ICC WTC 2023: ఐపీఎల్ తర్వాతే అసలైన సవాల్.. దూరమైన కీలక ప్లేయర్లు.. ట్రోఫీ దక్కాలంటే వీళ్లే కీలకం..
WTC 2023 Final: భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో బిజీగా ఉన్నారు. ఉత్కంఠ దశకు చేరుకున్న ఐపీఎల్ 2023 (IPL 2023) ఈ నెలాఖరులో ముగియనుంది. మే 28న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ మ్యాచ్తో ఐపీఎల్ 16వ ఎడిషన్కు తెర పడనుంది.

భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో బిజీగా ఉన్నారు. ఉత్కంఠ దశకు చేరుకున్న ఐపీఎల్ 2023 (IPL 2023) ఈ నెలాఖరులో ముగియనుంది. మే 28న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ మ్యాచ్తో ఐపీఎల్ 16వ ఎడిషన్కు తెర పడనుంది. దీని తర్వాత, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లండ్కు వెళ్లనున్నారు. ఐపీఎల్ ఫైనల్ ఆడే ఆటగాళ్లు మినహా మిగిలిన ఆటగాళ్లు త్వరలో లండన్ బయలుదేరనున్నారు. కాబట్టి, టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ (ICC WTC Final) మ్యాచ్పై ఆసక్తి నెలకొంది. కానీ, టీమిండియా ఆటగాళ్లు ఒక్కొక్కరుగా గాయాలతో జట్టు నుంచి తప్పుకోవడంతో ఆందోళనలు పెరుగుతున్నాయి.
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ జూన్ 7 నుంచి 11 వరకు జరగనుంది. లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం ఈ చారిత్రాత్మక పోరుకు సాక్ష్యం కానుంది. ఈ కీలక టోర్నమెంట్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇప్పటికే టీమ్ ఇండియాను ప్రకటించింది.
అంతకుముందు టెస్టు జట్టు నుంచి తప్పుకున్న అజింక్యా రహానే మళ్లీ పునరాగమనం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో రహానే తన తుఫాన్ బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహించనుండగా, శుభమన్ గిల్ వైప్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. కేఎస్ భరత్ వికెట్ కీపర్గా వ్యవహరించనున్నాడు.




చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, మిడిల్ ఆర్డర్లో బలమైన ప్లేయర్లుగా నిలిచారు. నలుగురు ఆల్ రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్ ఎంపికయ్యారు. పేసర్ల విభాగంలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ లు చోటు దక్కించుకున్నారు.
స్టార్ ప్లేయర్లు ఔట్..
గాయం నుంచి కోలుకోని జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్కు దూరమయ్యాడు. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ కూడా విశ్రాంతి అవసరం. కాబట్టి వారు అందుబాటులో లేరు. కాగా, ఐపీఎల్లో గాయపడిన కేఎల్ రాహుల్ కూడా ఈ కీలక టోర్నీకి దూరమయ్యాడు. మే 1న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో గాయపడిన రాహుల్కు ఇప్పుడు శస్త్రచికిత్స జరిగింది. రాహుల్కి బదులుగా బీసీసీఐ ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు. వికెట్ కీపర్ అవసరం దృష్ట్యా ఇషాన్ కిషన్ లేదా వృద్ధిమాన్ సాహాను ఎంపిక చేసే అవకాశం ఉంది.
WTC ఫైనల్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, KS భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




