AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Vs New Zealand 2021: ఇక నుంచి విరాట్ కోహ్లీ స్థానం అదే: తేల్చి చెప్పిన భారత టీ20 సారథి

Rohit Sharma: విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచ కప్ 2021 ముగింపుతో ఈ ఫార్మాట్‌లో టీమ్ ఇండియా కెప్టెన్సీని త్యజించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ ఫార్మాట్‌లో భారత జట్టులో కోహ్లీ భవిష్యత్తుపై ఊహాగానాలు ఎక్కువ అవుతున్నాయి.

India Vs New Zealand 2021: ఇక నుంచి విరాట్ కోహ్లీ స్థానం అదే: తేల్చి చెప్పిన  భారత టీ20 సారథి
India Vs New Zealand
Follow us
Venkata Chari

|

Updated on: Nov 16, 2021 | 7:06 PM

India Vs New Zealand 2021: భారత క్రికెట్ జట్టులో కొత్త శకం మొదలైంది. సుమారు ఐదు సంవత్సరాల తర్వాత, జట్టు మరోసారి మూడు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లను కలిగి ఉంది. అదే సమయంలో కొత్త కోచ్ పదవీకాలం కూడా ప్రారంభమైంది. వీరికి తొలి పరీక్ష నవంబర్ 17 బుధవారం జరుగబోతోంది. భారత టీ20 జట్టు కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో టీమిండియా తొలిసారిగా రంగంలోకి దిగనుంది. ఈ సిరీస్ కోసం, చాలా మంది కొత్త, యువ ఆటగాళ్లకు కూడా జట్టులో అవకాశం ఇచ్చారు. వీరు భవిష్యత్తులో జట్టులో సాధారణ సభ్యులుగా మారే అవకాశం ఉంది. దీంతో జట్టులోని కొంతమంది సీనియర్ సభ్యుల పాత్ర ప్రశ్నార్థకమవనుందా అంటే.. అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇందులో అత్యంత ముఖ్యమైనది మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli), దీని గురించి కొత్త కెప్టెన్ రోహిత్ తన మొదటి విలేకరుల సమావేశంలో ప్రస్తుత పరిస్థితిని స్పష్టంగా వివరించాడు.

బుధవారం నుంచి జైపూర్‌లో ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌కు ఒక రోజు ముందు రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ విలేకరుల సమావేశం జరిగింది. దీనిలో రాబోయే కాలంలో జట్టు అత్యంత ప్రముఖ బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పాత్ర గురించి చాలా ముఖ్యమైన ప్రశ్నలలో ఒకటి. టీ20 ప్రపంచ కప్ 2021 ముగియడంతో కోహ్లీ ఇటీవల ఈ ఫార్మాట్‌లో జట్టు కెప్టెన్సీని వదులుకున్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అప్పటి నుంచి ఈ ఫార్మాట్‌లో టీమిండియాలో కోహ్లీ స్థానం గురించి ఊహాగానాలు, ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కెప్టెన్‌గా రోహిత్ మొదటి విలేకరుల సమావేశంలోనే ఇలాంటి ప్రశ్నను ఎదుర్కోవలసి వచ్చింది.

కోహ్లీ పాత్రపై రోహిత్ ఏమన్నాడంటే..? నవంబర్ 16 మంగళవారం జరిగిన ఈ వర్చువల్ విలేకరుల సమావేశంలో, రాబోయే కాలంలో ఈ జట్టులో బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ పాత్ర ఏమిటని కొత్త భారత టీ20 జట్టు కెప్టెన్‌ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రోహిత్ స్పందిస్తూ, కోహ్లీ ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు.

“కోహ్లీ ఇప్పటివరకు జట్టు కోసం ఏం చేస్తున్నాడో అలాగే కొనసాగుతుంది. దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు. జట్టు తరఫున ఆడినప్పుడల్లా తనదైన ముద్ర వేస్తాడు. ప్రతి ఆటగాడికి మ్యాచ్ నుంచి మ్యాచ్‌కి పాత్ర మారుతుంది. విరాట్ తిరిగి వచ్చినప్పుడు అది మా జట్టును బలోపేతం చేస్తుంది. ఎందుకంటే అతనో గొప్ప బ్యాట్స్‌మెన్. అతనికి ఎంతో అనుభవం ఉంది’ అని తెలిపాడు.

ప్రపంచకప్‌లో కోహ్లీ పరిస్థితి ఎలా ఉందంటే..? కెప్టెన్‌గా తొలి, చివరి టీ20 వరల్డ్‌కప్‌లో ఆడిన కోహ్లికి టోర్నీలో టీమిండియా పరిస్థితి బాగోలేకపోవడంతో 5 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 3 సార్లు మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో, క్లిష్ట పరిస్థితుల్లో 57 పరుగులు చేసిన కోహ్లీ, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో దానిని రెట్టింపు చేయడంలో విఫలమయ్యాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను అజేయంగా 2 పరుగులు చేశాడు. కోహ్లి టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 3200 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఇది ఈ ఫార్మాట్‌లో ఏ బ్యాట్స్‌మెన్‌కి సాధ్యం కాలేదు.

Also Read: T20 World Cup: 2024 టీ20 ప్రపంచ కప్ ఆదేశంలోనే.. 2031 వరకు నిర్వహించే దేశాల లిస్టు రెడీ.. భారత్‌లో మూడు మెగా ఈవెంట్‌లు..!

Uganda Blast: భారత ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.. హోటల్ వద్ద బాంబు పేలుడు..!