AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Ireland: కెప్టెన్‌గా తొలి విజయం.. రీఎంట్రీలో సత్తా చాటిన జస్ప్రీత్ బుమ్రా..

IND vs IRE: వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. క్రమంగా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌ని కొనసాగించలేకపోయారు. చివరగా, డక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం, టీమిండియా 2 పరుగుల ఆధిక్యాన్ని కొనసాగించడంతో టీమిండియాను విజేతగా ప్రకటించారు. సిరీస్‌లో రెండో మ్యాచ్ 20న, చివరి మ్యాచ్ ఆగస్టు 23న జరగనుంది.

India vs Ireland: కెప్టెన్‌గా తొలి విజయం.. రీఎంట్రీలో సత్తా చాటిన జస్ప్రీత్ బుమ్రా..
Ind Vs Ire
Venkata Chari
|

Updated on: Aug 19, 2023 | 6:23 AM

Share

భారత్-ఐర్లాండ్ (India vs Ireland) మధ్య టీ20 సిరీస్ ప్రారంభ మ్యాచ్ వర్షం కారణంగా తొలి మ్యాచ్ సగంలోనే రద్దయింది. ఇదిలావుండగా, బలమైన బౌలింగ్‌తో బ్యాటింగ్‌లో వేగవంతమైన ఆరంభంతో టీమిండియా (Team India) డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం 2 పరుగుల తేడాతో తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. అలాగే, 11 నెలల తర్వాత టీమిండియాకు పునరాగమనం చేసిన జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah).. తాను కెప్టెన్సీ వహించిన తొలి మ్యాచ్‌లోనే జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అలాగే, ఊహించినట్లుగానే, జట్టులోని ఇద్దరికి కూడా తమ తొలి టీ20 మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. జట్టు తరపున రింకూ సింగ్, ప్రసీద్ధ్ కృష్ణలకు తొలి టీ20 మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ప్రసీద్ధ్ కృష్ణ విజయం సాధించగా, రింకూ సింగ్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు.

ఇవి కూడా చదవండి

సరిగ్గా ఏడాది తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేసిన బుమ్రా.. ఆడిన తొలి మ్యాచ్‌లోనే తన పాత రిథమ్‌కి చేరుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ ఓవర్ తొలి బంతికి బౌండరీ బాదిన బుమ్రా తర్వాతి బంతికి ఆండీ బల్బిర్నీని బౌల్డ్ చేసి ​​ప్రతీకారం తీర్చుకున్నాడు. అలాగే అదే ఓవర్లో బుమ్రా లోర్కాన్ టక్కర్ వికెట్ కూడా పడగొట్టాడు.

తొలి మ్యాచ్‌లో మెరిసిన ప్రసీద్ధ్ కృష్ణ..

బుమ్రా ఈ అద్భుత ఆరంభం తర్వాత, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, ప్రసీద్ధ్ కృష్ణ వికెట్లను వెంబడించారు. టీ20లో తొలి ఓవర్ వేసిన ప్రసీద్ధ్ కృష్ణ హ్యారీ టెక్టర్ వికెట్ తీశాడు. తర్వాతి ఓవర్‌లో బిష్ణోయ్ ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్‌ను బౌల్డ్ చేశాడు. మళ్లీ ఏడో ఓవర్లో ప్రసీద్ధ్ కృష్ణ జార్జ్ డాక్రెల్‌కు పెవిలియన్ దారి చూపించాడు. దీంతో ఐర్లాండ్ కేవలం 6.3 ఓవర్లలో 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బిష్ణోయ్ 11వ ఓవర్‌లో మార్క్ అడైర్‌కు బలయ్యాడు.

33 బంతుల్లో ఫిఫ్టీ..

ఇక్కడి నుంచి కర్టిస్ కాంఫర్, బారీ మెక్‌కార్తీలు ఐర్లాండ్ ఇన్నింగ్స్‌ను నిర్వహించడమే కాకుండా భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ 44 బంతుల్లో 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. కానీ, జస్ప్రీత్ బుమ్రా 19వ ఓవర్‌లో రన్ రేట్‌కు అడ్డుకట్ట వేశాడు. కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. కానీ, అర్షదీప్ వేసిన 20వ ఓవర్‌లో మెక్‌కార్తీ చివరి రెండు బంతుల్లో వరుసగా సిక్సర్లు బాదడమే కాకుండా కేవలం 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐర్లాండ్ జట్టు 139 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

టీమిండియా విజయం..

భారత్‌కు యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ స్థిరమైన ఆరంభాన్ని అందించారు. అయితే, వీరిద్దరూ వేగంగా బ్యాటింగ్ చేయలేకపోయారు. దీంతో పవర్‌ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. ఆ తర్వాత ఏడో ఓవర్లో ఐర్లాండ్ పేసర్ క్రెయిగ్ యంగ్ వరుసగా రెండు బంతుల్లో జైస్వాల్, తిలక్ వర్మలను బౌల్డ్ చేశాడు.

2 పరుగుల తేడాతో భారత్ విజయం..

వెస్టిండీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన తిలక్ ఒక్క బంతికే తన ఖాతా తెరవకుండానే తొలిసారి ఔటయ్యాడు. ఈసారి వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. క్రమంగా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌ని కొనసాగించలేకపోయారు. చివరగా, డక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం, టీమిండియా 2 పరుగుల ఆధిక్యాన్ని కొనసాగించడంతో టీమిండియాను విజేతగా ప్రకటించారు. సిరీస్‌లో రెండో మ్యాచ్ 20న, చివరి మ్యాచ్ ఆగస్టు 23న జరగనుంది.

టీమిండియా ప్రదర్శన..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..