AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: మీడియా ముందు డైలాగులు కాదు.. చివరిదాకా ఉండి గెలిపించాల్సింది: షకీబ్‌‌కు స్ట్రాంగ్ కౌంటర్

T20 World Cup 2022: భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌కు ముందు షకీబ్ అల్ హసన్ ఇచ్చిన ఓ స్టేట్‌‌మెంట్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ధీటుగా సమాధానమిచ్చాడు.

IND vs BAN: మీడియా ముందు డైలాగులు కాదు.. చివరిదాకా ఉండి గెలిపించాల్సింది: షకీబ్‌‌కు స్ట్రాంగ్ కౌంటర్
Ind Vs Ban Shakib Al Hasan
Venkata Chari
|

Updated on: Nov 03, 2022 | 2:55 PM

Share

టీ20 ప్రపంచ కప్ 2022లో భారత జట్టు బంగ్లాదేశ్‌తో నాల్గవ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది ఉత్కంఠభరితమైన మ్యాచ్. ఫాస్ట్ బ్యాటింగ్, వర్షం నుంచి అద్భుతమైన ఫీల్డింగ్ వరకు అన్నీ మ్యాచ్‌లో కనిపించాయి. ఈ మ్యాచ్‌కు ముందు, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మాట్లాడుతూ, మేం టీ20 ప్రపంచకప్ గెలవడానికి ఇక్కడకు రాలేదని, టీమిండియాను ఓడించేందుకు వచ్చామని, అప్పుడు ఫలితం రివర్స్ అవుతుందని చెప్పుకొచ్చాడు.

మ్యాచ్‌కు ముందు రోజు గురించి షకీబ్ మాట్లాడుతూ.. ‘మేం టీ20 ప్రపంచకప్‌ గెలవడానికి ఇక్కడికి రాలేదు. భారత్ ప్రపంచకప్ గెలవడానికి వచ్చింది. రేపు మేం గెలిస్తే అది విజయవంతమైన విజయం అవుతుందని చెప్పుకొచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలవలేకపోయింది. షకీబ్‌ వ్యాఖ్యలకు భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ధీటుగా సమాధానమిచ్చాడు.

కెప్టెన్ బాధ్యత వహించాలి..

క్రిక్‌బజ్‌లో సెహ్వాగ్ మాట్లాడుతూ, “కెప్టెన్ దీనికి బాధ్యత వహించాలి. మొదట నజ్ముల్ శాంటో ఔట్ కాగా, అదే ఓవర్లో షకీబ్ అవుటయ్యాడు. అక్కడ పొరపాటు జరిగింది. 99/3, 100/4, 102/5 ఈ మూడు వికెట్లు భాగస్వామ్యాన్ని నెలకొల్పుతాయి. టీ20లో 50 పరుగుల భాగస్వామ్యం అవసరం లేదు. కానీ, 10 బంతుల్లో 20 పరుగుల భాగస్వామ్యం కూడా ఆటను మలుపు తిప్పగలదని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

సూటిగా ప్రకటనలు చేయడం తప్పు..

“కెప్టెన్ కూడా తప్పు చేశాడని అనుకుంటున్నాను. కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. విరాట్ కోహ్లి ఆడినట్లుగా బాధ్యత తీసుకుని చివరి వరకు ఆడండి. టీమ్‌ను మధ్యలోనే వదిలిరావొద్దు. లేదా ఇలాంటి ప్రకటనలు చేయడం ఆపాలి” అని కౌంటర్ ఇచ్చాడు.

ఈ మ్యాచ్‌లో వర్షం కీలక పాత్ర పోషించడం గమనార్హం. టీమిండియా ఇచ్చిన టార్గెట్‌ను ఛేదించేందుకు బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్‌కు శుభారంభం లభించింది. తొలి 7 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. కానీ, వర్షం తర్వాత మళ్లీ ప్రారంభమైన మ్యాచ్‌లో లిట్టన్ దాస్ రనౌట్‌గా వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత బంగ్లా జట్టు వరుసగా వికెట్లను కోల్పోతూ ఓటమిపాలైంది.

లిట్టన్ దాస్ 27 బంతుల్లో 60 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 222.22 స్ట్రైక్ రేట్ వద్ద బ్యాటింగ్ చేస్తున్న లిట్టన్ రనౌట్‌గా వెనుదిరిగాడు.