూ తమ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగితే, అభిమానులు ఇద్దరి మధ్య మరో మ్యాచ్‌ని చూడగలరు. ఈ మ్యాచ్ సెమీ ఫైనల్స్ లేదా ఫైనల్స్‌లో జరగవచ్చు.

ఇవి కూడా చదవండి

టోర్నీలో ఇప్పటివరకు భారత్, పాకిస్థాన్‌లు తలో రెండు మ్యాచ్‌లు ఆడాయి. ఇప్పటి వరకు ఇద్దరి ఫామ్ అద్భుతంగా ఉంది. రోహిత్ సేన ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌లను ఓడించగా, పాకిస్థాన్ నెదర్లాండ్స్, శ్రీలంకలను ఓడించింది. రెండు జట్లూ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే భవిష్యత్తులో మళ్లీ తలపడే అవకాశం ఉంది.

లీగ్ దశలో ప్రతి జట్టు 9 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇరు జట్లకు మరో 7 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. టీమ్ ఇండియా మ్యాచ్‌లు పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌ జట్లతో తలపడనుండగా.., పాకిస్థాన్ మ్యాచ్‌లు భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్‌లతో తలపడనుంది.

పాయింట్ల పట్టిక పరిస్థితి ఏమిటి?

పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా మూడో స్థానంలో ఉంది. 2 మ్యాచ్‌ల్లో భారత్‌కు 4 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ +1.500 ప్లస్‌లో ఉంది. కాగా, పాకిస్థాన్ 2 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. పాక్ నెట్ రన్ రేట్ ప్లస్ +0.927గా నిలిచింది. న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంది. 3 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లు సాధించింది. అదే సమయంలో దక్షిణాఫ్రికా 2 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..