Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS 3rd Test Playing XI: రాహుల్ లేదా గిల్‌.. 3వ టెస్టులో టీమిండియా ప్లేయింగ్ XIలో ఆడేది ఎవరు?

India Vs Australia: భారత్‌- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో మ్యాచ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఇండోర్‌లో మరికొన్ని గంటల్లో భారత్-ఆస్ట్రేలియా మరోసారి ముఖాముఖిగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి.

IND vs AUS 3rd Test Playing XI: రాహుల్ లేదా గిల్‌.. 3వ టెస్టులో టీమిండియా ప్లేయింగ్ XIలో ఆడేది ఎవరు?
Teamindia
Follow us
Venkata Chari

|

Updated on: Feb 28, 2023 | 3:49 PM

భారత్‌- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో మ్యాచ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఇండోర్‌లో మరికొన్ని గంటల్లో భారత్-ఆస్ట్రేలియా మరోసారి ముఖాముఖిగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం సిరీస్‌లో భారత జట్టు 2-0తో ముందంజలో ఉండగా.. ఇప్పుడు ఈ ఆధిక్యాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఇటువంటి పరిస్థితిలో, ప్లేయింగ్ 11పై ఆసక్తి నెలకొంది. మొదటి రెండు టెస్టులకు భారత్ అదే ప్లేయింగ్ ఎలెవన్‌తో వెళ్తుందా లేదా ఇండోర్‌లో ఏమైనా మార్పులు ఉంటాయా? అనేది చూడాల్సి ఉంది.

ప్లేయింగ్ ఎలెవన్‌కు సంబంధించి భారత జట్టు మేనేజ్‌మెంట్ ముందున్న అతిపెద్ద ప్రశ్న కేఎల్ రాహుల్ గురించి. కేఎల్ రాహుల్‌కు మరో అవకాశం లభిస్తుందా లేక శుభ్‌మన్ గిల్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంటారా? అనేది చూడాల్సి ఉంది.

రాహుల్, గిల్ మధ్య ఎవరు?

టీమ్ ఇండియా నెట్స్ నుంచి బయటకు వచ్చిన ఫొటోలను చూస్తుంటే, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్‌లకు ఫిఫ్టీ-ఫిఫ్టీ అవకాశాలు ఉన్నాయి. ఆటగాళ్లిద్దరూ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. జట్టు ప్రధాన కోచ్ ఇరువురిపై నిఘా ఉంచారు. ప్రాక్టీస్‌లో శుభ్‌మాన్ గిల్ దూకుడు వైఖరిని ప్రదర్శించగా, రాహుల్ తన డిఫెన్స్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. ఏది ఏమైనప్పటికీ, గిల్ ఆటతీరును సూచించే ఒక విషయం ఏమిటంటే, రాహుల్ ద్రవిడ్ అతనిని స్వయంగా బౌలింగ్ చేసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించాడు.

ఇవి కూడా చదవండి

టీమిండియా మిడిల్ ఆర్డర్ ఫిక్స్..

ఈ ఇద్దరిలో టీమ్ మేనేజ్‌మెంట్ ఎవరిని సెలెక్ట్ చేస్తుందో, ఎవరిని బెంచ్‌లో కూర్చోబెడతారో చూడాలి. మిడిలార్డర్‌లో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం లేదు. మిడిలార్డర్‌ను బలోపేతం చేసే బాధ్యత పుజారా, కోహ్లి, అయ్యర్‌పై ఉంది. ఇక్కడ విరాట్ భారీ స్కోరు చేస్తాడని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు సిరీస్‌లో ఆడిన 3 ఇన్నింగ్స్‌ల్లో 76 పరుగులు మాత్రమే చేశాడు. టెస్టు క్రికెట్‌లో సెంచరీ చేసి 3 ఏళ్లు దాటింది.

బౌలింగ్‌లో మార్పు లేదు..

తొలి రెండు టెస్టుల్లో బ్యాట్‌తో ఆకట్టుకోకపోయినా కేఎస్ భరత్ అవకాశం దక్కడం ఖాయం. 7వ నంబర్‌లో బ్యాటింగ్‌ చేస్తాడు. బౌలింగ్ విభాగంలో కూడా టీమ్ ఇండియా ఎలాంటి మార్పులు చేయబోవడం లేదు. ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేయడం మాత్రమే కాదు.. వారిద్దరూ మొదటి రెండు టెస్టుల్లో బ్యాటింగ్‌తో కూడా గణనీయమైన సహకారం అందించారు. నాగ్‌పూర్‌లో అక్షర్ 84, ఢిల్లీలో 74 పరుగులు చేశాడు. అశ్విన్ నాగ్‌పూర్‌లో నైట్‌వాచ్‌మన్ బ్యాట్స్‌మెన్‌గా 23 పరుగులు, ఢిల్లీలో 37 పరుగులు అందించాడు. మరోవైపు స్పిన్నర్లకు ఉపయోగపడే పిచ్‌లపై కూడా షమీ, సిరాజ్‌లు చాలా సందర్భాల్లో జట్టుకు అవసరమైన విజయాలను అందించారు.

భారత ప్రాబబుల్ ప్లేయింగ్ XI..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..