సెమీస్లో భారత్తో తలపడనున్న జట్టేదంటే..?
ఉత్కంఠగా సాగుతున్న వరల్డ్కప్ 2019 సెమీస్కు దగ్గరపడింది. ఈ నెల 9, 11 తేదీల్లో సెమీ ఫైనల్స్ జరగనున్నాయి. మొత్తం నాలుగు టీమ్లు సెమీస్లోకి ఎంట్రీ ఇవ్వనుండగా.. ఇప్పటికే ఆస్ట్రేలియా(14పాయింట్లు), భారత్(13పాయింట్లు)లు బెర్త్లు ఖరారు చేసుకోగా తాజాగా న్యూజిలాండ్పై విజయం సాధించిన ఇంగ్లండ్(12పాయింట్లు)ఆ లిస్ట్లో చేరింది. కాగా సెమీస్కు వెళ్లనున్న మరో టీమ్పై ఇప్పటికీ టెన్షన్ కొనసాగుతోంది. 11 పాయింట్లతో పట్టికలో న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ.. సెమీ ఫైనల్ బెర్త్ కోసం ఆ టీమ్ పాకిస్తాన్-బంగ్లాదేశ్ […]
ఉత్కంఠగా సాగుతున్న వరల్డ్కప్ 2019 సెమీస్కు దగ్గరపడింది. ఈ నెల 9, 11 తేదీల్లో సెమీ ఫైనల్స్ జరగనున్నాయి. మొత్తం నాలుగు టీమ్లు సెమీస్లోకి ఎంట్రీ ఇవ్వనుండగా.. ఇప్పటికే ఆస్ట్రేలియా(14పాయింట్లు), భారత్(13పాయింట్లు)లు బెర్త్లు ఖరారు చేసుకోగా తాజాగా న్యూజిలాండ్పై విజయం సాధించిన ఇంగ్లండ్(12పాయింట్లు)ఆ లిస్ట్లో చేరింది. కాగా సెమీస్కు వెళ్లనున్న మరో టీమ్పై ఇప్పటికీ టెన్షన్ కొనసాగుతోంది.
11 పాయింట్లతో పట్టికలో న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ.. సెమీ ఫైనల్ బెర్త్ కోసం ఆ టీమ్ పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ కోసం ఎదురుచూడాల్సి ఉంది. రన్రేట్ పరంగా పాక్ కన్నా న్యూజిలాండ్ మెరుగ్గా ఉండగా.. దాన్ని దాటి పాక్ సెమీస్ చేరేందుకు బంగ్లాదేశ్పై 316పరుగులు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాక్ ఓడి న్యూజిలాండ్ సెమీస్కు బెర్త్ ఖరారు అయితే.. అందులో భాగంగా ఈ నెల 11న ఇంగ్లాండ్తో తలపడనుంది భారత్. ఇలా కాకుండా దక్షణాఫ్రికాపై ఆస్ట్రేలియా ఓడి.. శ్రీలంకపై భారత్ గెలిస్తే న్యూజిలాండ్తో సెమీస్ ఆడనుంది భారత్.