AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG : సెప్టెంబర్‌లో పొట్టి క్రికెట్ ధమాకా… హోరాహోరీ టీ20 యుద్ధానికి భారత్, ఆఫ్ఘనిస్థాన్ సై

IND vs AFG : సెప్టెంబర్‌లో భారత్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనున్నట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా యువ జట్టు మరోసారి బరిలోకి దిగనుండగా, ఈ సిరీస్ భారత అభిమానులకు క్రికెట్ వినోదాన్ని అందించనుంది.

IND vs AFG : సెప్టెంబర్‌లో పొట్టి క్రికెట్ ధమాకా... హోరాహోరీ టీ20 యుద్ధానికి భారత్, ఆఫ్ఘనిస్థాన్ సై
Ind Vs Afg
Rakesh
|

Updated on: Jul 24, 2026 | 6:54 AM

Share

IND vs AFG : భారత క్రికెట్ అభిమానులకు త్వరలోనే మరో హోరాహోరీ టీ20 సిరీస్ వినోదం అందుబాటులోకి రానుంది. క్రికెట్ వర్గాల కథనాల ప్రకారం.. సెప్టెంబర్ నెలలో భారత క్రికెట్ జట్టు, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనున్నట్లు సమాచారం. ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్ ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో నివేదిక ప్రకారం.. ఈ మ్యాచ్‌లను సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో నిర్వహించేలా ముసాయిదా షెడ్యూల్ సిద్ధం చేశారు. అయితే మ్యాచ్‌లు జరిగే వేదికలను ఇంకా అధికారికంగా నిర్ణయించాల్సి ఉంది. ఈ సిరీస్‌కు సంబంధించి బీసీసీఐ లేదా ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ప్రస్తుతం భారత జట్టు బిజీ బిజీ షెడ్యూల్‌తో గడుపుతోంది. ఇటీవల ముగిసిన జింబాబ్వే పర్యటన తర్వాత, శ్రీలంకతో సుదీర్ఘ టెస్టు సిరీస్, ఆపై వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లలో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్‌లు ముగిసిన వెంటనే, సెప్టెంబర్ చివర్లో, అక్టోబర్ ప్రారంభంలో ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. కాబట్టి శ్రీలంకతో సిరీస్ ముగిసిన వెంటనే, ఆసియా క్రీడల ఆరంభానికి ముందు లభించే చిన్న విరామంలో ఈ భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్‌ను నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

విశేషమేమిటంటే.. ఈ సిరీస్‌కు అధికారిక ఆతిథ్య హక్కులు ఆఫ్ఘనిస్థాన్ బోర్డువే అయినప్పటికీ మ్యాచ్‌లు మాత్రం భారతదేశంలోనే జరగనున్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో భద్రతా కారణాల దృష్ట్యా ఆ దేశ జట్టు చాలాకాలంగా భారత్‌ను తమ హోమ్ గ్రౌండ్‎గా ఉపయోగించుకుంటోంది. గతంలో లక్నో, డెహ్రాడూన్, గ్రేటర్ నోయిడాలోని స్టేడియంలు ఆఫ్ఘనిస్థాన్‌కు హోమ్ మైదానాలుగా సేవలు అందించాయి. కాబట్టి ఈసారి కూడా భారతీయ మైదానాల్లోనే ఈ మ్యాచ్‌లు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

దీనికి ముందు జూన్ నెలలో ఆఫ్ఘనిస్థాన్ జట్టు భారతదేశంలో పర్యటించింది. ఆ సమయంలో ఒక టెస్టు, మూడు వన్డేల సిరీస్ జరిగింది. టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్, 300 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించగా, వన్డే సిరీస్‌ను కూడా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అయినప్పటికీ, పొట్టి ఫార్మాట్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను తేలికగా తీసిపారేయలేం. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లలో ఓటములను ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత టీ20 యంగ్‌బ్రిగేడ్‌కు తమ ఫామ్‌ను తిరిగి పుంజుకోవడానికి ఈ సిరీస్ ఒక మంచి అవకాశం కానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us